వైకాపా తానా.. ఖాకీ తందానా
ధికారాన్ని అడ్డుపెట్టుకొని గత అయిదేళ్లలో కొండపి నియోజకవర్గాన్ని వైకాపా నేతలు ఆగమాగం చేశారు.
అరాచకంతో అంటకాగిన పోలీసులు
నాటి ప్రతిపక్షానికి అడుగడుగునా ఆంక్షలు
ఎన్టీఆర్, దామచర్ల విగ్రహాల తొలగింపు
టంగుటూరు, న్యూస్టుడే
అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత అయిదేళ్లలో కొండపి నియోజకవర్గాన్ని వైకాపా నేతలు ఆగమాగం చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారనే కారణంతో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడ్డారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విధ్వంసం సృష్టించి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన కొందరు పోలీసులు.. అధికార పార్టీ నేతలతో అంటకాగారు. వారు తానా అంటే తాము తందానా అంటూ అడ్డగోలుగా వ్యవహరించారు. నాటి ప్రతిపక్ష నేతలను కట్టడి చేయడమే లక్ష్యంగా అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నాటి సీఐ రంగనాథ్, టంగుటూరు ఎస్సై ఖాదర్బాషాల ధోరణి మరింత అభ్యంతకరంగా ఉంది. ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పట్ల వారు వ్యవహరించిన తీరును చూసి జిల్లా వాసులే ముక్కున వేలేసుకున్నారు. వైకాపా నాటి కొండపి సమన్వయకర్తగా పని చేసిన వరికూటి అశోక్బాబు తూర్పు నాయుడుపాలెంలోని స్వామి ఇంటి ముట్టడికి చెంబుయాత్ర చేపట్టారు. ప్రతిగా స్వామి తన అనుచరులతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు వర్గాలను అడ్డుకోవాల్సిన పోలీసులు అందుకు భిన్నంగా వైకాపా కొమ్ము కాశారు. జాతీయ రహదారిపై తెదేపా నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సమయంలో ఏకంగా స్వామి చొక్కా చిరిగిపోయింది. అయినప్పటికీ నిరసన తెలుపుతున్న స్వామిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో డీజే సౌండ్స్తో కార్యకర్తలతో రోడ్డెక్కిన వైకాపా నేత వరికూటిని మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు. ఈ వ్యవహారంలో తెదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా.. వైకాపా వర్గీయులపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు.
చిరిగిన చొక్కాతో నిరసన తెలుపుతున్న నాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి స్వామి (పాత చిత్రం)
సంగమేశ్వరంలో రణరంగం సృష్టించి...: కార్తిక మాసం సందర్భంగా పొన్నలూరు మండలం చెన్నిపాడు వద్దనున్న సంగమేశ్వరం ఆలయ సమీపంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వన భోజన కార్యక్రమాన్ని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వైకాపా నాటి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ప్రకటించారు. ఇక్కడా పోలీసులు వైకాపా పట్ల వీర విధేయతను ప్రదర్శించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలను సంగమేశ్వరం ఆలయం వద్దకు వెళ్లకుండా అడుగడుగునా ఆంక్షలు విధించారు. తెదేపా నేతలు ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక అలంకరణకు ఉపయోగించిన పసుపు వస్త్రాలు, ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలను తొలగించారు. ఈ అరాచకంలో అప్పటి కొండపి సీఐ మాతంగి శ్రీనివాస్, సిబ్బంది అత్యుత్సాహం చూపారు. పవిత్ర ఆలయ పరిసరాలను రణరంగంగా మార్చారు.
కీలక కార్యకర్తపై రౌడీషీట్...: టంగుటూరు మండలం పొందూరు గ్రామం తెదేపాకు కంచుకోట. ఆ గ్రామానికి చెందిన పమిడి నాగేశ్వరరావు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తారు. ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాల్లో వైకాపా ఏజెంట్ల ఆటలు సాగవని, ఎన్నికల వేళ గ్రామంలో లేకుండా చేసేందుకు అతనిపై ఏకంగా రౌడీషీట్ తెరిపించారు వైకాపా నేతలు. ఈ విషయంలో వారు చెప్పినట్లు తలాడించారు అప్పటి సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై ఖాదర్బాషా. ఇవే కాదు.. టంగుటూరు మండలంలో తెదేపా గెలుపొందిన ఏకైక పంచాయతీ కాకుటూరివారిపాలెంలో అభివృద్ధి పనులను అడుగడుగునా నాటి అధికార పార్టీ అడ్డుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపడిన చైనా రాకెట్..!
-
శ్రీలంక టూర్కు కొత్త హెడ్ కోచ్.. మా నెక్ట్స్ టార్గెట్ ఆ రెండు టైటిల్స్: జై షా
-
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. టీ20 వరల్డ్ కప్ విజయంపై టీమ్ఇండియాకు అభినందనలు
-
తవ్వేకొద్దీ అప్పులు.. జీతం తీసుకోవడం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
‘నేనున్నాను’ హిట్ కావడానికి అదే కారణం: నాగార్జున
-
పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు: జేపీ నడ్డా