logo

తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!

గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్‌ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు.

Published : 01 Jul 2024 06:17 IST

ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరిన ఛైర్మన్‌ వెంకటసుబ్బయ్య, కౌన్సిలర్లు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్‌ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. దీంతో పాలకవర్గం తెదేపా ఖాతాలోకి చేరింది. పట్టణంలో మొత్తం ఇరవై వార్డులు ఉన్నాయి. 2021 మార్చిలో జరిగిన పురపాలక ఎన్నికల్లో తెదేపా 3, వైకాపా 17 వార్డులు గెలుచుకున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో వైకాపా కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఛైర్మన్‌తో పాటు సభ్యులు పరుచూరి సుభాషిణి, గర్రె సునీత, దేమా చాముండేశ్వరి, పఠాన్‌ ఖాదర్‌ఖాన్‌ (పెద్దవలి), షేక్‌ హసీనా తెదేపాలో చేరారు. దీంతో తెలుగుదేశం కౌన్సిలర్ల సంఖ్య 11 చేరి... నగర పంచాయతీ పాలకవర్గం తెదేపా వశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని