ప్రభుత్వ బడికి ఉరి
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి...
అయిదేళ్లలో తగ్గిన పిల్లల సంఖ్య రెండు లక్షలు
వైకాపా సర్కారు తీరుతో కుదేలైన విద్యా వ్యవస్థ
న్యూస్టుడే, ఒంగోలు నగరం
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... అయిదేళ్ల వ్యవధిలో దాదాపు రెండు లక్షల మంది తగ్గారు.
విలీనంతో పడిపోయిన ప్రవేశాలు...
గతంలో ప్రతి పల్లెలో ప్రాథమిక; మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత, అయిదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు నడిచేవి. గ్రామీణ విద్యార్థులకు ఇబ్బంది ఉండేది కాదు. 3, 4, 5 తరగతుల వారికి కూడా సబ్జెక్టు నిపుణుల బోధన ఉండాలని, ఆంగ్ల విద్య బలోపేతం చేయాలని... వైకాపా ప్రభుత్వం ఈ తరగతులను కిలోమీటరు పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. రహదారుల, చెరువులు, కాలువలు, వంతెనలు అడ్డంగా ఉన్నచోట వీలీనం వద్దన్న నిబంధన ఉన్నా సక్రమంగా అమలు కాలేదు. దూరంగా ఉన్న బడికి చిన్న పిల్లలను పంపలేక తల్లిదండ్రులు ప్రైవేటును ఆశ్రయించారు. దీంతో ఒకటో తరగతిలో ప్రవేశాలు తగ్గాయి. ఆ సాకుతో ఉపాధ్యాయులను కుదించారు. ఇరవై మంది పిల్లలకు ఒకరు చాలన్న నిబంధనతో జిల్లాలో 245 పాఠశాలలు ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆరో తరగతిలో చేరికలూ పడిపోయాయి. ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు ఇస్తున్నామని చెప్పినా... ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే వచ్చింది. అయినప్పటికీ దిద్దుబాట చర్యలు తీసుకోలేదు.
- జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో ఏడాది నుంచే పాఠశాలలకు కష్టకాలం మొదలైంది. అశాస్త్రీయమైన 117 జీవో తెచ్చి... జిల్లాలోని దాదాపు 300 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల పిల్లలను... 230 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆ జీవోతో ప్రాథమిక విద్యకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు మొత్తుకున్నా పాలకులు చెవికెక్కించుకోలేదు. పేద విద్యార్థులకు చదువుకు దూరమవుతున్నా మొండిగా వ్యవహరించారు.
- ప్రభుత్వం చెప్పిన విధంగా సబ్జెక్టు టీచర్లు పూర్తిస్థాయిలో లేక బోధన కుంటుపడింది. ఉన్నవారికే ఉద్యోగోన్నతులు ఇవ్వడంతో చాలామంది పట్టణాలకు సమీపంలో పోస్టింగులు కోరుకున్నారు. దీంతో పుల్లలచెరువు, యర్రగొండపాలెం, దోర్నాల, అర్థవీడు వంటి మండలాల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. ప్రధానంగా సోషల్, గణితం, ఆంగ్ల ఉపాధ్యాయులు లేక ఉన్నవారితోనే సరిపెట్టుకుంటున్నారు. నాడు-నేడు కింద రూ.లక్షలు వెచ్చించి ప్రాథమిక బడుల్లో నిర్మించిన గదులు నిరుపయోగంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం
[ 03-07-2024]
దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. -
రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు
[ 03-07-2024]
వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. -
వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. -
న్యాయం.. భారతీయ స్వరూపం
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. -
పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
[ 03-07-2024]
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. -
ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!
[ 03-07-2024]
‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. -
వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-07-2024]
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
హవ్వ.. దాతృత్వానికీ మస్కా
[ 03-07-2024]
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. -
వీరుడికి కన్నీటి వీడ్కోలు
[ 03-07-2024]
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. -
ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్
[ 03-07-2024]
విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటుపడింది. -
ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..
[ 03-07-2024]
రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. -
సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
[ 03-07-2024]
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి భర్తను అంతమొందించిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ