మృత్యుకుంట మింగేసింది
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది.
అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు..
పిల్లలిద్దరూ వరుసకు అన్నదమ్ములు
తూర్పు వీరాయపాలెంలోని నీటి కుంట వీరమణికంఠ, రాఘవ (పాతచిత్రాలు)
దర్శి, న్యూస్టుడే: అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. చనిపోయిన ఇద్దరు చిన్నారులు వరుసకు అన్నదమ్ములు కావడం గమనార్హం. ఈ సంఘటన దర్శి మండలం తూర్పువీరాయపాలెం ఎస్సీ కాలనీలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. సంఘటనలో పులి రాఘవ (12), ధర్నాసి వీరమణికంఠ (10) ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పువీరాయపాలెం ఎస్సీ కాలనీకి చెందిన వెంకటసుబ్బయ్య, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వెంకట రమణను పొదిలి మండలం వేలూరుకు చెందిన బాలచంద్రుడికిచ్చి వివాహం చేశారు. కూలి పనులు చేసుకుని జీవించే వారికి ముగ్గురు పిల్లలు కాగా, ద్వితీయ కుమారుడు వీరమణికంఠ ఆరో తరగతి చదువుతున్నాడు.
విలపిస్తున్న బంధువులు, ధైర్యం చెబుతున్న తెదేపా నేత డా.లలిత్సాగర్
రెండో కుమార్తె లక్ష్మిని అద్దంకి మండలం వెలమూరిపాడుకు చెందిన శ్రీనివాసరావుకిచ్చి పెళ్లి చేశారు. కూలి పనులు చేసుకునే వీరికి ఇద్దరు కుమారులు కాగా, చిన్నవాడైన రాఘవ 6వ తరగతి చదువుతున్నాడు. నెల పొంగళ్లు సమర్పించేందుకు రాఘవ, వీరమణికంఠ వారి వారి తల్లులతో పాటు తూర్పు వీరాయపాలెం వచ్చారు. ఆదివారం ఉదయం అన్నదమ్ములిద్దరూ బహిర్భూమి కోసం కాలనీకి సమీపంలోని వాగు వైపు వెళ్లారు. ప్రమాదవశాత్తూ అక్కడి నీటి గుంతలో జారిపడి మునిగిపోయారు. వీరితో వచ్చిన మరో బాలుడు వెంటనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకుని ఇద్దరు చిన్నారులను గుంత నుంచి వెలుపలికి తీసుకురాగా, అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు మృతితో తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధితులను తెదేపా నాయకులు డా.కడియాల లలిత్సాగర్ ఓదార్చారు. కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం చేయడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం
[ 03-07-2024]
దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. -
రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు
[ 03-07-2024]
వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. -
వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. -
న్యాయం.. భారతీయ స్వరూపం
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. -
పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
[ 03-07-2024]
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. -
ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!
[ 03-07-2024]
‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. -
వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-07-2024]
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
హవ్వ.. దాతృత్వానికీ మస్కా
[ 03-07-2024]
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. -
వీరుడికి కన్నీటి వీడ్కోలు
[ 03-07-2024]
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. -
ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్
[ 03-07-2024]
విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటుపడింది. -
ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..
[ 03-07-2024]
రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. -
సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
[ 03-07-2024]
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు