ఎట్టకేలకు చిక్కిన చిరుత
వనాన్ని వీడి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామ సమీపంలోకి వచ్చిన చిరుత.. అక్కడి పాత పేపరు మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలోని ఓ గుంతలో పడింది.
అటవీ శాఖ అధికారులు బంధించిన చిరుత పులి
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే: వనాన్ని వీడి గిద్దలూరు మండలం గడికోట పంచాయతీ దేవనగరం గ్రామ సమీపంలోకి వచ్చిన చిరుత.. అక్కడి పాత పేపరు మిల్లుకు చెందిన ఖాళీ స్థలంలోని ఓ గుంతలో పడింది. ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం తెలుసుకున్న గిద్దలూరు అటవీ శాఖ అధికారులు.. సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. తొలుత గుంతలో నిచ్చెన ఏర్పాటు చేయగా.. ఎక్కినట్టే ఎక్కి కింద పడిపోయిన చిరుత అక్కడే ఉండి పోయింది. గురువారం ఉదయం గిద్దలూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహరావు, సబ్ డీఎఫ్వో శ్రీకాంత్రెడ్డి, గిద్దలూరు రేంజర్ కుమార రాజా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతకు ఎరగా బోనులో మేకపిల్లను ఏర్పాటు చేసి ఉంచారు. మధ్యాహ్న సమయంలో గుంత నుంచి బయటకు వచ్చి అటూ తిరిగిన చిరుత.. తిరిగి లోపలికే వెళ్లింది. అనంతరం దేవనగరం చేరుకున్న శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ బీఎన్ఎన్.మూర్తి అక్కడికి వచ్చారు. బోనును గుంతకు అతి సమీపంలో ఉంచేలా ఏర్పాట్లు చేయించారు. ఎట్టకేలకు గురువారం రాత్రి చిరుత పులి గుంత నుంచి బయటికొచ్చి బోనులో చిక్కుకుంది. అనంతరం ప్రత్యేక వాహనంలో గిద్దలూరు అటవీ శాఖË డివిజన్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
తాజా వార్తలు (Latest News)
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి