వేట గురించి దొంగాట
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు.
చోరీ కేసుల్లో నిర్లక్ష్యంగా విధులు
సొత్తు అప్పగింతకు బేరసారాలు
చీమకుర్తి సీఐపై సస్పెన్షన్ వేటు
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. విధుల్లో చేరిన కొన్నిరోజుల్లోనే ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక దొంగతనం కేసులో నిందితుడ్ని పదేపదే విడిచిపెట్టడంతో పాటు, భారీగా ముడుపులు దండుకున్నారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. దొంగలను వేటాడి జనం సొత్తుకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారి ఆ ఊసు మరిచారు. తీరా చోరీ సొత్తు దొరికినా బాధితులకు అప్పగించేందుకు బేరాలకు దిగారు. అటు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంతో పాటు పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టాయి. నిందితుల వేట మరి దొంగాట నిజమేనని తెలుసుకున్న అధికారులు చివరికి సదరు సీఐపై వేటు వేశారు.
- న్యూస్టుడే, ఒంగోలు నేరవిభాగం
సార్వత్రిక ఎన్నికలకు ముందు చీమకుర్తి పట్టణంలోని ఒక ఇంటిలో భారీ చోరీ చోటుచేసుకుంది. సుమారు 80 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ ఘటనపై ఇద్దరు పాత నేరగాళ్లను పోలీసులు అనుమానించారు. వారిని స్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. తాము నేరం చేయలేదని చెప్పడంతో విడిచి పెట్టారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సేకరించిన ఆధారాల్లో పాత నేరస్థుల వేలిముద్రలు లభించాయి. నిందితులను విడిచి పెట్టిన రోజు సాయంత్రానికి ఆ నివేదిక వచ్చింది. అప్పటికే నిందితులను వదిలేసిన పోలీసులు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమకుర్తి పోలీసులు చెప్పిన సంజాయిషీని అంగీకరించలేదు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులు నానాకష్టాలు పడి నిందితుల్ని పట్టుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా వెంటనే బెయిల్ మంజూరైంది. ఈ కేసులో 80 సవర్ల బంగారం అపహరణకు గురైతే సీఐ దుర్గాప్రసాద్ బాధితులపై ఒత్తిడి తెచ్చి 40 సవర్లుగా కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద నుంచి మాత్రం మొత్తం బంగారం రికవరీ చేశారు. బాధితులకు తిరిగి అప్పగించేందుకు సీఐ దుర్గాప్రసాద్ బేరాలకు దిగారు. రూ.మూడు లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.రెండు లక్షలు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి.
కారిచ్చి బయటికి పంపేశారు...
బంగారం చోరీ కేసులో అరెస్టై బెయిల్పై బయటికి వచ్చిన నిందితుడు ఈ నెల 3న చీమకుర్తిలోని ఒక ఇంటిలో మళ్లీ చోరీకి యత్నించాడు. స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి డయల్-122కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వేణుగోపాల్రెడ్డి అనే పాత నిందితుడిని, అతని కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. తర్వాత రోజు ఓట్ల లెక్కింపు ఉండటంతో అతన్ని స్టేషన్లో ఉంచకుండా కారు అప్పగించి పంపేశారు.
స్టేషన్ నుంచి వెళ్లి.. అద్దంకిలో తెగబడి...
చీమకుర్తి స్టేషన్ నుంచి నిందితుడు బాపట్ల జిల్లా అద్దంకి వెళ్లాడు. అక్కడ ఏకంగా అయిదు ఇళ్లలో చోరీకి పాల్పడ్డాడు. అందులో ఒక న్యాయమూర్తి నివాసం కూడా ఉంది. అనంతరం తిరిగి చీమకుర్తి వచ్చాడు. ఆ క్రమంలో స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో అతని కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడే వదిలేసి చోరీ సొత్తుతో పరారయ్యాడు. పోలీసులు సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. చోరీ కేసుల దర్యాప్తు చేపట్టిన బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కారు చీమకుర్తి వెళ్లినట్లు గుర్తించి నేరుగా ఇక్కడికి వచ్చారు. అప్పటికే కారు స్టేషన్లో ఉండడంతో అవాక్కయ్యారు. స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించగా అందులో చోరీలకు వినియోగించే పరికరాలున్నట్లు గుర్తించారు. అద్దంకి పోలీసులు ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్కు తెలిపారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ సునీల్కు సమాచారం అందింది. ఈ విషయంతో పాటు సీఐ దుర్గాప్రసాద్పై వచ్చిన పలు అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ విచారణ చేయించారు. సీఐ పదేపదే విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు వెల్లడైంది. దీంతో విచారణ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. దీని ఆధారంగా సీఐ దుర్గాప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ఐజీ త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు
-
లద్దాఖ్ మృతుల్లో ఏపీకి చెందిన మరో ఇద్దరు సైనికులు
-
ఈ ఊరు.. వైద్యుల పుట్టినిల్లు..!