ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి
తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.
గంగాదేవి
ప్యారిస్, న్యూస్టుడే: తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం కామరాజర్ నగర్లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలి తల్లితో.. తాను చెన్నైలో ఎస్సైనని, ఎన్కౌంటర్ విషయమై తూత్తుక్కుడికి వచ్చానని, రెండు రోజులు వారి ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో ఇంట్లో ఉండేందుకు ఆమె అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో గంగాదేవి ఇంట్లో ఉన్న బంగారు నగలు, నగదు చోరీచేసి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి శుక్రవారం మరో స్నేహితురాలి ఇంట్లో ఈ విధంగానే నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. సోమవారం గంగాదేవిని అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశ పరీక్షలతో పనిలేదు!
[ 05-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం రాష్ట్ర విద్యా వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసింది. నివేదిక రూపంలో 550 పేజీల పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్కు అందజేసింది. -
మరో కమల్లా మారిన విజయ్
[ 05-07-2024]
డీఎంకేకు మద్దతుగా మాట్లాడి టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో కమల్హాసన్గా మారారని హిందూ మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్సంపత్ పేర్కొన్నారు. -
ఘనంగా స్వామి వివేకానంద సంస్మరణ వేడుక
[ 05-07-2024]
స్వామి వివేకానంద నిర్యాణ దినం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపం ప్రాంగణంలో అన్నపూజ చేశారు. -
రాష్ట్రంలో జికా వైరస్ ప్రభావం లేదు
[ 05-07-2024]
మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో దాని ప్రభావం లేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం పేర్కొన్నారు. -
పలు సంస్థలతో ఐఐటీఎం ఒప్పందం
[ 05-07-2024]
కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘స్వయం ప్లస్’ ఆన్లైన్ విద్యా పథకంలో భాగంగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
రాష్ట్రంలో తెలుగును బతికించండి
[ 05-07-2024]
తమిళనాడులో తెలుగును బతికించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమిళనాడు తెలుగు యువశక్తి విభాగ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇటీవల అమరావతిలో కలిసి విజ్ఞప్తి చేశారు. -
దయగల దంపతులు
[ 05-07-2024]
ఆకలితో అలమటించే నిరాశ్రయులు, అనాథలను చూసి మనసు చలించి వారికి తమ వంతు సేవ చేయాలని ముందుకొచ్చారు జాన్సన్ జెబకుమార్, షరీన్ జోషువా దంపతులు. -
రోశయ్య సహృదయత మరువలేనిది సీఎంకే రెడ్డి
[ 05-07-2024]
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య సహృదయత మరువలేనిదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. -
ఏళు కడల్ ఏళు మలై రెండో సింగిల్ విడుదల నేడు
[ 05-07-2024]
రామ్ దర్శకత్వంలో నివిన్ పౌలి, అంజలి, సూరి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలైౖ’. సురేశ్ కామాట్చికి చెందిన ‘వి హౌస్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.