సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
యజమాని తీరుపై అధికారుల ఆగ్రహం
పోలీసుల అదుపులో నిందితులు
సీజ్ చేసిన భవనాన్ని ధ్వంసం చేసిన దృశ్యం
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాచర్ల మండలం గంగపల్లెకి చెందిన గుత్తేదారుడు మీనిగె శివరంగారెడ్డి గిద్దలూరు నగర పంచాయతీలోని కాశిరెడ్డికుంటకు చెందిన 12 సెంట్ల స్థలంలో కొన్నేళ్ల క్రితం అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనిపై గిద్దలూరుకు చెందిన బండారు జనార్దన్రెడ్డి పలుమార్లు కలెక్టర్ను కలిసి మీనిగె శివరంగారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అర్జీలందించారు. ఆ మేరకు గత నెల 28న నగర పంచాయతీ అధికారులు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అయితే సోమవారం రాత్రి 11 గంటల సమయంలో యజమాని మీనిగె శివరంగారెడ్డి, అతని కుమారుడు సురేష్రెడ్డి భారీ యంత్రాన్ని తీసుకొచ్చి సీజ్చేసిన భవనాన్ని ధ్వంసం చేశారు. వీధి దీపాలు సైతం ఆపివేసి కూల్చివేతలు చేపడుతున్నారని స్థానికులు గిద్దలూరు కమిషనర్ వి.శ్రీనివాసరావు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఎం.రాజారెడ్డికి సమాచారమందించారు. దీంతో అక్కడికి చేరుకున్న కమిషనర్ వి.శ్రీనివాసరావు భవనాన్ని దగ్గరుండి కూల్చివేయిస్తున్న గుత్తేదారుడు మీనిగె శివరంగారెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేసి పోలీసులకు సమాచారమందించారు. గిద్దలూరు సీఐ వై.వి.సోమయ్య సిబ్బందితో అక్కడి చేరుకొని మీనిగె శివరంగారెడ్డి, అతని కుమారుడు సురేష్రెడ్డి, భవనాన్ని ధ్వంసం చేసిన యంత్రం యజమాని, డ్రైవర్ను, అక్కడున్న మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వై.వి.సోమయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడులతో చెలగాటం.. చదువుల విధ్వంసం
[ 05-07-2024]
అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి శపథం చేశారు. -
ఆశలు కూల్చిన వైకాపా.. కూటమి పైనే భారమంతా!
[ 05-07-2024]
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకంలో నిర్మిస్తున్నది కాలనీలు కాదు.. ఊళ్లంటూ గత వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టింది. ఆ తర్వాత ఐచ్ఛికాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట మార్చారు. -
మా నాన్న ఇస్తే నాకేంటీ!
[ 05-07-2024]
విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామానికి చెందిన భవిష్యత్తు తరాలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు ఓ దాత. గ్రామంలోని ఉన్నత పాఠశాలకు తనవంతు సాయం చేయాలనుకున్నారు. -
పశ్చిమాన తీరనున్న నీటి ఎద్దడి
[ 05-07-2024]
మార్కాపురం నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా తాగు, వాడుక నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి స్పందించారు. -
అల్లూరి.. నేటితరం యువతకు స్ఫూర్తి
[ 05-07-2024]
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమను నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. -
నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై విద్యార్థి సంఘాల భగ్గు
[ 05-07-2024]
నీట్ ప్రశ్న పత్రం లీకేజీని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. -
గురుకులాల్లో మిగులు సీట్ల భర్తీకి చర్యలు
[ 05-07-2024]
‘బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల బంగారు జీవితాలకు నిలయమైనవి గురుకులాలు. అటువంటి విద్యాలయాలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. -
గ్రానైట్ ఎగుమతులకు పచ్చజెండా
[ 05-07-2024]
కొంతకాలంగా నిలిచిపోయిన గ్రానైట్ ఎగుమతులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. -
కారం పొడి చల్లి.. మారణాయుధాలతో దాడి
[ 05-07-2024]
మద్యం షాపు వద్ద తమతో గొడవ పడిన యువకుడి కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. -
మిరప వ్యాపారి అపహరణ కథ సుఖాంతం
[ 05-07-2024]
మిరపకాయల డబ్బులు ఎగ్గొట్టిన వ్యాపారిని రైతులు ఎట్టకేలకు విడుదల చేశారు. దీంతో కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. -
రాలిన చదువుల చిట్టితల్లి
[ 05-07-2024]
మంచి భవిత కోసం ఆ చిట్టి తల్లి ఎన్నో కలలు కంది..చదువు కోసం పరితపించింది..అయితే పెళ్లి చేసుకోవాలంటూ మాతృమూర్తే ఒత్తిడి తేవడంతో ఆమెకు దిక్కుతోచలేదు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు