logo

30న రామోజీరావుకు ‘స్వర నివాళి’

‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్‌ కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు.

Published : 29 Jun 2024 03:43 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్‌ కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. ఎందరో కళాకారులను తయారు చేసిన రామోజీని స్మరించుకుంటూ ఒంగోలు సీవీఎన్‌ క్లబ్‌ ఆవరణలో ఈ నెల 30వ తేదీ సాయంత్రం ‘స్వరనివాళి’, ‘పాడుతా తీయగా’ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కళాకారులు, కళాభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని