logo

చట్నీ సాంబార్‌ టీజర్‌ విడుదల

పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్‌ ‘చట్నీ సాంబర్‌’ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు.

Published : 03 Jul 2024 00:33 IST

చెన్నై, న్యూస్‌టుడే: పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్‌ ‘చట్నీ సాంబర్‌’ వెబ్‌ సిరీస్‌ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు. వాణిబోజన్, కయల్‌ చంద్రన్, నితిన్‌ సత్య, దీపాశంకర్, సంయుక్తా విశ్వనాథన్, సుందర్‌ రాజన్‌ తదితరులు ఇతర నటీనటులు. ఇది రాధా మోహన్‌కు తొలి వెబ్‌ సిరీస్‌ కావడం గమనార్హం. దీని ఫస్ట్‌లుక్‌ను కొన్ని రోజుల కిందట డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం టీజర్‌ను విడుదల చేశారు.


చెన్నై చేరుకున్న అజిత్‌

చెన్నై, న్యూస్‌టుడే: మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలోని ‘విడాముయర్చి’ చిత్రంలో అజిత్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తుదిదశ చిత్రీకరణ పనులు అజర్‌బైజాన్‌ దేశంలో జరుగుతున్న నేపథ్యంలో వాటిలో అజిత్‌కుమార్‌ పాల్గొని తనకు సంబంధించిన సన్నివేశాల్లో నటించారు. చిత్రీకరణను పూర్తి చేసుకుని ఆయన చెన్నైకు తిరిగి వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని