Vijay: దళపతి దారెటు!.. ‘బీ టీమ్’గా ఎవరికివారే ముద్ర
ప్రముఖ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు.
విమర్శలు తీవ్రతరం చేసిన పలు పార్టీలు
విజయ్తో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్సీ ఆనంద్
న్యూస్టుడే, వేలచ్చేరి : ప్రముఖ నటుడు సూపర్స్టార్ రజనీకాంత్.. తాను సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తానని అభిమానులను ఊరించి చివరి నిమిషంలో రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించి అభిమానుల ఆశలు నీరుగార్చారు. కానీ నటుడు దళపతి విజయ్ అలాకాకుండా తాను చెప్పిన సమయానికి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేయడంతో పలు పార్టీల నేతలు సంప్రదాయానికి స్వాగతిస్తున్నా లోలోపల మదనపడుతున్నారు.
ప్రజాసేవతో మార్గం సిద్ధం
విజయ్కు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం లేకున్నా తన అభిమాన సంఘాల ద్వారా గత కొంతకాలంగా ప్రజా సేవలో ఉన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆర్థికసాయం, పేదలకు అన్నదానం, విపత్తుల సమయంలో సహాయం చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువై అభిమాన సంఘాల ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ద్వారా తన రాజకీయ రంగ ప్రవేశానికి మార్గం సిద్ధం చేసుకున్నారు. విజయ్ తాను నటించిన ప్రతి సినిమాలో రాజకీయ అంశాలను వ్యక్తపరచడంతో ఆ చిత్రాల విడుదలకు అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. 2011లో ‘కావలన్’ చిత్రానికి డీఎంకే ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడంతో తరువాత ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు తెలిపారు. అన్నాడీఎంకే గెలుపొందిన తరువాత తాను ఉడుతగా పార్టీ విజయానికి కృషి చేశానని చెప్పడంతో జయలలిత ఆగ్రహానికి గురయ్యాడు.
పార్టీ ప్రకటనకు ముందే పోటీ
తరువాత డీఎంకే, అన్నాడీఎంకే, భాజపా ఇలా ఏదో ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాల్లో డైలాగులు ఉండేలా చూసుకున్నారు. అదేవిధంగా సినీ పాటల విడుదల కార్యక్రమాల్లో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేయసాగారు. రాజకీయ ప్రకటనకు ముందే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ తరఫున అనేక మంది పోటీ చేసి గెలుపొందారు. వీటన్నింటిని బేరీజు వేసుకుని కొన్నిరోజుల క్రితం ‘తమిళగ వెట్రి’ పార్టీని ప్రారంభించారు. అదే సమయంలో విజయ్ పార్టీని ప్రారంభించిన సమయంలో విడుదల చేసిన ప్రకటనలో.. తన పార్టీ పరిపాలనలో దుర్వినియోగాలు, అవినీతి, కులమతాల తేడాలు ఉండవని పేర్కొన్నారు.
విమర్శలూ ఎక్కువే..
డీఎంకే వైపున ఉన్న మైనార్టీలు, యువత ఓట్లను రాబట్టేందుకు భాజపా పంపిన వ్యక్తిగా విజయ్ని ఓ వైపు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అన్నామలై ఎదుగుదలను నిరోధించేందుకు డీఎంకే తరఫున వచ్చిన వ్యక్తిగా భాజపా అదేస్థాయిలో విమర్శిస్తోంది. రజనీకాంత్ను రాజకీయాల్లో తీసుకు రాలేకపోవడంతో నిరాశతో ఉన్న భాజపా విజయ్ను రంగంలోకి దింపిందని మరో వైపు అన్నాడీఎంకే వ్యంగ్యాస్త్రాలు సందిస్తోంది. యువతలో మంచి పేరున్న సీమాన్ ప్రాభవాన్ని తగ్గించడం కోసమే రంగంలోకి దింపారని నామ్ తమిళర్ కట్చి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించినప్పటి నుంచి ఆయనపై ‘బీ టీమ్’ అనే ముద్ర పడింది. తన రాజకీయ నినాదాలను తెరపైకి తెచ్చిన విజయ్ ఇంకా స్పష్టమైన విధానాల ప్రకటనతో బయటకు రాలేదు. అయితే డీఎంకే, అన్నాడీఎంకే, భాజపాకు వ్యతిరేకంగా ఆయన రాజకీయం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోసూరులో విమానం ఎగురుతుందా?
[ 04-07-2024]
స్టాలిన్ ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. ఈ ప్రతిపాదనను భాజపా, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతులు వచ్చే అవకాశంలేని ఈ ప్రతిపాదన కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని కొట్టిపారేస్తున్నాయి. -
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
[ 04-07-2024]
ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. -
రద్దు చేయాలి: డీఎంకే
[ 04-07-2024]
నీట్ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం వద్ద బుధవారం జరిగిన ఆందోళనకు విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎళిలరసన్ అధ్యక్షత వహించారు. -
రిక్షాలో రష్యా కుటుంబం ప్రయాణం
[ 04-07-2024]
ప్రస్తుత కాలంలో రిక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బండిని విదేశీ జంట సొంతంగా తయారు చేసుకుని మరీ ఉపయోగిస్తుండటం విశేషం. -
వైద్య విద్యార్థినికి 12 స్వర్ణ పతకాలు
[ 04-07-2024]
తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
చైనా రకం కూరగాయలు చెన్నైలో విక్రయం
[ 04-07-2024]
నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. -
కొత్త ఇంట్లోకి నయనతార దంపతులు
[ 04-07-2024]
దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఆయన సతీమణి, నటి నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎగ్మూర్లోని ఓ బహుళంతస్తుల భవనంలో ఉంటున్నారు. -
శునకాన్ని తుపాకీతో కాల్చిన వ్యక్తి: పోలీసుల దర్యాప్తు
[ 04-07-2024]
నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలోని ఉడ్కోట్ గృహ ప్రాంతంలో పెంపుడు శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న వ్యక్తి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తాజా వార్తలు (Latest News)
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్
-
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
-
రాజధాని అమరావతి స్థితిగతులివీ..
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?