నమ్మినోళ్లే నట్టేట ముంచారు
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
యాప్పై అవగాహన సదస్సులు
పరిచయాల మాటున పెట్టుబడులు
మై క్వీన్ యాప్ ప్రొఫైల్
అర్థవీడు, మార్కాపురం- న్యూస్టుడే: పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నగదు పెట్టి ఎలా నష్టపోయిందీ కథలుగా ఇతరులకు చెప్పి లబోదిబోమంటున్నారు. అదే సమయంలో వారి కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టించి లాభాలు గడించిన పెద్దలు దర్జా ఒలకబోస్తున్నారు. అవగాహన సదస్సులంటూ పలువురిని నమ్మించి నట్టేట ముంచి తప్పుకొని తిరుగుతున్నారు. ఇరవై రోజుల క్రితం మార్కాపురం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్ మై క్వీన్ యాప్పై ఏకంగా ప్రెస్క్లబ్లోనే అవగాహన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో పరిచయమున్న ఓ స్నేహితుడి ద్వారా మై క్వీన్ ఆన్లైన్ యాప్ మనకు అందుబాటులోకి వచ్చిందంటూ ఊదరగొట్టారు. తనను నమ్మి పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహించారు. అనతికాలంలోనే లాభాలు పొందుతారంటూ ఊరించారు. ప్రతి రూపాయికి రూ.7 అదనంగా సంపాదించుకోవచ్చంటూ ప్రచారం చేశారు. ఎప్పటికప్పుడు ఆకర్శణీయమైన నగదు ప్రకటనలు కూడా అదనంగా వస్తాయంటూ బ్రోచర్లతో అవగాహన కల్పించారు. ఏజెంట్గా చేరి మరికొందరిని చేర్పించడం ద్వారా ఇంకా అదనంగా సంపాదించుకోవచ్చని ఆశలు రేపారు. సమావేశంలోనే కొందరి చరవాణి నంబర్లు తీసుకుని మై క్వీన్ పేరుతో అప్పటికప్పుడే వాట్సాప్ గ్రూపు రూపొందించారు. అందులో పలువురిని చేర్చి మరిన్ని వివరాలు అందించారు. కంభానికి చెందిన ఇద్దరు, యర్రగొండపాలేనికి చెందిన ఓ వ్యక్తిని ఏజెంట్లుగా నియమించారు. వీరు తొలుత తెలిసిన వాళ్లను సంప్రదించారు. ఆపై వారితో ఇతరులకు వల వేశారు. ఇలా వేల మందిని మై క్వీన్ ఖాతాదారులుగా చేర్పించారు. వీరిలో ఎక్కువమంది కంభం, అర్థవీడు, తర్లుపాడు, యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. తీరా ఇప్పుడు నగదు చెల్లింపులు నిలిచిపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సదరు ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం రూ.కోటి వరకు దండుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా