రామాపురంలో రైతు హత్య
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
గొడ్డలితో నరికి చంపిన దుండగులు
మూడో భార్యతో ఇటీవలే రాజీ
రంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ బాలసుందరరావు
కంభం (రాచర్ల), న్యూస్టుడే : గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు.. గ్రామానికి చెందిన అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డి (47) రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని ఎస్సీ పాలేనికి వెళ్లే దారిలో మృతదేహం పడివుండగా గుర్తించారు. మృతునికి మూడు పెళ్లిళ్లయ్యాయి. మొదటి వివాహం మేనమామ కూతురు రేణుకతో అయింది. ఆమె కొంతకాలానికి ఆయన వద్ద నుంచి వెళ్లిపోయింది. వారిద్దరికీ ఓ కుమార్తె ఉంది. ఆ తర్వాత మరో మహిళను వివాహం చేసుకోగా, ఆమె మృతి చెందింది. 15 ఏళ్ల కిందట మూడో భార్య రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం దంపతులిద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ పరస్పరం కేసులు పెట్టుకున్నారు. శనివారం దంపతులిద్దరూ లోక్ అదాలత్లో పరస్పరం రాజీ పడ్డాక ఇంటికొచ్చారు. వీరిద్దరికీ కూతురు ఉంది. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చిన్న రంగారెడ్డి ఆచూకీ తెలియరాలేదు. ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థుడు శ్రీరంగారెడ్డి దారిలో ఓ మృతదేహాన్ని చూసి చిన్న రంగారెడ్డి బంధువులు తెలిపారు. మృతుడి తలపై గొడ్డలితో నరికిన గాయాలు న్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. డాగ్ స్వ్కాడ్, క్లూస్టీం సభ్యులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సంఘటన స్థలాన్ని మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు పరిశీలించారు. విచారణ జరుగుతోందని, హత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు. గిద్దలూరు సీఐ సోమయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి
మృతుడు లక్ష్మయ్య (పాత చిత్రం)
కురిచేడు: అనుమానాస్పద స్థితిలో ఓ కూలీ మృతి చెందిన సంఘటన మండలంలోని దేకనకొండ గ్రామ సమీపంలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలంలోని గొల్లగెరి గ్రామానికి చెందిన ఐలవోని లక్ష్మయ్య (64) ఉపాధి నిమిత్తం దర్శి ప్రాంతానికి వచ్చి రైల్వే పనులు చేసేవారు. అయితే నెల క్రితం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం దేకనకొండవాసులు గ్రామ సమీపంలో కుళ్లిన ఓ మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు తెలిపారు. దీంతో ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి లక్ష్మయ్యగా గుర్తించారు. చనిపోయి దాదాపు నెల రోజులు కావడంతో శవం పూర్తిగా కుళ్లిపోయింది. మృతుడి బావ మరిది మాదగిరి కురుమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు లక్ష్మయ్యకు భార్య చెన్నమ్మ, ముగ్గురు కుమార్తెలున్నారు.
విశ్రాంత సైనికుడి మృతి
కంభం(రాచర్ల) : కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ విశ్రాంత సైనికుడు మృతి చెందారు. ఈ సంఘటన రాచర్ల మండలం త్రిపురారం క్రాస్ రోడ్డు సమీపంలో అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన పేరూరి గుంటయ్య (63) గత కొంతకాలంగా గిద్దలూరు నివాసం ఉంటున్నారు. సొంతూరిలో పొలం పనులు చేసుకొని ద్విచక్ర వాహనంపై గిద్దలూరు వెళ్తుండగా, గిద్దలూరు నుంచి మోటు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దాంతో ఆయనకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య అంకమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి..
ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు(42) మరో ఇద్దరితో కలిసి స్థానిక చెరువులో నేల బావి వద్ద చేపలు పట్టేందుకు వెళ్లారు. నాగరాజు ప్రమాదవశాతూ బావిలో పడి మునిగిపోయి మృతి చెందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం
[ 03-07-2024]
దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. -
రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు
[ 03-07-2024]
వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. -
వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. -
న్యాయం.. భారతీయ స్వరూపం
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. -
పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
[ 03-07-2024]
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. -
ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!
[ 03-07-2024]
‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. -
వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-07-2024]
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
హవ్వ.. దాతృత్వానికీ మస్కా
[ 03-07-2024]
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. -
వీరుడికి కన్నీటి వీడ్కోలు
[ 03-07-2024]
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. -
ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్
[ 03-07-2024]
విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటుపడింది. -
ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..
[ 03-07-2024]
రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. -
సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
[ 03-07-2024]
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.