Prakash Raj: ఎప్పుడూ ప్రజల గొంతుకగానే ఉంటా: నటుడు ప్రకాష్రాజ్
తానెప్పుడూ ప్రజల గొంతుకగానే ఉంటానని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ తెలిపారు. వీసీకే తరఫున ‘అవార్డుల ప్రదానోత్సవం- 2024’ చెన్నై తేనాంపేటలోని కామరాజర్ హాలులో శనివారం రాత్రి జరిగింది.
సైదాపేట: తానెప్పుడూ ప్రజల గొంతుకగానే ఉంటానని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ తెలిపారు. వీసీకే తరఫున ‘అవార్డుల ప్రదానోత్సవం- 2024’ చెన్నై తేనాంపేటలోని కామరాజర్ హాలులో శనివారం రాత్రి జరిగింది. దీనికి వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ నేతృత్వం వహించారు. ఈ ఏడాది అంబేడ్కర్ చుడర్ అవార్డు నటుడు ప్రకాష్రాజ్కు అందజేశారు. అలాగే మార్క్స్ మామణి అవార్డు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్, ‘కామరాజన్ కదిర్’ అవార్డు ఇండియా సామాజిక న్యాయ ఉద్యమ అధ్యక్షుడు షణ్ముగం, ‘పెరియార్ ఒళి’ పురస్కారం ద్రావిడ కళగ ప్రచార కార్యదర్శి అరుళ్మొళి, ‘అయోద్దిదాసర్ ఆదవన్’ సామాజిక కార్యకర్త రాజ్గౌతమ్, ‘క్వాయిదే మిల్లత్ పిరై’ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ సికిందర్, ‘సెమ్మొళి నాయిరు’ ఎఫిగ్రాఫిస్ట్ సుబ్బారాయులు అందుకున్నారు. ప్రకాష్రాజ్ మాట్లాడుతూ... తనను ఏ పార్టీ వేదికపైనా చూడలేరని, ఎందుకంటే తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. అయితే తాను పోరాడే సిద్ధాంతాల కోసమే వీసీకే పార్టీ, అధ్యక్షుడు తిరుమావళవన్ పోరాడుతున్నారని, ఆయన తన స్నేహితుడని చెప్పారు. తాను గత పదేళ్లుగా ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ మాట్లాడుతూ... దళితేతరులను కూడా రాజకీయం చేయాలన్నారు. ప్రధాని మోదీ ఓడిపోతే అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయని చెప్పలేమని, సనాతన శక్తుల వల్ల వేయి మంది మోదీలను సృష్టించవచ్చని తెలిపారు. వెట్రిమారన్, ప్రకాష్రాజ్, పా.రంజిత్, మారి సెల్వరాజ్ లాంటి వారు ఇంకా ఎందరో సినిమాల్లోకి రావాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశ పరీక్షలతో పనిలేదు!
[ 05-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మురుగేశన్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం రాష్ట్ర విద్యా వ్యవస్థపై లోతైన అధ్యయనం చేసింది. నివేదిక రూపంలో 550 పేజీల పుస్తకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్కు అందజేసింది. -
మరో కమల్లా మారిన విజయ్
[ 05-07-2024]
డీఎంకేకు మద్దతుగా మాట్లాడి టీవీకే అధ్యక్షుడు విజయ్ మరో కమల్హాసన్గా మారారని హిందూ మక్కల్ పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్సంపత్ పేర్కొన్నారు. -
ఘనంగా స్వామి వివేకానంద సంస్మరణ వేడుక
[ 05-07-2024]
స్వామి వివేకానంద నిర్యాణ దినం సందర్భంగా గురువారం కన్నియాకుమరి వివేకానంద స్మారక మండపం ప్రాంగణంలో అన్నపూజ చేశారు. -
రాష్ట్రంలో జికా వైరస్ ప్రభావం లేదు
[ 05-07-2024]
మహారాష్ట్రలో జికా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో దాని ప్రభావం లేదని ఆరోగ్యశాఖ డైరెక్టర్ సెల్వవినాయగం పేర్కొన్నారు. -
పలు సంస్థలతో ఐఐటీఎం ఒప్పందం
[ 05-07-2024]
కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన ‘స్వయం ప్లస్’ ఆన్లైన్ విద్యా పథకంలో భాగంగా ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ మద్రాస్ (ఐఐటీఎం) ఉద్యోగావకాశాలు, నైపుణ్యాభివృద్ధి కోసం 24 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. -
రాష్ట్రంలో తెలుగును బతికించండి
[ 05-07-2024]
తమిళనాడులో తెలుగును బతికించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి తమిళనాడు తెలుగు యువశక్తి విభాగ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఇటీవల అమరావతిలో కలిసి విజ్ఞప్తి చేశారు. -
దయగల దంపతులు
[ 05-07-2024]
ఆకలితో అలమటించే నిరాశ్రయులు, అనాథలను చూసి మనసు చలించి వారికి తమ వంతు సేవ చేయాలని ముందుకొచ్చారు జాన్సన్ జెబకుమార్, షరీన్ జోషువా దంపతులు. -
రోశయ్య సహృదయత మరువలేనిది సీఎంకే రెడ్డి
[ 05-07-2024]
దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నరు కొణిజేటి రోశయ్య సహృదయత మరువలేనిదని అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు సీఎంకే రెడ్డి పేర్కొన్నారు. -
ఏళు కడల్ ఏళు మలై రెండో సింగిల్ విడుదల నేడు
[ 05-07-2024]
రామ్ దర్శకత్వంలో నివిన్ పౌలి, అంజలి, సూరి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలైౖ’. సురేశ్ కామాట్చికి చెందిన ‘వి హౌస్ ప్రొడక్షన్స్’ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు
-
జూన్లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు