కీచక డీఎల్పీవోపై వేటు
ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేసిన మార్కాపురం డీఎల్పీవో జి.నాగేశ్వరరావును అధికారులు సస్పెండ్ చేశారు.
లైంగిక వేధింపులకు పాల్పడుతుండటాన్ని తెలుపుతూ ప్రచురితమైన కథనం
ఒంగోలు గ్రామీణం, మార్కాపురం, న్యూస్టుడే: ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురిచేసిన మార్కాపురం డీఎల్పీవో జి.నాగేశ్వరరావును అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కె.కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురంలోని డివిజనల్ పంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో నాగేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన కార్యాలయంలో పనిచేసే కొందరు మహిళా ఉద్యోగినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ‘చెప్పిన పని చేయకుంటే నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా.. నాకు సహకరించకుంటే డిప్యూటేషన్ రద్దు చేయిస్తా.. మార్కాపురంలోని నాస్నేహితుడి లాడ్జికి వస్తావా... పక్కనే ఉన్న పొదిలిలోని లాడ్జికి వస్తావా! కుదరకుంటే కంభంలోని లాడ్జికైనా సరే. నీ ఇష్టం ఎక్కడైనా నిర్ణయించుకో’ అని సదరు అధికారి ఓ మహిళ పట్ల తరచూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. వేధింపుల కారణంగా అదే కార్యాలయానికి చెందిన సీనియర్ సహాయకుడు శ్రీనివాసరావు అప్పటికే సస్పెండ్ అయ్యారు. ఈ విషయాలన్నింటినీ తెలుపుతూ ‘లాడ్జికొస్తావా! రద్దు చేయించమంటావా!!’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. దీంతో పూర్వ కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి మహిళా అధికారుల బృందంతో విచారణకు ఆదేశించారు. వారు అన్ని వివరాలు సేకరించి కలెక్టరేట్కు నివేదిక అందించారు. ఈ మేరకు సదరు డీఎల్పీవో నాగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు దినేష్ కుమార్ సిఫార్సు చేశారు. ఈ మేరకు డీఎల్పీవోను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో ఇన్ఛార్జి డీఎల్పీవోను నియమించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..