Srirangam Temple: శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి
తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు.
ఆర్కేనగర్, న్యూస్టుడే: తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో (Srirangam temple) ఆంధ్ర భక్తులపై దాడి జరిగింది. ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 30మందికి పైగా అయ్యప్ప భక్తులు, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు మంగళవారం ఉదయం స్వామి దర్శనానికి క్యూలో నిల్చున్నారు. వారిలో కొందరు వరుసలో నిల్చోకుండా మధ్యమధ్యన దూరినట్లు సమాచారం. దీనిపై మిగిలిన భక్తులు ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అనంతరం గర్భగుడి ముందున్న గాయత్రి మండపంలో ఆంధ్రా భక్తులు నిల్చుని ఉండగా రద్దీ ఏర్పడింది. ఆలయ తాత్కాలిక సిబ్బంది సర్ది చెబుతుండగా ఆంధ్రా భక్తులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రాకు చెందిన చెన్నారావు అనే భక్తుడిని ముక్కు పగిలేలా సిబ్బంది కొట్టడంతో గాయమైంది. ఆయన అక్కడే కూర్చొని ధర్నా చేశారు. మిగిలిన భక్తులు పెద్దగా కేకలు వేశారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న నగర సహాయ పోలీసు కమిషనర్ నివేదలక్ష్మి, ఇన్స్పెక్టర్ అరంగునాథన్ ఆందోళన చేస్తున్న భక్తులను వెంట తీసుకెళ్లారు. ఆలయం సిబ్బంది భరత్ సహా ముగ్గురిపై శ్రీరంగం ఆలయ పోలీసుస్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. ఆలయ సిబ్బంది కూడా భక్తులపై ఫిర్యాదు చేశారు. ఆలయంలో భక్తుల రక్తం చిందడంతో కాసేపు తలుపులు మూసేసి పరిహార పూజ చేసిన తర్వాత అనుమతించారు.
ఖండించిన భాజపా
అయ్యప్ప భక్తులపై దాడిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఖండించారు. తన ఎక్స్ పేజీలో... అయ్యప్పమాలధారులు శబరిమలై నుంచి తిరిగొచ్చి రంగనాథుడిని దర్శించుకునేందుకు చాలాసేపు నిరీక్షించిన తర్వాత ఆలస్యంపై ప్రశ్నించారు. గొడవ జరిగి రక్తమయంగా మారింది. డీఎంకే ప్రభుత్వానికి హిందూధర్మంపై నమ్మకం లేదు. ఆలయ పవిత్రతను కించపరిచే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుచ్చి జిల్లా పార్టీ యూనిట్ నిరసనకు దిగనుందని తెలిపారు.
వడపళని: ఆంధ్ర భక్తులపై దాడిని మాజీ ఎమ్మెల్సీ, భాజపా జాతీయ సహ ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం హిందూ ధర్మానికి, సనాతనానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం, దేవాదాయశాఖ క్షమాపణ చెప్పాలని, నిందితులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశ పరీక్షలతో పనిలేదు!
[ 05-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం రాష్ట్ర విద్యా వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసింది. నివేదిక రూపంలో 550 పేజీల పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్కు అందజేసింది. -
మరో కమల్లా మారిన విజయ్
[ 05-07-2024]
డీఎంకేకు మద్దతుగా మాట్లాడి టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో కమల్హాసన్గా మారారని హిందూ మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్సంపత్ పేర్కొన్నారు. -
ఘనంగా స్వామి వివేకానంద సంస్మరణ వేడుక
[ 05-07-2024]
స్వామి వివేకానంద నిర్యాణ దినం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపం ప్రాంగణంలో అన్నపూజ చేశారు. -
రాష్ట్రంలో జికా వైరస్ ప్రభావం లేదు
[ 05-07-2024]
మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో దాని ప్రభావం లేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం పేర్కొన్నారు. -
పలు సంస్థలతో ఐఐటీఎం ఒప్పందం
[ 05-07-2024]
కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘స్వయం ప్లస్’ ఆన్లైన్ విద్యా పథకంలో భాగంగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
రాష్ట్రంలో తెలుగును బతికించండి
[ 05-07-2024]
తమిళనాడులో తెలుగును బతికించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమిళనాడు తెలుగు యువశక్తి విభాగ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇటీవల అమరావతిలో కలిసి విజ్ఞప్తి చేశారు. -
దయగల దంపతులు
[ 05-07-2024]
ఆకలితో అలమటించే నిరాశ్రయులు, అనాథలను చూసి మనసు చలించి వారికి తమ వంతు సేవ చేయాలని ముందుకొచ్చారు జాన్సన్ జెబకుమార్, షరీన్ జోషువా దంపతులు. -
రోశయ్య సహృదయత మరువలేనిది సీఎంకే రెడ్డి
[ 05-07-2024]
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య సహృదయత మరువలేనిదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. -
ఏళు కడల్ ఏళు మలై రెండో సింగిల్ విడుదల నేడు
[ 05-07-2024]
రామ్ దర్శకత్వంలో నివిన్ పౌలి, అంజలి, సూరి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలైౖ’. సురేశ్ కామాట్చికి చెందిన ‘వి హౌస్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు (Latest News)
-
2036 ఒలింపిక్స్ బిడ్డింగ్ సక్సెస్కు మీ సూచనలు సాయపడతాయి: అథ్లెట్లతో మోదీ కీలక వ్యాఖ్యలు
-
అందుకే బిహార్లో వరుసగా బ్రిడ్జ్లు కూలుతున్నాయట! నివ్వెరపరుస్తున్న కేంద్రమంత్రి సమాధానం
-
‘బింబిసార’కు ప్రీక్వెల్గా పార్ట్2.. డైరెక్టర్ ఎవరంటే!
-
ట్రయంఫ్ స్పీడ్, స్క్రాంబ్లర్ మోటార్ సైకిళ్లపై డిస్కౌంట్
-
‘ఉస్తాద్ భగత్ సింగ్’పై రూమర్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీశ్ శంకర్
-
కేసీఆర్పై విశ్వాసం లేకే కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్