సురేషూ.. నీతులు వల్లించొద్దు
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు.
దొంగే దొంగ అన్నట్లు వైకాపా నేతల తీరు
ప్రభుత్వం ఒక్క పింఛనూ తొలగించదు
సమావేశంలో మంత్రి స్వామి
ప్రసంగిస్తున్న మంత్రి బాలవీరాంజనేయ స్వామి.. వేదికపై తెదేపా నేతలు
మర్రిపూడి, న్యూస్టుడే: ‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. ఎస్సీ ఎమ్మెల్యేనైన నాపై శాసనసభలోనే దాడి చేసినా., అవమానించినా ఖండించలేదు. ఎస్సీలకు మీ నాయకులు శిరోముండనం చేసినా అదేమని అడగలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించినా నోరు మెదపలేదు. అటువంటిది నువ్వా ఇప్పుడు నీతులు మాట్లాడేది’ అని మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ఆదిమూలపు సురేష్ను మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. తెదేపా నేతలు, కార్యకర్తలు, మండల వాసులతో ఆయన మర్రిపూడిలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా, విధానాలను ప్రశ్నించినా, అవినీతిపై మాట్లాడినా కేసులు పెట్టారన్నారు. తనపై 11, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై 27 వరకు పోలీసు కేసులను గత వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టించిందని విమర్శించారు. అలాంటిది తాము వైకాపా వర్గీయులపై అక్రమ కేసులు పెడుతున్నామంటూ మాజీ మంత్రి సురేష్ ఆరోపణలు చేస్తుండటం సిగ్గుచేటన్నారు. దొంగే దొంగ అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలు ఎక్కడా లేవని, ప్రత్యర్థులు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అదే సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల 1న బకాయిలతో కలిపి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ నగదు రూ.7,000 ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తాము పింఛన్లు తొలగిస్తామనే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో తెదేపా మండల అధ్యక్షుడు నరసారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహారావు, నేతలు వీరనారాయణ, హనుమారెడ్డి, శ్రీనువాసులు, వెంకటరెడ్డి, బంగారయ్య, పెద్దసంఖ్యలో కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..