ఆస్పత్రిలో లంచం అడిగారనడం అవాస్తవం
సైదాపేటలో అతిసారం బారినపడి ఓ బాలుడు మృతి చెందగా, అతని సోదరిని అనారోగ్యంతో ఎగ్మూర్ పిల్లల ఆస్పత్రిలో చేర్చారు.
మంత్రి మా.సుబ్రమణియన్
ఆర్కేనగర్, న్యూస్టుడే: సైదాపేటలో అతిసారం బారినపడి ఓ బాలుడు మృతి చెందగా, అతని సోదరిని అనారోగ్యంతో ఎగ్మూర్ పిల్లల ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు చికిత్స అందించేందుకు రూ.వెయ్యి లంచం ఇచ్చినట్లు బాలిక తండ్రి చెప్పడంతో ప్రభుత్వంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్ మాట్లాడుతూ... ఎగ్మూర్ ఆస్పత్రిలో లంచం అడిగారనడంలో వాస్తవం లేదన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందినవారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలంటే రూ.వెయ్యి డిపాజిట్ కట్టాలన్నారు. ఆ తర్వాత ఒక్కో పరీక్షకు వేర్వేరుగా ఫీజు చెల్లించాలని తెలిపారు. ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ ఉందన్నారు. ఇది తెలియకుండా ఆరోపణలు చేయడం బాధగా ఉందన్నారు. ఇలాంటి ఆరోపణలతో వైద్య సిబ్బంది మనస్తాపానికి గురవుతారన్నారు. బాలుడి మృతికి కలుషితనీరు తాగడం కారణం కాదని నిర్ధారణైందన్నారు. వారు ఉంటున్న ప్రాంతంలో 625 కుటుంబాలు ఉంటున్నాయని, వారందరికీ ఆరోగ్యం బాగానే ఉందన్నారు. బాలుడి మృతికి కారణాలు పోస్ట్మార్టంలో తెలుస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిసంద్రంలో నరకం!
[ 03-07-2024]
వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. -
స్నాతకోత్సవానికి మంత్రి గైర్హాజరు
[ 03-07-2024]
అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. -
పారిశుద్ధ్య కార్మికులను బస్సులో ఎక్కనివ్వని కండక్టర్ సహా ఇద్దరి సస్పెన్షన్
[ 03-07-2024]
తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్ సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. -
పాఠశాలలో కుల ఘర్షణ
[ 03-07-2024]
తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. -
డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం
[ 03-07-2024]
విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. -
చట్నీ సాంబార్ టీజర్ విడుదల
[ 03-07-2024]
పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్ ‘చట్నీ సాంబర్’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవరు మృతి
[ 03-07-2024]
పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కామరాజ్ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. -
ప్రభుత్వ బస్సులో మంటలు
[ 03-07-2024]
చెన్నై బ్రాడ్ వే నుంచి కిళాంబాక్కం సిరుచ్చేరికి మంగళవారం 109సీ నెంబరుతో ప్రభుత్వ ఏసీ బస్సు బయల్దేరింది. అడయారు వద్ద వెళ్తుండగా ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. -
ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి
[ 03-07-2024]
తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.