Yatra Raja: బైక్ నడిపిన సినీ నటుడు ధనుష్ కుమారుడు.. పోలీసులు జరిమానా!
18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్యారిస్, న్యూస్టుడే: 18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అసలు వివరాల్లోకి వెళితే... ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర(Yatra Raja) ఖరీదైన ద్విచక్ర మోటారు వాహనం నడుపుతున్న వీడియో కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అందులో... తేనాంపేట ప్రాంతంలో బైకు నడుపుతున్న యాత్రకు ఓ వ్యక్తి తర్ఫీదు ఇస్తుండగా మరొకరు వీడియో తీస్తుండగా యాత్ర సహాయకుడు వారించాడు. ఈ నేపథ్యంలో యాత్రకు 17 ఏళ్లేనని, లైసెన్సు, హెల్మెట్ లేకుండా బైకు నడిపాడని, అతనిపై చర్యలు చేపట్టాలని పలువురు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ చేశారు. దీంతో తేనాంపేట ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేపట్టి అతనికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీనిపై ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనరు సుధాకర్ వివరణ ఇస్తూ.. వీడియోలో ఉన్న వ్యక్తి మాస్క్ వేసుకుని ఉండటంతో ఎవరని గుర్తించలేక పోయామని, ఈ విషయమై దర్యాప్తు చేసి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య
[ 06-07-2024]
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ దారుణహత్యకు గురయ్యారు. చెన్నై పెరంబూర్లో నివాసం ఉంటున్న ఆయన శుక్రవారం రాత్రి ఇంటి ముందు నిలుచుని ఉన్నారు. -
కాటేస్తున్న కాలుష్యం
[ 06-07-2024]
శ్వాస సరిగా ఆడదు.. బయటికి రావాలంటే ఇబ్బంది.. ఇంట్లో ఉన్నా ఇదే పరిస్థితి. చెన్నైలో గాలి కాలుష్యంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎంతోమంది అనారోగ్యాలబారిన పడుతున్నారు. -
కొత్త చట్టాలు ఉపసంహరించుకోవాలి
[ 06-07-2024]
కొత్త చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే న్యాయవాదుల విభాగం లాయర్లు శుక్రవారం ఆందోళన చేపట్టారు. డీఎంకే రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ ఎన్ఆర్ ఇళంగో నేతృత్వంలో జరిగింది. -
ఈపీఎస్ నమ్మకద్రోహి
[ 06-07-2024]
ఎడప్పాడి పళనిసామి నమ్మకద్రోహి అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. -
మూత్ర విసర్జన చేశాడని రోగిని బయటకు పంపిన సిబ్బంది
[ 06-07-2024]
మూత్ర విసర్జన చేశాడని ఓ రోగిని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది బయటకు పంపిన అమానవీయ ఘటన మదురైలో చోటుచేసుకుంది. -
సృజనాత్మక సామాజిక మాధ్యమ సృష్టికర్తలు
[ 06-07-2024]
ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాలతో సమయం వృథా చేసుకోవడమే కాదు.. ప్రయోజనకర విషయాలూ తెలుసుకోవచ్చు అంటున్నారు ఈ యువ క్రియేటర్లు. -
సినీనటుడు ఎస్వీ శేఖర్కు పురస్కారం
[ 06-07-2024]
ప్రముఖ తమిళ రంగస్థల నటుడు, సినీ నటుడు ఎస్వీ శేఖర్కు ‘ఇయక్కునగర్ శిఖరం కె.బాలచందర్’ పురస్కారం లభించింది. -
యువకుడిపై దాడిచేసి ప్రాణాలతో పాతిపెట్టిన బాలురు
[ 06-07-2024]
తూత్తుక్కుడి జిల్లా మేట్టుప్పట్టికి చెందిన కళంజియం కుమారుడు మారిసెల్వం (24) జాలరి. ఇతను గత నెల 21న అదృశ్యమయ్యాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతని కోసం గాలింపు చేపట్టారు.