వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు.
నిర్వాసితులతో కలెక్టర్ అన్సారియా
వేములకోట వద్ద గొట్టిపడియ నిర్వాసిత కాలనీని పరిశీలిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులు
మార్కాపురం, న్యూస్టుడే: పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులను అధికారులతో కలిసి ఆమె మంగళవారం పరిశీలించారు. తొలుత మార్కాపురం మండలం వేములకోట పంచాయతీలోని కోమటికుంట వద్ద గొట్టిపడియ నిర్వాసితులకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీని సందర్శించారు. అనంతరం గొట్టిపడియ ఆనకట్ట వద్ద నిర్మాణంలో ఉన్న వాటర్ గ్రిడ్ వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి సుంకేసుల ఆనకట్ట వద్దకు చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత పెద్దారవీడు మండలంలోని కలనూతల ముంపు గ్రామానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. సహేతుకమైన నష్టపరిహారం అందిస్తే గ్రామాలు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని నిర్వాసితులు తెలిపారు. ఈ ప్రభుత్వంలో పూర్తిస్థాయి న్యాయం ఒనగూరుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈలోపు నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అవసరమైన సేవలందేలా చూస్తామని భరోసా కల్పించారు. అనంతరం ఉప కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని విలేకర్లతో మాట్లాడారు. సాయంత్రం వేళ మార్కాపురం మండలం దరిమడుగులోని ఇడుపూరు-1, ఇడుపూరు-2, పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామాల్లో నిర్మిస్తున్న పునరావాస కాలనీలను కలెక్టర్ పరిశీలించారు. ఏ పనులు చేశారు.. ఎన్ని భవనాలు పూర్తి చేశారనే విషయాలతో పాటు మౌలిక వసతుల కల్పనపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో ఉప కలెక్టర్ రాహుల్మీనా, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఝాన్సీలక్ష్మి, మార్కాపురం, కంభం ప్రాజెక్టుల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సత్యనారాయణ, డి.నాగజ్యోతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మర్దన్అలీ, ప్రాజెక్ట్ సూపరింటెండెంట్ ఇంజినీర్ అబూల్ అలీమ్, డీఎల్డీవో సాయికుమార్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో చందన, ఇతర అధికారులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులతో చెలగాటం.. చదువుల విధ్వంసం
[ 05-07-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి శపథం చేశారు. -
ఆశలు కూల్చిన వైకాపా.. కూటమి పైనే భారమంతా!
[ 05-07-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తున్నది కాలనీలు కాదు.. ఊళ్లంటూ గత వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టింది. ఆ తర్వాత ఐచ్ఛికాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. -
మా నాన్న ఇస్తే నాకేంటీ!
[ 05-07-2024]
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామానికి చెందిన భవిష్యత్తు తరాలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు ఓ దాత. గ్రామంలోని ఉన్నత పాఠశాలకు తనవంతు సాయం చేయాలనుకున్నారు. -
పశ్చిమాన తీరనున్న నీటి ఎద్దడి
[ 05-07-2024]
మార్కాపురం నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా తాగు, వాడుక నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందించారు. -
అల్లూరి.. నేటితరం యువతకు స్ఫూర్తి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. -
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థి సంఘాల భగ్గు
[ 05-07-2024]
నీట్ ప్రశ్న పత్రం లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
[ 05-07-2024]
‘బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల బంగారు జీవితాలకు నిలయమైనవి గురుకులాలు. అటువంటి విద్యాలయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. -
గ్రానైట్ ఎగుమతులకు పచ్చజెండా
[ 05-07-2024]
కొంతకాలంగా నిలిచిపోయిన గ్రానైట్ ఎగుమతులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కారం పొడి చల్లి.. మారణాయుధాలతో దాడి
[ 05-07-2024]
మద్యం షాపు వద్ద తమతో గొడవ పడిన యువకుడి కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. -
మిరప వ్యాపారి అపహరణ కథ సుఖాంతం
[ 05-07-2024]
మిరపకాయల డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారిని రైతులు ఎట్టకేలకు విడుదల చేశారు. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. -
రాలిన చదువుల చిట్టితల్లి
[ 05-07-2024]
మంచి భవిత కోసం ఆ చిట్టి తల్లి ఎన్నో కలలు కంది..చదువు కోసం పరితపించింది..అయితే పెళ్లి చేసుకోవాలంటూ మాతృమూర్తే ఒత్తిడి తేవడంతో ఆమెకు దిక్కుతోచలేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్రెడ్డి భేటీకి ప్రజాభవన్లో ఏర్పాట్లు
-
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
-
నష్టాలతో ప్రారంభమై.. ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
తెలంగాణ శాసనమండలి ఉనికికి ప్రమాదం ఏర్పడింది: మాజీ ఎంపీ వినోద్
-
ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి.. ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా..?
-
జమ్మూకశ్మీర్ ఎన్నికలు అప్పుడేనా..?