న్యాయం.. భారతీయ స్వరూపం
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు.
కొత్త చట్టాల అమలుకు శ్రీకారం
ఎక్కడి నుంచైనా ఫిర్యాదుకు ఆస్కారం
అవగాహన కల్పిస్తున్న పోలీసు యంత్రాంగం
భారతీయ న్యాయ చట్టాలపై వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు(పాత చిత్రం)
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. బాధితులు పోలీసు స్టేషన్ మెట్లెక్కకుండానే ఈ మెయిల్, ఎస్ఎంఎస్ల ద్వారా ఫిర్యాదులు చేసే వీలు. సమన్లు, ఎఫ్ఐఆర్ కాపీలు సైతం ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా పొందే అవకాశం. అన్నింటికీ మించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చట్టాల రూపకల్పన. వెరసి ఇదీ నూతన భారతీయ న్యాయ చట్టాల స్వరూపం. జులై ఒకటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వచ్చాయి. తొలినాళ్లలో కొంత అయోమయం, గందరగోళం సహజం. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో సందేహాల నివృత్తి కోసం పోలీసు శాఖ జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
- పాత చట్టాలకు చెల్లుచీటీ...: బ్రిటిష్ కాలం నాటి న్యాయ చట్టాలకు కాలం చెల్లింది. బాధితులకు సత్వర న్యాయం, దోషులకు స్వల్పకాలంలోనే శిక్షలు పడేలా నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), సీఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్), ఐఈఏ స్థానంలో భారతీయ శిక్షా అధీనియం(బీఎస్ఏ) వంటి చట్టాలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ప్రజలకు నూతన చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ నడుం బిగించింది.
- కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ వరకు...: తొలుత పోలీసు శాఖ నుంచే అవగాహనకు అంకురార్పణ చేశారు. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు పోలీసు స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్లతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం, హోంగార్డ్స్ సిబ్బందికి గత రెండు నెలల నుంచి వివిధ మార్గాల్లో అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ల ద్వారా చట్టాల గురించి తెలుపుతున్నారు. జిల్లాస్థాయిలో ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించి నూతన చట్టాలపై సందేహాలను నివృత్తి చేస్తున్నారు. జిల్లాలోని న్యాయాధికారులు, న్యాయవాదులతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. క్రైమ్, క్రిమినల్స్ ట్రాకింగ్, నెట్వర్కింగ్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్)లో ప్రతిరోజూ కేసుల పురోగతిని అప్లోడ్ చేస్తున్నారు.
- నిర్దిష్ట కాలపరిమితి విధింపు...: నూతన చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలకు అంకురార్పణ చేసింది. అందులో భాగంగా కేసుల విచారణకు నిర్దిష్ట కాలపరిమితి విధించటం కీలకాంశం. బాధితులు, ఫిర్యాదుదారులకు కేసుకు సంబంధించిన వివరాలు తొంభై రోజుల్లోపు తెలియజేయాల్సి ఉంటుంది. పదిహేనేళ్లలోపు పిల్లలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్టేషన్కు హాజరుకాకుండా వారి ఇంటి వద్ద, కోరిన ప్రదేశంలో విచారణకు అవకాశం కల్పించింది. చిన్నాచితకా నేరాలకు జైలుశిక్ష, జరిమానా స్థానంలో సమాజ సేవ చేసేలా నూతన చట్టాలను రూపొందించారు. వీటిపై కేవలం పోలీసులకే కాకుండా జిల్లాలో అన్ని వర్గాల ప్రజానీకానికీ అవగాహన కల్పించేలా జిల్లా పోలీసులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకు నూతన చట్టాల గురించి తెలుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులతో చెలగాటం.. చదువుల విధ్వంసం
[ 05-07-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి శపథం చేశారు. -
ఆశలు కూల్చిన వైకాపా.. కూటమి పైనే భారమంతా!
[ 05-07-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తున్నది కాలనీలు కాదు.. ఊళ్లంటూ గత వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టింది. ఆ తర్వాత ఐచ్ఛికాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. -
మా నాన్న ఇస్తే నాకేంటీ!
[ 05-07-2024]
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామానికి చెందిన భవిష్యత్తు తరాలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు ఓ దాత. గ్రామంలోని ఉన్నత పాఠశాలకు తనవంతు సాయం చేయాలనుకున్నారు. -
పశ్చిమాన తీరనున్న నీటి ఎద్దడి
[ 05-07-2024]
మార్కాపురం నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా తాగు, వాడుక నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందించారు. -
అల్లూరి.. నేటితరం యువతకు స్ఫూర్తి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. -
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థి సంఘాల భగ్గు
[ 05-07-2024]
నీట్ ప్రశ్న పత్రం లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
[ 05-07-2024]
‘బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల బంగారు జీవితాలకు నిలయమైనవి గురుకులాలు. అటువంటి విద్యాలయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. -
గ్రానైట్ ఎగుమతులకు పచ్చజెండా
[ 05-07-2024]
కొంతకాలంగా నిలిచిపోయిన గ్రానైట్ ఎగుమతులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కారం పొడి చల్లి.. మారణాయుధాలతో దాడి
[ 05-07-2024]
మద్యం షాపు వద్ద తమతో గొడవ పడిన యువకుడి కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. -
మిరప వ్యాపారి అపహరణ కథ సుఖాంతం
[ 05-07-2024]
మిరపకాయల డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారిని రైతులు ఎట్టకేలకు విడుదల చేశారు. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. -
రాలిన చదువుల చిట్టితల్లి
[ 05-07-2024]
మంచి భవిత కోసం ఆ చిట్టి తల్లి ఎన్నో కలలు కంది..చదువు కోసం పరితపించింది..అయితే పెళ్లి చేసుకోవాలంటూ మాతృమూర్తే ఒత్తిడి తేవడంతో ఆమెకు దిక్కుతోచలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్