Vijay: త్వరలో నటుడు విజయ్ కొత్తపార్టీ?
ప్రముఖ నటుడు విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.
వేలచ్చేరి, న్యూస్టుడే: ప్రముఖ నటుడు విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ చిత్రసీమలో నటనతో ప్రజలు, అభిమాన సంఘాలను ఆకట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 10, 12 తరగతుల్లో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులకు గతేడాది జూన్లో నీలాంగరైలో ప్రశంసాపత్రాలు, ప్రోత్సాహక బహుమతులు అందించారు. విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ తరఫున గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల కోసం రాత్రి పాఠశాలలు ప్రారంభించారు. గ్రంథాలయాలను ప్రారంభించారు. గతేడాది చెన్నైను మిగ్జాం తుపాను ముంచెత్తడంతో బాధిత ప్రజలకు సంక్షేమ సాయాలు అందించారు. ఈ నేపథ్యంలో గురువారం చెన్నై సమీప పనయూర్లోని తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కం నిర్వాహకులతో సంప్రదింపులు సమావేశం నిర్వహించారు. చెన్నై, కోవై, తిరుచ్చి, మధురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ ప్రారంభించాలని సమావేశంలో పలువురు డిమాండు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలపై విజయ్ చర్చించినట్లు సమాచారం. మరో నెలరోజుల్లో కొత్తపార్టీ విషయమై ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ఖరారు చేసి నమోదు చేసిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఎవరికైనా మద్దతివ్వాలా లేక ఒంటరిగా పోటీ చేయాలా అనే అంశలపై మరోసారి నిర్వాహకులతో సంప్రదింపులు జరపనున్నట్లు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నడిసంద్రంలో నరకం!
[ 03-07-2024]
వెళ్లినవారు ఇంటికొస్తారా, రారా అంటూ కుటుంబీకులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. వందలమంది శ్రీలంక చెరలో ఉండటంతో ఇప్పుడు వారి ఇళ్లలోనివారంతా రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. -
స్నాతకోత్సవానికి మంత్రి గైర్హాజరు
[ 03-07-2024]
అన్నా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి గైర్హాజరయ్యారు. -
పారిశుద్ధ్య కార్మికులను బస్సులో ఎక్కనివ్వని కండక్టర్ సహా ఇద్దరి సస్పెన్షన్
[ 03-07-2024]
తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు, నర్సులను బస్సులోకి ఎక్కించేందుకు నిరాకరించిన కండక్టర్ సహా ఇద్దరిని సస్పెండ్ చేశారు. -
పాఠశాలలో కుల ఘర్షణ
[ 03-07-2024]
తిరునెల్వేలి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘర్షణలో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. నాంగునేరి వద్ద మూండ్రడైప్పు సమీప మరుదకుళం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. -
డీఎంకే ఎన్నికల కార్యాలయంలో టీ, బజ్జీ ఉచితం
[ 03-07-2024]
విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక 10న జరగనుండటంతో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎంకే తరఫున అన్నియూర్ శివ, ఎన్డీఏ కూటమిలో పీఎంకే నుంచి సి.అన్బుమణి, ఎన్టీకే తరఫున డాక్టర్ అభినయ సహా 29 మంది బరిలో ఉన్నారు. -
చట్నీ సాంబార్ టీజర్ విడుదల
[ 03-07-2024]
పలు వైవిధ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధా మోహన్ ‘చట్నీ సాంబర్’ వెబ్ సిరీస్ను రూపొందించారు. ఇందులో యోగిబాబు కీలక పాత్రలో నటించారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవరు మృతి
[ 03-07-2024]
పళ్లిపట్టు సమీపం కుమారరాజుపేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కామరాజ్ (45) మంగళవారం ఉదయం ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా ఓసూరు అమ్మన్ ఆలయానికి వెళ్లే దారిలో ఎదురుగా వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. -
ప్రభుత్వ బస్సులో మంటలు
[ 03-07-2024]
చెన్నై బ్రాడ్ వే నుంచి కిళాంబాక్కం సిరుచ్చేరికి మంగళవారం 109సీ నెంబరుతో ప్రభుత్వ ఏసీ బస్సు బయల్దేరింది. అడయారు వద్ద వెళ్తుండగా ఉన్నట్టుండి ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. -
ఎస్సైగా చెప్పుకొంటూ చోరీలకు పాల్పడుతున్న యువతి
[ 03-07-2024]
తూత్తుక్కుడి జిల్లా రాజపాళెయానికి చెందిన గంగాదేవి ప్లస్టూ వరకు చదివింది. ఈమె తాను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు ఐడీకార్డు సృష్టించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్