శ్రీకారం చుట్టుకోనుంది పీఎంశ్రీ
పల్లె, పట్టణమనే తేడా లేకుండా విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం కేంద్ర ప్రభుత్యం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) యోజనకు శ్రీకారం చుట్టింది.
న్యూస్టుడే, పామూరు
సి.ఎస్.పురంలోని జడ్పీ ఉన్నత పాఠశాల
పల్లె, పట్టణమనే తేడా లేకుండా విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు నైపుణ్యాన్ని పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం కేంద్ర ప్రభుత్యం ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) యోజనకు శ్రీకారం చుట్టింది. ప్రతిభ, ప్రమాణాలు గల 48 పాఠశాలలను ఈ పథకం అమలుకు జిల్లా వ్యాప్తంగా ఎంపికయ్యాయి. తొలి దశలో పనులు సాగుతున్నాయి. సమగ్రశిక్షా ఇంజినీరింగ్ విభాగం వీటిని పర్యవేక్షిస్తోంది. పనులన్నీ పూర్తయితే ప్రయోగశాలలు, స్మార్ట్ తరగతులు, గ్రంథాలయాలు, క్రీడా పరికరాలు సమకూరి మిగతా పాఠశాలలకు ఇవి ఆదర్శంగా నిలవనున్నాయి.
- జాతీయ స్థాయికి నివేదికలు...: తొలిదశలో 41, రెండో దశలో 7 ఉన్నత పాఠశాలలను పీఎంశ్రీ పథకంలో భాగంగా జిల్లాలో ఎంపిక చేశారు. బేస్తవారపేట, సి.ఎస్.పురం, దిరిశవంచ, గిద్దలూరు, కలుజువ్వలపాడు, మహమ్మదాపురం, ముండ్లపాడు, ఓబులక్కపల్లి, వెలిగండ్ల తదితర పాఠశాలలు తొలిదశలో ఎంపికైన వాటిలో ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మేరకు ప్రమాణాల ఆధారంగా జిల్లా స్థాయిలో పరిశీలించి రాఫ్ట్ర స్థాయికి అధికారులు నివేదించారు. అక్కడ కొన్నింటిని నిర్ణయించి జాతీయ స్థాయికి పంపించారు.
- అటు మైదానాలు.. ఇటు ప్రయోగశాలలు...: తొలిదశలో ఎంపికైన 41 పాఠశాలల్లో వివిధ రకాల సౌకర్యాలు సమకూరనున్నాయి. అందులో అన్ని వసతులున్న 15 చోట్ల రసాయన శాస్త్ర ప్రయోగశాలలు ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఏపీఈఆర్ఎస్ గణపవరం, ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ కంభం, కురిచేడు, సింగరాయకొండ, అర్థవీడు, దిరిశవంచ, కలుజువ్వలపాడు, ముండ్లపాడు, పీసీపల్లి, రాయవరం, ఉప్పలపాడు, ఇప్పగుంట, కాకర్ల, కామేపల్లి, మర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఒక్కో ప్రయోగశాలకు రూ.15 లక్షల నిధులు కేటాయించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ.2 లక్షల నిధులు విడుదలై పాఠశాలల ఖాతాల్లో జమయ్యాయి. వీటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రయోగశాల భవనాలతో పాటు క్రీడా మైదానాల అభివృద్ధి, క్రీడా సామగ్రిని 41 పాఠశాలలకు అందించనున్నారు. ఇందుకుగాను ఒక్కో పాఠశాలకు రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదలవుతాయి. ప్రస్తుతం రూ.లక్ష చొప్పున మంజూరయ్యాయి. క్రీడా మైదానాలను తీర్చిదిద్ది క్రీడా సామగ్రి అందిస్తారు. ల్యాబ్ల నిర్మాణం పూర్తికాగానే రసాయన, భౌతిక, జీవ శాస్త్రాలకు అవసరమైన ప్రయోగ పరికరాలు సమకూరుస్తారు.
పనులు చురుగ్గా సాగుతున్నాయి...
జిల్లాలో తొలి విడతలో పీఎంశ్రీకి ఎంపికైన 41 పాఠశాలల్లో ప్రస్తుతం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇవి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రయోగశాల భవన నిర్మాణాలు, క్రీడా మైదానాల అభివృద్ధి పనులు ప్రారంభించి చేస్తున్నారు. ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు త్వరలో రానున్నాయి.
ఎం.రమేష్, ఏఎంవో, సమగ్ర శిక్షా, ఒంగోలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
తాజా వార్తలు (Latest News)
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే
-
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్