వీరుడికి కన్నీటి వీడ్కోలు
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది.
జేసీవో మృతితో తల్లడిల్లిన కాలువపల్లి
అధికారిక లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
వందనం సమర్పిస్తున్న ఎమ్మెల్యే అశోక్రెడ్డి
కంభం (రాచర్ల), న్యూస్టుడే : వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది.
లద్దాఖ్ ప్రాంతంలో సైనిక యుద్ధట్యాంకులో నది దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన జేసీవో ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) అంత్యక్రియలు మంగళవారం సొంతూరు రాచర్ల మండలం కాలువపల్లిలో అశ్రు నయనాల నడుమ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సైనికాధికారులు లెఫ్టినెంట్ కల్నల్ సందీప్యాదవ్, నాయక్ సుబేదార్లు శేషురామ్, రంగనాయకులు, నాయక్ బి.నరేందర్, సిపాయిలు సాయిప్రశాంత్ తదితరులు వీర జవాన్పై కప్పిన జాతీయ జెండాను మృతుని భార్య ఉమాదేవికి అందజేస్తున్న క్షణాన..ఆమె, కుమారులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి వందనం సమర్పించారు. అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ అక్కడే ఉన్నారు.
సైనిక వాహనాన్ని అలంకరించి..
మృతదేహాన్ని అలంకరించిన సైనిక వాహనంలో ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. వీర జవాన్ కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి వద్ద కొద్దిసేపు నిలిపారు. గ్రామంలోని వారి వ్యవసాయ క్షేత్రం వద్దకు తీసుకెళ్లారు. మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్మీనా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజని, డీఎస్పీ బాలసుందరరావు, గిద్దలూరు రూరల్ సీఐ దాసరి ప్రసాద్, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇంటిలిజెన్స్ ఎస్సై రఫీ, మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం సైనికాధికారులు గౌరవ సూచకంగా గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తర్వాత అంత్యక్రియలు పూర్తిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భార్యపై కక్షతో బాలికపై అత్యాచారం
[ 06-07-2024]
వరుసకు కుమార్తె అయిన చిన్నారిని రెండు రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే ఉంచి అత్యాచారానికి పాల్పడ్డాడు.. పోలీసులు సాంకేతికత ఆధారంగా గుర్తించి బాలికను కాపాడారు. -
తాళాలిస్తే నిధులు తినేశారు
[ 06-07-2024]
జిల్లాలో ఒంగోలు కోఆపరేటివ్ డివిజన్ పరిధిలో 70, మార్కాపురం పరిధిలో 23 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, అనుబంధ శాఖలు ఏర్పాటయ్యాయి. సహకార సమాఖ్య శాఖోపశాఖలుగా విస్తరించింది. -
మీరే చిన్నారి శాస్త్రవేత్తలు
[ 06-07-2024]
-
సమస్యలు తీర్చలేక.. దౌర్జన్యకాండ
[ 06-07-2024]
-
వసూళ్ల ఎస్సైపై వేటు
[ 06-07-2024]
ఎన్నికల విధుల్లో భాగంగా ఎస్సై సుదర్శన్ యర్రగొండపాలెం వచ్చారు. తిరిగి బదిలీ ఎలాగూ తప్పదని భావించారు. ఈలోపే అందిన కాడికి దండుకోవాలని నిర్ణయించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ సిబ్బంది విధుల నిర్వహణకు తాను భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని.. -
చిరు కారణాలే ఉసురు తీశాయి..
[ 06-07-2024]
భార్య గుడికి రాలేదని ఒకరు.. భర్త మద్యం మానలేదని మరొకరు..ఇలా చిరు కారణాలకే వారు వేదనకు గురయ్యారు. క్షణకాలం ప్రశాంత చిత్తంతో ఆలోచించలేకపోయారు..ఆఖరికి అమూల్యమైన ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. -
బియ్యం బొక్కుతున్న పందికొక్కులు
[ 06-07-2024]
పేదల బియ్యాన్ని బొక్కేందుకు కొందరు పోటీ పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొన్నిచోట్ల ఎండీయూ వాహనాల నుంచే అక్రమార్కులు బియ్యాన్ని దారి మళ్లించేవారు. ఇంకొన్నిచోట్ల లబ్ధిదారులకు నగదు చెల్లించి కొనుగోలు చేసేవారు. -
వైకాపా నిర్లక్ష్యానికి తెదేపా చికిత్స
[ 06-07-2024]
-
అల్పాహారం తెమ్మన్నారు.. తినేలోపు ప్రాణాలు విడిచారు
[ 06-07-2024]
ఆకలి తీర్చుకునేందుకు ఓ లారీ డ్రైవర్ హోటల్ వద్ద ఆగారు. తినేందుకు అల్పాహారం తీసుకురమ్మని అక్కడి సిబ్బందికి తెలిపారు. వారు తెచ్చి ఎదుట ఉంచే సమయానికే అతను ప్రాణాలు విడిచారు. -
ఇనుప రాడ్లతో బాది.. గొంతుకు ఉరి బిగించి..
[ 06-07-2024]
కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. గొంతుకు తాడు బిగించి ఉరితీసే ప్రయత్నం చేశారు. ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి చేరడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.