ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది.
ఒంగోలు ట్రిపుల్ఐటీ ప్రాంగణం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. రాష్ట్రంలోని నాలుగు ప్రాంగణాలకు సంబంధించి మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 34,154 మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 19,671 మంది, పక్క రాష్ట్రాల నుంచి 38 మంది దరఖాస్తు చేయగా, వారిలో బాలికలు 30,857, బాలురు 23,006 మంది ఉన్నారు. ప్రత్యేక కేటగిరీ సైనిక సంతతి విభాగంలో 2,582, ఎన్సీసీ నుంచి 1,830, స్పోర్ట్స్ కోటా కింద 1,162 మంది, దివ్యాంగుల కేటగిరీలో 332 మంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో 270 మంది దరఖాస్తు చేశారు. వారికి నూజివీడు ప్రాంగణంలో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. సైనిక సంతతి వారికి జులై ఒకటి నుంచి మూడు వరకు, ఎస్సీసీ వారికి 3 నుంచి 5, దివ్యాంగులకు మూడో తేదీన, స్పోర్ట్స్ కేటగిరీకి 3 నుంచి 5 తేదీల్లో స్కౌట్స్ విభాగానికి రెండు, మూడు తేదీల్లో దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది.
జులై 11న జాబితా: ఎంపిక జాబితాను జులై 11న విడుదల చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన నూజివీడు, ఇడుపులపాయలో జులై 22, 23 తేదీల్లో, ఒంగోలు ప్రాంగణంలో 24, 25 తేదీల్లో, శ్రీకాకుళంలో 26, 27 తేదీల్లో జరుగుతుందని ప్రవేశాల కన్వీనర్ ఎస్.అమరేంద్రకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసేటప్పుడు ప్రత్యేక కేటగిరీ దృవపత్రం పెట్టడం మరచిపోయినవారు సంబంధిత పత్రం తీసుకొని నిర్ణీత తేదీల్లో పరిశీలనకు నూజివీడు రావచ్చన్నారు. అభ్యర్థి మెరిట్, కేటగిరీ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చిన ప్రాధాన్యం ఆధారంగా ప్రాంగణాన్ని కేటాయిస్తామన్నారు. ప్రవేశం పూర్తయ్యాక ప్రాంగణాల అంతర్గత బదిలీకి అనుమతించేది లేదని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఎమ్మెల్యేలిద్దరినీ విప్లుగా ప్రకటించండి: సీఎం చంద్రబాబుకు పవన్ లేఖ
-
ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.3వేల కోట్ల సమీకరణ
-
లోక్సభలో రాహుల్ ప్రసంగం.. ప్రధాని మోదీ అభ్యంతరం
-
విద్యార్థుల ఆస్ట్రేలియా కల మరింత భారం..!
-
కొత్త నేర చట్టాలపై విపక్షాలది అనవసర ఆరోపణే: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
-
ఇక నిరుద్యోగిని.. ఏమైనా ఉద్యోగాలున్నాయా?: ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు