పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం.
‘విడతల’ వారీగా వైకాపా మోసం
ఆనందం నింపిన కూటమి ప్రభుత్వం
ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శి మండలం సామంతపూడికి చెందిన వెంకటేశ్వర్లుకు నగదు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది
ఈనాడు, ఒంగోలు: నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. మళ్లీ అధికారంలోకి వస్తే రూ.3 వేలు చేస్తామని 2019 నాటి ఎన్నికల సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే మొత్తం తామూ ఇస్తామంటూ వైకాపా ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు అందిస్తున్న మొత్తానికి తోడు కేవలం రూ.250 పెంచి ఇచ్చింది. ఏటా పెంచుతూ పోతామని అయిదేళ్లకు రూ.3 వేలు ఇస్తామంటూ తానిచ్చిన హామీకి వక్రభాష్యాలు చెబుతూ లబ్ధిదారులను అయిదేళ్లు మోసగించింది. ఫలితంగా ఒక్కో లబ్ధిదారు రూ.32 వేలు చొప్పున నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా పరిశీలిస్తే ఆ మోసం విలువ అయిదేళ్లలో రూ.932 కోట్లు. ఇటీవల ఎన్నికల సభల్లో పింఛన్ నగదు రూ.4 వేలు ఇస్తామన్న ఎన్డీఏ కూటమి.. అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది రోజుల్లోనే చేసి చూపింది. పెంపుతో పాటు మరో రూ.3 వేలు అదనంగా అందించింది. ఈ మేరకు లబ్ధిదారులకు రూ.87 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూర్చింది. పేదల మోముల్లో నవ్వులు విరబూసేలా చేసింది. పింఛన్ల పంపిణీ విషయమై కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడారు. జిల్లాలో 2.92 లక్షల మంది లబ్ధిదారులకు పదకొండు రకాల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పక్కా ప్రణాళికతో పంపిణీ చేశామన్నారు. సోమవారం ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే నగదు అందజేసేలా చూశామని తెలిపారు. ఇందుకుగాను శనివారమే అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేశామని.. నియోజకవర్గానికి ఒక అధికారికి పర్యవేక్షణ బాధ్యత అప్పగించినట్లు వివరించారు. ఎక్కడైనా సాంకేతిక కారణాలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తొలిరోజు మిగిలిపోయిన వారికి రెండో రోజూ అందించినట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యపై కక్షతో బాలికపై అత్యాచారం
[ 06-07-2024]
వరుసకు కుమార్తె అయిన చిన్నారిని రెండు రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే ఉంచి అత్యాచారానికి పాల్పడ్డాడు.. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తించి బాలికను కాపాడారు. -
తాళాలిస్తే నిధులు తినేశారు
[ 06-07-2024]
జిల్లాలో ఒంగోలు కోఆపరేటివ్ డివిజన్ పరిధిలో 70, మార్కాపురం పరిధిలో 23 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, అనుబంధ శాఖలు ఏర్పాటయ్యాయి. సహకార సమాఖ్య శాఖోపశాఖలుగా విస్తరించింది. -
మీరే చిన్నారి శాస్త్రవేత్తలు
[ 06-07-2024]
-
సమస్యలు తీర్చలేక.. దౌర్జన్యకాండ
[ 06-07-2024]
-
వసూళ్ల ఎస్సైపై వేటు
[ 06-07-2024]
ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్సై సుదర్శన్ యర్రగొండపాలెం వచ్చారు. తిరిగి బదిలీ ఎలాగూ తప్పదని భావించారు. ఈలోపే అందిన కాడికి దండుకోవాలని నిర్ణయించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సిబ్బంది విధుల నిర్వహణకు తాను భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని.. -
చిరు కారణాలే ఉసురు తీశాయి..
[ 06-07-2024]
భార్య గుడికి రాలేదని ఒకరు.. భర్త మద్యం మానలేదని మరొకరు..ఇలా చిరు కారణాలకే వారు వేదనకు గురయ్యారు. క్షణకాలం ప్రశాంత చిత్తంతో ఆలోచించలేకపోయారు..ఆఖరికి అమూల్యమైన ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. -
బియ్యం బొక్కుతున్న పందికొక్కులు
[ 06-07-2024]
పేదల బియ్యాన్ని బొక్కేందుకు కొందరు పోటీ పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్నిచోట్ల ఎండీయూ వాహనాల నుంచే అక్రమార్కులు బియ్యాన్ని దారి మళ్లించేవారు. ఇంకొన్నిచోట్ల లబ్ధిదారులకు నగదు చెల్లించి కొనుగోలు చేసేవారు. -
వైకాపా నిర్లక్ష్యానికి తెదేపా చికిత్స
[ 06-07-2024]
-
అల్పాహారం తెమ్మన్నారు.. తినేలోపు ప్రాణాలు విడిచారు
[ 06-07-2024]
ఆకలి తీర్చుకునేందుకు ఓ లారీ డ్రైవర్ హోటల్ వద్ద ఆగారు. తినేందుకు అల్పాహారం తీసుకురమ్మని అక్కడి సిబ్బందికి తెలిపారు. వారు తెచ్చి ఎదుట ఉంచే సమయానికే అతను ప్రాణాలు విడిచారు. -
ఇనుప రాడ్లతో బాది.. గొంతుకు ఉరి బిగించి..
[ 06-07-2024]
కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. గొంతుకు తాడు బిగించి ఉరితీసే ప్రయత్నం చేశారు. ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి చేరడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.