logo

భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది

Published : 29 Jun 2024 04:14 IST

ప్రవర్తనపై అనుమానమే కారణం 

శివలక్ష్మి మృతదేహం 

నిజాంపట్నం, న్యూస్‌టుడే : భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్‌ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. అడవులదీవి ఎస్సై వెంకటరవి తెలిపిన సమారం మేరకు వివరాలు.. నక్షత్రనగర్‌ గ్రామానికి చెందిన బర్రి వెంకటేశ్వరరావుకి కొత్తపట్నంకు చెందిన శివలక్ష్మి (30)తో పదేళ్లక్రితం వివాహమైంది. వీరికి 8, 6ఏళ్ల వయసున్న నాని, నాగజ్యోతి అనే పిల్లలున్నారు. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శివలక్ష్మికి వెంకటేశ్వరరావు అక్క కుమారుడైన చెన్ను వెంకటేశ్వరరావుతో ఏర్పడిన సాన్నిహిత్యం అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో వారు కొన్ని రోజులు దూరంగా వెళ్లి జీవనం సాగించారు. ఇటీవల చెన్ను వెంకటేశ్వరరావును శివలక్ష్మి దూరం పెట్టింది. అతను తిరిగి దగ్గరయ్యేందుకు ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. దాంతో ఆమెపై కక్ష పెంచుకుని, ‘నిన్ను నీ భర్తతో’నే చంపిస్తానని బెదిరించాడు. అంతటితో ఆగక మేనమామ వెంకటేశ్వరరావుకు ఆమె ప్రవర్తనపై అనుమానం రేకెత్తించాడు. వారిద్దరూ కలసి గురువారం రాత్రి మద్యం తాగారు. శుక్రవారం తెల్లవారుజామున శివలక్ష్మి ఇంటికి వచ్చారు. కోపంతో ఉన్న భర్త బర్రి వెంకటేశ్వరరావు మద్యం మత్తులో నిద్రిస్తున్న శివలక్ష్మి మెడపై గొడ్డలితో నరికాడు. ఘటనాస్థలంలోనే ఆమె మృతి చెందింది. వెంటనే కుమారుడు నాని ఈ విషయాన్ని స్థానికులకు తెలిపాడు. వెంటనే నిందితులు పరారయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని