స్వామి.. చదువుల సంతకం
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సైన్సు విద్యార్థుల కలను వమ్ము చేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 80, సైన్సు విభాగానికి 80 సీట్లు కేటాయించింది.
గురుకుల పాఠశాలలో సీట్ల పునరుద్ధరణ
హామీ నిలబెట్టుకున్న మంత్రి
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సైన్సు విద్యార్థుల కలను వమ్ము చేసింది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ సీఈసీ విభాగంలో 80, సైన్సు విభాగానికి 80 సీట్లు కేటాయించింది. అనంతరం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం సోషల్ విభాగం సీట్లు మాత్రమే భర్తీ చేస్తూ సైన్సు విభాగంలో ఖాళీలను రద్దు చేయడంతో విద్యార్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. తమ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గతంలలో ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామిని కలిసి సమస్యను విన్నవించారు. తాము అధికారంలోకి రాగానే సైన్సు విభాగం సీట్లు పునరుద్ధరిస్తామని ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. తాజాగా ఆయన వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ మేరకు సింగరాయకొండ గురుకుల పాఠశాలలో 2024/25 విద్యా సంవత్సరానికిగానూ సైన్స్ విభాగంలో 80 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
సైన్సు విభాగం సీట్లు పునరిద్ధరిస్తూ సంతకం చేస్తున్న మంత్రి బాలవీరాంజనేయ స్వామి
ఆదేశాలొచ్చాయి..
సీట్ల భర్తీపై గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవిని వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని, ఇప్పటికే సుమారు 200 మంది విద్యార్థినులు దరఖాస్తులు అందించారన్నారు. త్వరలో అర్హత ఆధారంగా ముఖాముఖి నిర్వహించి సీట్ల భర్తీకి చర్యలు చేపడతామని తెలిపారు. దీంతో ఆయా ప్రాంతాల విద్యార్థుల తలిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం
[ 01-07-2024]
అవ్వాతాతలతో పాటు... పింఛను లబ్ధిదారులందరి కలా నేడు ఫలించనుంది. ‘సూపర్ సిక్స్’లో ఇచ్చిన హామీ మేరకు... పెంచిన మొత్తాన్ని గత మూడు నెలలకూ వర్తింప చేసి, ఇంటి వద్దే రూ.ఏడు వేలు అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. -
ప్రభుత్వ బడికి ఉరి
[ 01-07-2024]
గత వైకాపా సర్కారు... అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ బడులకు పాడె కట్టింది. ఉన్న వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరగాల్సింది పోయి... -
తెదేపా ఖాతాలోకి గిద్దలూరు నగర పంచాయతీ!
[ 01-07-2024]
గిద్దలూరు నగర పంచాయతీ ఛైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, మరో అయిదుగురు కౌన్సిలర్లు... ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి సమక్షంలో ఆదివారం తెదేపాలో చేరారు. -
అక్షర యోధుడికి స్వరాంజలి
[ 01-07-2024]
చివరి క్షణం వరకు సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఏపీ మహిళాభ్యుదయ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు టి.అరుణ కొనియాడారు. -
రెండొందల బస్తాల బియ్యం పట్టివేత
[ 01-07-2024]
పామూరులోని ఆర్టీసీ బస్స్టేషన్కు సమీపంలోని ప్రైవేటు గోదాము సముదాయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. -
పంచదార తూకాల్లో అక్రమాలకు చెల్లు
[ 01-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో కార్డుదారులకు పంపిణీ చేసిన రేషన్ సరకుల తూకాల్లో అక్రమాలపై పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టాక పలుచోట్ల గిడ్డంగుల్లోని సరకుల తూకాలు, -
ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన
[ 01-07-2024]
తెదేపా నేతలు గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. -
మృత్యుకుంట మింగేసింది
[ 01-07-2024]
అమ్మమ్మ ఇంటివద్ద సరదాగా గడుపుదామని వచ్చిన ఆ పాలబుగ్గల్ని మృత్యుకుంట మింగేసింది. ప్రసన్నాంజనేయుడికి పొంగళ్లు సమర్పించకుండానే వారి కథ విషాదాంతమైంది. -
రామాపురంలో రైతు హత్య
[ 01-07-2024]
గుర్తుతెలియని వ్యక్తులు ఓ రైతును దారుణంగా హత్య చేసిన సంఘటన రాచర్ల మండలం రామాపురంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై బాలసుబ్రహ్మణ్యం కథనం మేరకు..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్కు అదనపు బాధ్యతలు
-
అందుకే ‘భారతీయుడు 2’ తీశా.. పార్ట్ 3 రిలీజ్ అప్పుడే: శంకర్
-
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే
-
స్పీకర్పై రాహుల్ ఆరోపణలు.. మండిపడ్డ అధికార పక్షం
-
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ
-
ఎన్ని విభేదాలున్నా.. దేశమంతా ఒక్కటే: మోహన్ భాగవత్