హవ్వ.. దాతృత్వానికీ మస్కా
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం.
చేయని పనులకూ వైకాపా నేతల బిల్లులు
నర్రమారెళ్ల వాసుల తాగునీటి సౌకర్యార్థం దాత చెంచు రామయ్య వేయించిన బోరు
పామూరు, న్యూస్టుడే: దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. ఈ గ్రామంలోని బీసీ కాలనీ వాసులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన గుంటుపల్లి చెంచురామయ్య తెలుసుకున్నారు. తాగునీటి వెతలు తీర్చేందుకు తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. కాలనీకి సమీపంలో సొంత నిధులు రూ. 50 వేలు వెచ్చించి 2019లో బోరు ఏర్పాటు చేయించారు. అనంతరం వైకాపా నాయకులు రంగంలోకి దిగారు. సదరు బోరును దాత అందించిన సొమ్ముతో కాకుండా పంచాయతీ నిధులతో వేయించినట్లు చూపాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటి అధికార పార్టీ నేతలు అడగడమే తరువాయి ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ, పంచాయతీ కార్యదర్శి, ఈవోఆర్డీలు దస్త్రాలకు పరుగులు తీయించారు. నిబంధలనకు విరుద్ధంగా బిల్లు చేసి మంజూరు చేయించారు. అక్రమార్కులకు అనుచిత లబ్ధి చేకూర్చారు. ఈ విషయం ఇటీవల నిర్వహించిన పామూరు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో వెలుగులోకి వచ్చింది. వైకాపా నాయకుల కక్కుర్తి వ్యవహారాన్ని లక్ష్మీనరసాపురం ఎంపీటీసీ సభ్యుడు బొల్లా నరసింహారావు ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసంహారెడ్డి దృష్టికి తెచ్చారు. దాత వేయించిన బోరుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి ఇతరులకు బిల్లులెలా చెల్లిస్తారని ఆయన అధికారులను ప్రశ్నించారు. నిధులు రికవరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇవే కాకుండా వైకాపా నాయకులు తమ ఇళ్ల వద్ద బోర్లు వేసుకుని ప్రభుత్వం నుంచి బిల్లులు చేసుకున్నట్లు విమర్శలున్నాయి. పామూరు, సి.ఎస్.పురం మండలాల్లోని పలు పంచాయతీలు, గ్రామాల్లో రహదారి పనులు చేయకుండానే చేసినట్లు చూపి మండల పరిషత్తు, పంచాయతీ నిధులు బొక్కారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై పామూరు ఎంపీడీవో పి.పుట్టారెడ్డి మాట్లాడుతూ.. నర్రమారెళ్లలో దాత వేయించిన బోరుకు ఇతరులు బిల్లులు చేశారనే విషయంపై విచారణ చేయిస్తామన్నారు. ఇంకా ఎక్కడెక్కడ పనులు చేయకుండా బిల్లులు చేశారనే వివరాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యపై కక్షతో బాలికపై అత్యాచారం
[ 06-07-2024]
వరుసకు కుమార్తె అయిన చిన్నారిని రెండు రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే ఉంచి అత్యాచారానికి పాల్పడ్డాడు.. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తించి బాలికను కాపాడారు. -
తాళాలిస్తే నిధులు తినేశారు
[ 06-07-2024]
జిల్లాలో ఒంగోలు కోఆపరేటివ్ డివిజన్ పరిధిలో 70, మార్కాపురం పరిధిలో 23 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, అనుబంధ శాఖలు ఏర్పాటయ్యాయి. సహకార సమాఖ్య శాఖోపశాఖలుగా విస్తరించింది. -
మీరే చిన్నారి శాస్త్రవేత్తలు
[ 06-07-2024]
-
సమస్యలు తీర్చలేక.. దౌర్జన్యకాండ
[ 06-07-2024]
-
వసూళ్ల ఎస్సైపై వేటు
[ 06-07-2024]
ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్సై సుదర్శన్ యర్రగొండపాలెం వచ్చారు. తిరిగి బదిలీ ఎలాగూ తప్పదని భావించారు. ఈలోపే అందిన కాడికి దండుకోవాలని నిర్ణయించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సిబ్బంది విధుల నిర్వహణకు తాను భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని.. -
చిరు కారణాలే ఉసురు తీశాయి..
[ 06-07-2024]
భార్య గుడికి రాలేదని ఒకరు.. భర్త మద్యం మానలేదని మరొకరు..ఇలా చిరు కారణాలకే వారు వేదనకు గురయ్యారు. క్షణకాలం ప్రశాంత చిత్తంతో ఆలోచించలేకపోయారు..ఆఖరికి అమూల్యమైన ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. -
బియ్యం బొక్కుతున్న పందికొక్కులు
[ 06-07-2024]
పేదల బియ్యాన్ని బొక్కేందుకు కొందరు పోటీ పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్నిచోట్ల ఎండీయూ వాహనాల నుంచే అక్రమార్కులు బియ్యాన్ని దారి మళ్లించేవారు. ఇంకొన్నిచోట్ల లబ్ధిదారులకు నగదు చెల్లించి కొనుగోలు చేసేవారు. -
వైకాపా నిర్లక్ష్యానికి తెదేపా చికిత్స
[ 06-07-2024]
-
అల్పాహారం తెమ్మన్నారు.. తినేలోపు ప్రాణాలు విడిచారు
[ 06-07-2024]
ఆకలి తీర్చుకునేందుకు ఓ లారీ డ్రైవర్ హోటల్ వద్ద ఆగారు. తినేందుకు అల్పాహారం తీసుకురమ్మని అక్కడి సిబ్బందికి తెలిపారు. వారు తెచ్చి ఎదుట ఉంచే సమయానికే అతను ప్రాణాలు విడిచారు. -
ఇనుప రాడ్లతో బాది.. గొంతుకు ఉరి బిగించి..
[ 06-07-2024]
కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. గొంతుకు తాడు బిగించి ఉరితీసే ప్రయత్నం చేశారు. ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి చేరడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.