అభివృద్ధిలో పరుగులు తీయిద్దాం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు.
వెలిగొండ పూర్తి.. మహిళా సాధికారతకు కృషి
బాధ్యతల స్వీకరణ సందర్భంగా కలెక్టర్ వెల్లడి
బాధ్యతలు స్వీకరిస్తుస్తున్న అన్సారియా.. చిత్రంలో ఆమె భర్త,
శ్రీకాకుళం కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, కుటుంబ సభ్యులు, జేసీ
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించి, ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో పరుగులు తీయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్గా అన్సారియా ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ‘మీ కోసం’ అర్జీలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్ట్ను వేగవంతంగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. జిల్లాలోని తాగునీటి, ఇతర సమస్యల గురించి క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా అవగాహన పెంచుకుని పరిష్కరించనున్నట్లు వివరించారు. మిగతావి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ఫోన్, వాట్సాప్ సందేశం, మెయిల్ ద్వారానైనా సమాచారం అందించొచ్చని సూచించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా బాధ్యతల స్వీకరణ సమయంలో ఆమె భర్త, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్, కుటుంబ సభ్యులు ఉన్నారు.
కలెక్టర్ తమీమ్ అన్సారియాకు మొక్క అందజేస్తున్న ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్
జిల్లా అధికారుల అభినందనలు...
నూతన కలెక్టర్ తమీమ్ అన్సారియాను ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్మీనా, ఒంగోలు, కనిగిరి ఆర్డీవోలు జీవీ.సుబ్బారెడ్డి, జాన్ ఇర్విన్తో పాటు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్లోని పలు విభాగాల పర్యవేక్షకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయండి..! గాజావాసులకు ఇజ్రాయెల్ మరోసారి ఆదేశం
-
ఏపీ మాజీ సీఎం జగన్ నివాసం వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే
-
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం