ఉప్పు తగ్గించుకుంటే ఉపయోగకరమే!
సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం’ (లో సాల్ట్ డైట్) అంశంపై ప్రత్యేక కార్యశాల జరిగింది.
ఆరోగ్యకర ఆహారంపై ‘ఐఐటీఎం’లో కార్యశాల
పుస్తకావిష్కరణలో డాక్టర్ టీఎస్ సెల్వ వినాయగం, డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తదితరులు
వడపళని, న్యూస్టుడే: సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం)లోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’ ఆధ్వర్యంలో ఆదివారం ‘తక్కువ ఉప్పుతో కూడిన ఆహారం’ (లో సాల్ట్ డైట్) అంశంపై ప్రత్యేక కార్యశాల జరిగింది. రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టరు డాక్టర్ టీఎస్ సెల్వ వినాయగం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటు వ్యాధులతో దాదాపు 65 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని నివారించేందుకు ఉప్పు, చక్కెర తత్సంబంధిత పదార్థాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలన్నారు. ప్రస్తుతం మనం వాడే ఉప్పును 30శాతానికి తగ్గించుకుంటే అధిక ఒత్తిడి 25 శాతం వరకు తగ్గుతుందన్నారు. ప్రస్తుత కాలంలో అనేక మంది ఫాస్ట్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని హితవుపలికారు. 70 నుంచి 80 శాతం వరకు ఉప్పు మనకు తెలియకుండానే శరీరంలోకి చేరుకుంటోందన్నారు. సేపియన్స్ సంస్థ ఛైర్మన్, ఐఐటీ ఆచార్యులు డాక్టర్ రాజన్ రవిచంద్రన్ మాట్లాడుతూ... మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎంత పరిమాణంలో ఉండాలో వివరించారు. ఆరోగ్యకర ఆహారంపై అవగాహన కల్పిస్తూ సేపియన్స్ సంస్థ చేస్తున్న కృషిని ఐఐటీ ఆచార్యులు, డైరెక్టరు వి.కామకోటి అభినందించారు. ఉప్పు తగ్గించడంపై అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్యమాల గురించి ‘రిసాల్వ్ టు సేవ్ లైవ్స్’ (ఆర్టీఎస్ఎల్) ఇండియా డైరెక్టరు డాక్టర్ అమిత్ షా వివరించారు. చికిత్స కోసం వచ్చే రోగులకు కూడా వైద్యులు ఉప్పు తక్కువ తీసుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పలువురు వైద్యులు, నిపుణులు పాల్గొని ఉప్పుతో కలిగే అనర్థాల గురించి చెప్పారు. సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ ట్రస్టీ ఆర్.సుందర్ వందన సమర్పణ చేశారు. ముంబయి, దిల్లీలో కూడా కార్యశాలలు నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఐఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల కోసం ‘మాన్యువల్ ఆన్ సాల్ట్ గైడ్లైన్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిసంద్రంలో నరకం!
[ 03-07-2024]
వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. -
స్నాతకోత్సవానికి మంత్రి గైర్హాజరు
[ 03-07-2024]
అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. -
పారిశుద్ధ్య కార్మికులను బస్సులో ఎక్కనివ్వని కండక్టర్ సహా ఇద్దరి సస్పెన్షన్
[ 03-07-2024]
తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్ సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. -
పాఠశాలలో కుల ఘర్షణ
[ 03-07-2024]
తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. -
డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం
[ 03-07-2024]
విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. -
చట్నీ సాంబార్ టీజర్ విడుదల
[ 03-07-2024]
పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్ ‘చట్నీ సాంబర్’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవరు మృతి
[ 03-07-2024]
పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కామరాజ్ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. -
ప్రభుత్వ బస్సులో మంటలు
[ 03-07-2024]
చెన్నై బ్రాడ్ వే నుంచి కిళాంబాక్కం సిరుచ్చేరికి మంగళవారం 109సీ నెంబరుతో ప్రభుత్వ ఏసీ బస్సు బయల్దేరింది. అడయారు వద్ద వెళ్తుండగా ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. -
ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి
[ 03-07-2024]
తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/07/24)
-
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
-
‘మిస్టర్ మస్క్.. బగ్ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించిన టెస్లా అధినేత
-
బీరు కోసం స్నేహితుడ్ని నాలుగో అంతస్తు నుంచి తోసి చంపేశారు!
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!