Tamil Nadu: కళ్లు చెదిరేలా కొత్త విమానాశ్రయం.. టెర్మినల్కు రెండువైపులా రన్వేలు
ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం.
ఎన్నికల కోడ్ పూర్తవగానే అనుమతులకు ప్రతిపాదన
ప్రభుత్వం విడుదల చేసిన నమూనా
ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. రాత్రివేళ ధగధగ మెరిసేలా విద్యుత్తు కాంతులు. చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రాబోతోంది. విమానాశ్రయం ఎలా ఉండాలనేదానిపై ఇప్పటికే ప్రాథమిక అంచనాతో వచ్చిన అధికారులు.. ఇప్పుడు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు.
ఈనాడు-చెన్నై: కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు తమిళనాడు పారిశ్రామికాభివృద్ధి సంస్థ(టిడ్కో) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రాజెక్టును రూ.20వేల కోట్లతో చేపట్టాలని అంచనా వేస్తున్నారు. నిర్మాణాలు త్వరగా మొదలుపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. టెండర్లు ఆహ్వానించేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఈ గడువు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని చూస్తున్నారు. టెర్మినల్కు రెండువైపులా రన్వేలు నిర్మించనున్నారు.
అనుమతులే కీలకం
గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల పాలసీ నిబంధనల మేరకు అనుమతులు పొందేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనల్ని స్టీరింగ్ కమిటీ ముందు ఉంచనున్నారు. నిర్మాణాలకు కేంద్ర అనుమతులు కూడా తప్పనిసరి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి పర్యావరణ అనుమతులకూ పంపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. వారొచ్చి ప్రతిపాదిత ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమోదం పొందేలా ప్రణాళికలున్నాయి. ఇవన్నీ ఈ ఏడాదే జరగొచ్చని అధికారులు అంచనాతో ఉన్నారు.
లోతైన పరిశోధన..
గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాశ్రయం ప్రతిపాదిత ప్రాంతంలోని అడ్డంకుల్ని సామరస్యంగా పరిష్కరించుకు నేందుకు ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఆ స్థలాన్ని పలుమార్లు పరిశీలించారు. భూగర్భజలాలు, వరద ముప్పు, వర్షాల తీరు.. తదితర అంశాలకు సంబంధించి పలు దశాబ్దాల రికార్డులు పరిశీలించారు. దానిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
మెట్రోతో అదనపు హంగు
ఇప్పటికే పరందూర్ విమానాశ్రయం దాకా మెట్రో పనులు చేపట్టాలని ప్రణాళికలు చేశారు. పూందమల్లి నుంచి పరందూర్ దాకా 43.6 కి.మీ. మెట్రో మార్గాన్ని వృద్ధి చేయడంతో పాటు 19 మెట్రోస్టేషన్లు నిర్మించేలా ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ను రూపొందించే పనిలో అధికారులున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.10,712 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. నగరం నుంచి కొత్త విమానాశ్రయానికి విస్తరణ పూర్తయితే ప్రయాణికులకు మరింత, కాంచీపురం వాసులకు ఇంకా సౌకర్యవంతమవుతుంది. మరోవైపు విమానాశ్రయంలో కార్గో సేవలతో పాటు ఇతరత్రా వాణిజ్యసేవలూ అందుబాటులోకి రానున్నాయి.
ఆగని నిరసనలు
విమానాశ్రయం కోసం భూములు ఇచ్చేవారికి స్థానిక మార్కెట్ విలువకన్నా 3.5 రెట్లు ఎక్కువగా డబ్బులిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరందూరు పరిసరాల్లోని 13 గ్రామాలకు దీన్ని వర్తించేలా ప్రకటన చేశారు. అక్కడి ప్రజలకు చట్టప్రకారంగా పునరావాసం, ఉపాధి కల్పించేందుకూ చర్యలు చేపడతామని అంటున్నారు. స్థానికంగా నిరసనలు మాత్రం ఆగడంలేదు. తమ భూములు, ఉపాధి కోల్పోతున్నామని ఆరోపిస్తూ పలు గ్రామాలవారు నిరసన కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం 13 గ్రామాల పరిధిలో 4563.56 ఎకరాల స్థలం అవసరమని ప్రతిపాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశ పరీక్షలతో పనిలేదు!
[ 05-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం రాష్ట్ర విద్యా వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసింది. నివేదిక రూపంలో 550 పేజీల పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్కు అందజేసింది. -
మరో కమల్లా మారిన విజయ్
[ 05-07-2024]
డీఎంకేకు మద్దతుగా మాట్లాడి టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో కమల్హాసన్గా మారారని హిందూ మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్సంపత్ పేర్కొన్నారు. -
ఘనంగా స్వామి వివేకానంద సంస్మరణ వేడుక
[ 05-07-2024]
స్వామి వివేకానంద నిర్యాణ దినం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపం ప్రాంగణంలో అన్నపూజ చేశారు. -
రాష్ట్రంలో జికా వైరస్ ప్రభావం లేదు
[ 05-07-2024]
మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో దాని ప్రభావం లేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం పేర్కొన్నారు. -
పలు సంస్థలతో ఐఐటీఎం ఒప్పందం
[ 05-07-2024]
కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘స్వయం ప్లస్’ ఆన్లైన్ విద్యా పథకంలో భాగంగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
రాష్ట్రంలో తెలుగును బతికించండి
[ 05-07-2024]
తమిళనాడులో తెలుగును బతికించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమిళనాడు తెలుగు యువశక్తి విభాగ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇటీవల అమరావతిలో కలిసి విజ్ఞప్తి చేశారు. -
దయగల దంపతులు
[ 05-07-2024]
ఆకలితో అలమటించే నిరాశ్రయులు, అనాథలను చూసి మనసు చలించి వారికి తమ వంతు సేవ చేయాలని ముందుకొచ్చారు జాన్సన్ జెబకుమార్, షరీన్ జోషువా దంపతులు. -
రోశయ్య సహృదయత మరువలేనిది సీఎంకే రెడ్డి
[ 05-07-2024]
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య సహృదయత మరువలేనిదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. -
ఏళు కడల్ ఏళు మలై రెండో సింగిల్ విడుదల నేడు
[ 05-07-2024]
రామ్ దర్శకత్వంలో నివిన్ పౌలి, అంజలి, సూరి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలైౖ’. సురేశ్ కామాట్చికి చెందిన ‘వి హౌస్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్