పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు,
ఈ నెలలో పంపిణీ నిలిపివేత
నేటి నుంచి యధావిధిగా బియ్యం సరఫరా
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, నాణ్యతను పరిశీలించారు. రేషన్ దుకాణాలతోపాటు, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బియ్యం, కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్లల్లో 50 నుంచి 100 గ్రాముల వరకు తగ్గుదల ఉన్నట్లు గుర్తించారు. ఇదే విషయమై జిల్లాలోని అన్ని గోదాముల్లోనూ స్థానిక పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రతి ప్యాకెట్లోనూ 5 నుంచి 15 గ్రాముల వరకు తూకం తక్కువ ఉన్నట్లు గుర్తించారు. సదరు నివేదికలను అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు పంపించారు. ఈ మేరకు జులై నెలకు సంబంధించి కార్డుదారులకు కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశాలందాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో గత నెల వరకు పంచదార కూడా ఇస్తున్నప్పటికీ తూకం తక్కువ కారణంగా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ నిలిపివేశారు. సదరు ప్యాకెట్లను తూకం ప్రకారం మళ్లీ ప్యాకింగ్ చేయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జిల్లా అంతటా సోమవారం నుంచి ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించనుండగా; కార్డుదారులకు బియ్యం మాత్రమే ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాహనాలు తొలగిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ వాటిపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యథావిధిగా సరఫరా చేయనున్నారు.
సరఫరాదారులు వైకాపా మద్దతుదారులే..!
రేషన్ సరఫరా చేసే గుత్తేదారులు అంతా వైకాపా మద్దతుదారులు కావడం విశేషం. అయిదేళ్లపాటు జిల్లావ్యాప్తంగా అన్ని ఎం.ఎల్.ఎస్.పాయింట్లకు, ఆ తర్వాత కోటా ప్రకారం అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరకులు పంపిణీ చేశారు. సరకులిచ్చే క్రమంలో గోదాముల వద్ద ఉండే అధికారులు తూకాలు వేసుకుని సరి చూసుకోవాలి. అందుకు విరుద్ధంగా గుత్తేదారుల నుంచి వచ్చిన రాజకీయ ఒత్తిడితో చూసీచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తనిఖీలు ప్రారంభించాక వైకాపా గుత్తేదారుల్లో గుబులు మొదలైంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని ఆందోళన చెందుతున్నారు.
రెండేళ్లుగా నిలిచిన కందిపప్పు
ప్రకాశం జిల్లాలో 1392 రేషన్ దుకాణాలు ఉండగా, వాటి పరిధిలో 6.70 లక్షల బియ్యం కార్డులున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరకులను పెంచుతామని ప్రకటించిన జగన్..చివరికి వచ్చే సరికి 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సరకులకే కోత విధించారు. పేద కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెలా అందించే కందిపప్పును వైకాపా ప్రభుత్వం గత రెండేళ్లుగా అరకొరగానే సరఫరా చేసింది. సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి ఎవరూ పట్టించుకోకపోవడంతో మే, జూన్ నెలలో కందిపప్పు పంపిణీ పూర్తిగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ఒంగోలు నగరంతోపాటు, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లోని పేద కుటుంబాలకు రాయితీపై గోధుమ పిండి ఇచ్చేవారు. జూన్ నెలలో అది కూడా ఆగిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం
[ 03-07-2024]
దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. -
రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు
[ 03-07-2024]
వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. -
వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. -
న్యాయం.. భారతీయ స్వరూపం
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. -
పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
[ 03-07-2024]
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. -
ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!
[ 03-07-2024]
‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. -
వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-07-2024]
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
హవ్వ.. దాతృత్వానికీ మస్కా
[ 03-07-2024]
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. -
వీరుడికి కన్నీటి వీడ్కోలు
[ 03-07-2024]
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. -
ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్
[ 03-07-2024]
విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటుపడింది. -
ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..
[ 03-07-2024]
రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. -
సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
[ 03-07-2024]
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు