Vijay: ఎన్నికలకు దళపతి సిద్ధం.. పార్టీ పేరు నమోదు?
తమిళనాట సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు ‘దళపతి’ అని ముద్దుగా పిలుస్తుంటారు.
కోడంబాక్కం, న్యూస్టుడే: తమిళనాట సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్డమ్ ఉన్న నటుడు విజయ్. అభిమానులు ‘దళపతి’ అని ముద్దుగా పిలుస్తుంటారు. కెరీర్ మొదలైన కొంతకాలం నుంచే కన్నడ, మలయాళంలో కూడా ఆయనకు మార్కెట్ మొదలైంది. ఇప్పుడు తెలుగులోనూ పెద్ద మార్కెట్ ఏర్పడింది. ఇటీవలే ఓ సినిమాకు తమిళంలో రూ.100 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా ఓ చిత్రంలో తెలుగు మార్కెట్ కోసం రూ.40 కోట్లు కలుపుకొని మొత్తం రూ.140 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. సినిమాల్లో తీరికలేకుండా ఉన్న విజయ్.. రాజకీయాలపై కూడా పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు చురుగ్గా చేపడుతున్నారు. ప్రతిభ కనబరిచిన పదో తరగతి, ప్లస్వన్, ప్లస్టూ విద్యార్థులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నారు. సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేయడంతో.. విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే నాలుగుసార్లు సమావేశమయ్యారు. తాజాగా చెన్నై శివారు పనైయూర్లో 150 మందితో సమావేశమై పార్టీ పేరు, జెండా, అజెండాలపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
నిర్వాహకులతో చర్చించి..
పార్టీ పేరుపై ఆయన ఎక్కువసేపు నిర్వాహకులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పార్టీకి మక్కల్(ప్రజలు), తమిళగం(తమిళనాడు), మున్నేట్రం(అభివృద్ధి), కళగం(పార్టీ) వంటి పదాలు విజయ్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ మూడు పదాలు కలిసేలా ‘తమిళగ మున్నేట్ర కళగం’ పేరును వినిపించినట్లు తెలుస్తోంది. ఇదే పేరు తాజాగా ఎన్నికల సంఘంలో కూడా నమోదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్, ఆయన అభిమాన సంఘం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు. విజయ్కి 2026లో జరిగే శాసనసభ ఎన్నికలే టార్గెట్గా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు అరంగేట్రం చేసి ఎదురయ్యే తప్పొప్పులు సరిచేసుకుని.. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే నిశ్చయానికి వచ్చినట్లు సమాచారం.
తెలుగు చిత్రాల ప్రభావం
విజయ్కి ఈస్థాయి స్టార్డమ్ రావడం వెనుక తెలుగుచిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్లో ‘పోక్కిరి’, ‘గిల్లి’, ‘బద్రి’, ‘ఆది’, ‘వేలాయుధం’, ‘యూత్’ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. పవన్కల్యాణ్ను ఎక్కువగా అనుకరించేవారు. ఆయన పాటలు, సినిమాలను రీమేక్ చేశారు. తమిళంలో అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఏడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి బిరియాని వడ్డించడం, బహుమతులు ఇవ్వడం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోసూరులో విమానం ఎగురుతుందా?
[ 04-07-2024]
స్టాలిన్ ప్రకటనతో రాజకీయం వేడెక్కింది. ఈ ప్రతిపాదనను భాజపా, దాని మిత్రపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అనుమతులు వచ్చే అవకాశంలేని ఈ ప్రతిపాదన కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని కొట్టిపారేస్తున్నాయి. -
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
[ 04-07-2024]
ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. -
నీట్ నుంచి రాష్ట్రాన్ని మినహాయించండి
[ 04-07-2024]
నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ తెలిపారు. -
రద్దు చేయాలి: డీఎంకే
[ 04-07-2024]
నీట్ పరీక్ష రద్దు చేయాలని డీఎంకే విద్యార్థి విభాగం డిమాండ్ చేసింది. నుంగంబాక్కంలోని వళ్లువర్కోట్టం వద్ద బుధవారం జరిగిన ఆందోళనకు విద్యార్థి విభాగం కార్యదర్శి సీవీఎంపీ ఎళిలరసన్ అధ్యక్షత వహించారు. -
రిక్షాలో రష్యా కుటుంబం ప్రయాణం
[ 04-07-2024]
ప్రస్తుత కాలంలో రిక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ బండిని విదేశీ జంట సొంతంగా తయారు చేసుకుని మరీ ఉపయోగిస్తుండటం విశేషం. -
వైద్య విద్యార్థినికి 12 స్వర్ణ పతకాలు
[ 04-07-2024]
తిరునెల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల స్నాతకోత్సవంలో ఓ విద్యార్థిని 12 స్వర్ణ పతకాలు అందుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. -
చైనా రకం కూరగాయలు చెన్నైలో విక్రయం
[ 04-07-2024]
నీలగిరి జిల్లాలో పండుతున్న చైనా రకానికి చెందిన కూరగాయలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి చెన్నైలో తక్కువ ధరకు విక్రయించాలని సహకారశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. -
కొత్త ఇంట్లోకి నయనతార దంపతులు
[ 04-07-2024]
దర్శకుడు విఘ్నేశ్ శివన్, ఆయన సతీమణి, నటి నయనతార దంపతులు తమ ఇద్దరు పిల్లలతో ఎగ్మూర్లోని ఓ బహుళంతస్తుల భవనంలో ఉంటున్నారు. -
శునకాన్ని తుపాకీతో కాల్చిన వ్యక్తి: పోలీసుల దర్యాప్తు
[ 04-07-2024]
నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలోని ఉడ్కోట్ గృహ ప్రాంతంలో పెంపుడు శునకాన్ని తుపాకీతో కాల్చుతున్న వ్యక్తి సీసీ టీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
తాజా వార్తలు (Latest News)
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
-
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
-
క్షమించండి.. నెలలో తిరిగిస్తా.. ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ
-
తూర్పుగోదావరి జిల్లాలో ప్రాణం నిలిపిన పింఛను!
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి చిత్రాలు
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?