ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు.
బదిలీకి ముందు ఎస్సై వసూళ్ల పర్వం
డబ్బుల కోసం వ్యాపార సంఘాలకు హుకుం
యర్రగొండపాలెం, న్యూస్టుడే: ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. ఎన్నికల వేళ ఖర్చులయ్యాయనే పేరుతో వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున దండుకునేందుకు తహతహలాడుతున్నారు. ఈ పరిణామం వై.పాలెం నియోజకవర్గంలోని ఓ కీలక మండలంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘ఎన్నికల సమయంలో నిర్వహణ ఖర్చులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు. నా సొంత జేబు నుంచి ఖర్చు చేశాను. అందుకే మీరందరూ నాకు సహకరించి ఒక్కో సంఘం తరఫున రూ.20 వేలైనా ఇవ్వాలి’ అంటూ సదరు ఎస్సై హుకుం జారీ చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నడూ లేని ఈ పరిణామంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు తర్జనభర్జన పడుతున్నారు.
- రూ.15 వేలకు తగ్గనీయొద్దు...: వివిధ వ్యాపారాలు చేసే పలువురు సంఘాలను ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రధాన పట్టణంలో ఇలాంటివి దాదాపు పదిహేను వరకు ఉన్నాయి. నియోజకవర్గంలో పనిచేసే ఓ ఎస్సై ఆయా సంఘాల అధ్యక్షులను వారం రోజుల క్రితం స్టేషన్కు పిలిపించుకున్నారు. ఎన్నికల వేళ అధికారులు, సిబ్బంది భోజనాలు, వాహనాల పెట్రోల్కు ఖర్చులయ్యాయని.. ప్రతి సంఘం నుంచి రూ. 15 వేలకు తగ్గకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే క్లాత్ మర్చంట్ అసోసియేషన్ నుంచి రూ.15 వేలు, కిరాణా మర్చంట్ రూ.15 వేలు, గోల్డ్ మర్చంట్ రూ.25 వేలు, రెడీమేడ్ మర్చంట్ రూ.15 వేలు, బియ్యం వ్యాపారుల తరఫున రూ.20 వేలు చొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం.
- ఆఖర్లో అందినకాడికి దండుకోవాలని...: పోలీసు అధికారుల బదిలీలు వచ్చే నెలలో ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆఖర్లో అయినా అందిన కాడికి దండుకోవాలని సదరు ఎస్సై తాపత్రయపడుతున్నారు. ఇందులో భాగంగా తనిఖీల పేరుతో రోడ్డు పక్కన తోపుడు బండ్లు, చిరు వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారమంతా సదరు స్టేషన్లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ద్వారా నడిపిస్తున్నారు. మొత్తానికి ఆ యువ వేధింపుల పర్వంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇవ్వకుంటే ఏమవుతుందోననే భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై లోకేశ్ ఘాటు స్పందన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM