ఏడాదిలో 8 నెలలపాటు తీవ్ర ఎండలు
వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో కరవు, వడగాలుల ప్రభావం ఎక్కువైంది.
అన్నా వర్సిటీ అధ్యయనంలో వెల్లడైన ఆందోళనకర విషయాలు
ప్యారిస్, న్యూస్టుడే: వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భారతదేశంలో కరవు, వడగాలుల ప్రభావం ఎక్కువైంది. ఓ వైపు బెంగళూరు, దిల్లీ మొదలైన నగరాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా వడదెబ్బ మరణాలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా ఎండతో పాటు ఆకస్మిక భారీవర్షాలు కురుస్తుండటం పెద్ద సమస్యగా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర పరిణామాలు నెలకొంటున్న స్థితిలో ఓ అధ్యయన ఫలితాలు రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో ఏడాదిలో 8 నెలలపాటు ఎండ తీవ్రత ఉంటుందని, ఉష్ణోగ్రతలను ప్రజలు భరించలేక తీవ్రంగా ఇబ్బంది పడతారని అన్నా విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
అసాధారణ మార్పులు
అన్నా వర్సిటీలోని వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ కేంద్రం జరిపిన అధ్యయనంలో... నిరంతర పట్టణీకరణ కారణంగా రాష్ట్రంలోని నగరాలతో పాటు దేశంలో ఉన్న 21 నగరాల్లో రానున్న 25 ఏళ్లలో ఉష్ణోగ్రతల ప్రభావం తీవ్రంగా ఉండి, 2050 నాటికి ప్రస్తుతం వేసవి కాలంలో ఉన్నదాని కన్నా రెండింతలు ఉష్ణోగ్రతలు ఏడాదిలో 8 నెలలపాటు ఉంటాయని, ప్రజలు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వివరించింది. రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా సగటు ఉష్ణోగ్రతలు 29.5 నుంచి 33.4 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయని, సగటు వర్షపాతం 763 మి.మీ నుంచి 1432 మి.మీ వరకు ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న సగటు ఉష్ణోగ్రతలు 2050లో 0.4 డిగ్రీ సెల్సియస్ పెరుగుతాయని, 2080లో 1.3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయని అంచనా వేసింది. అదేవిధంగా 2,100 నాటికి సగటు ఉష్ణోగ్రత 1.7 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని, రాష్ట్రంలో ఉత్తర జిల్లాలైన చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, వేలూర్, చెంగల్పట్టు, రాణిపేట తదితర జిల్లాల్లో రానున్న కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అంతేకాకుండా చెన్నై, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, తంజావూరు తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న దానికన్నా రెండింతలు అధికంగా వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. అంతేకాకుండా అసాధారణ వర్షాలు కూడా రాష్ట్రంలో బాధింపు కలిగిస్తాయని అంచనా వేసింది. సముద్రతీర జిల్లాల్లో స్వల్ప కాలంలో అసాధారణంగా భారీవర్షాలు కురుస్తాయని, 2050లో సగటు వర్షపాతం 4 శాతం, 2080లో 11 శాతం, 2100లో 16 శాతం పెరుగుతాయని, ఒకవేళ కాలుష్యం పెరిగితే 2050లో 7 శాతం, 2,100లో 26 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కడలూరు, నాగపట్టణం, మైలాడుదురైలో ఈ సగటు వర్షపాతంలో మార్పు కనిపిస్తుందని, 24 గంటల్లో 6 నుంచి 7 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిసంద్రంలో నరకం!
[ 03-07-2024]
వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. -
స్నాతకోత్సవానికి మంత్రి గైర్హాజరు
[ 03-07-2024]
అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. -
పారిశుద్ధ్య కార్మికులను బస్సులో ఎక్కనివ్వని కండక్టర్ సహా ఇద్దరి సస్పెన్షన్
[ 03-07-2024]
తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్ సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. -
పాఠశాలలో కుల ఘర్షణ
[ 03-07-2024]
తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. -
డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం
[ 03-07-2024]
విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. -
చట్నీ సాంబార్ టీజర్ విడుదల
[ 03-07-2024]
పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్ ‘చట్నీ సాంబర్’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవరు మృతి
[ 03-07-2024]
పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కామరాజ్ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. -
ప్రభుత్వ బస్సులో మంటలు
[ 03-07-2024]
చెన్నై బ్రాడ్ వే నుంచి కిళాంబాక్కం సిరుచ్చేరికి మంగళవారం 109సీ నెంబరుతో ప్రభుత్వ ఏసీ బస్సు బయల్దేరింది. అడయారు వద్ద వెళ్తుండగా ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. -
ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి
[ 03-07-2024]
తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు
-
‘ఆమె’ కలలకు తాలిబన్ల సంకెళ్లు..!
-
మరోసారి ఉద్యోగులను తొలగించిన అన్అకాడమీ