logo

Yatra Raja: బైక్‌ నడిపిన సినీ నటుడు ధనుష్‌ కుమారుడు.. పోలీసులు జరిమానా!

18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్‌ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Updated : 19 Nov 2023 07:47 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: 18 ఏళ్లు నిండకుండానే ద్విచక్ర మోటారు వాహనం నడిపిన ప్రముఖ సినీ నటుడు ధనుష్‌ కుమారుడికి పోలీసులు జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అసలు వివరాల్లోకి వెళితే... ధనుష్‌ పెద్ద కుమారుడు యాత్ర(Yatra Raja) ఖరీదైన ద్విచక్ర మోటారు వాహనం నడుపుతున్న వీడియో కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. అందులో... తేనాంపేట ప్రాంతంలో బైకు నడుపుతున్న యాత్రకు ఓ వ్యక్తి తర్ఫీదు ఇస్తుండగా మరొకరు వీడియో తీస్తుండగా యాత్ర సహాయకుడు వారించాడు. ఈ నేపథ్యంలో యాత్రకు 17 ఏళ్లేనని, లైసెన్సు, హెల్మెట్‌ లేకుండా బైకు నడిపాడని, అతనిపై చర్యలు చేపట్టాలని పలువురు సామాజిక మాధ్యమాల్లో డిమాండ్‌ చేశారు. దీంతో తేనాంపేట ట్రాఫిక్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టి అతనికి రూ.వెయ్యి జరిమానా విధించినట్లు కొన్ని వార్తా పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీనిపై ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనరు సుధాకర్‌ వివరణ ఇస్తూ.. వీడియోలో ఉన్న వ్యక్తి మాస్క్‌ వేసుకుని ఉండటంతో ఎవరని గుర్తించలేక పోయామని, ఈ విషయమై దర్యాప్తు చేసి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని