‘చెవి’కి భూములు.. జనానికి పువ్వులు
నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు.
అప్పట్లో అక్రమాలకు అండగా నిలిచిన యంత్రాంగం
ఆనక తప్పుకొనేందుకు పారదర్శకత జపం
ఆర్టీసీ స్థలం లీజులో అడ్డగోలు వ్యవహారం
న్యూస్టుడే, ఒంగోలు
నాటి అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు సాగిల పడ్డారు. ఒంగోలు డిపో పరిధిలో విలువైన స్థలాన్ని వైకాపా నేత చెవిరెడ్డి పుత్రరత్నం మోహిత్రెడ్డి కంపెనీకి కట్టబెట్టేశారు. ఈ విషయం బయటకు రాగానే తప్పులను కప్పిపుచ్చుకునే యత్నంలో నిమగ్నమయ్యారు. టెండర్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగానే సాగిందంటూ జనం చెవిలో పువ్వులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వారిచ్చిన వివరణలోనే టెండర్ల ప్రక్రియలోని డొల్లతనాన్ని బహిర్గతం చేశారు.
అప్పట్లో అప్పనంగా కట్టబెట్టి...: ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలోని 1,978 చదరపు గదుల స్థలాన్ని సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నెలకు రూ.2.31 లక్షల అద్దె ప్రాతిపదికన పదిహేనేళ్లకు లీజుకు ఇచ్చారు. దీన్ని తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు మోహిత్రెడ్డి నిర్వహిస్తున్నారు. గత ఆధికార పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆర్టీసీ అధికారులు ఆయనకు అనుకూలంగా అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒంగోలు డిపో పరిధిలో మాత్రమే కాదు, రాష్ట్రంలోని పలు ఆర్టీసీ డిపోల్లోని స్థలాలను మోహిత్రెడ్డి ఆధ్వర్యంలోని సీఎంఆర్ ఇన్ఫ్రా అత్యంత స్వల్ప ధరకు దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. ఒంగోలులో ఈ తతంగాన్ని జనసేన నేత షేక్ రియాజ్ బయటపెట్టారు. అధికార తెదేపా వీటిపై దృష్టి సారించింది. దీంతో ఆర్టీసీ అధికారుల్లో అలజడి మొదలైంది. తాము టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే నిర్వహించామంటూ చెప్పుకొస్తున్నారు.
ఆ టెండర్ల రద్దు అనుచిత లబ్ధికేనా..!: ‘ఆర్టీసీ స్థలంలో పుష్ప పాగా’ శీర్షికన ఈ నెల 24న ‘ఈనాడు’ కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఆర్టీసీ ఈడీ, జోన్-3 కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ‘ఆర్టీసీ ఆదాయం పెంపుదల కోసం ఓ.ఎస్-15 స్కీమ్ కింద స్థలాలను పదిహేనేళ్లకు లీజుకు ఇస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల పరిధిలో 122 ఖాళీ స్థలాలను ఈ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. వీటిలో ఒంగోలు డిపో పరిధిలోని 1,978 చదరపు గజాల స్థలం కూడా ఉంది. ఈ స్థలానికి గతేడాది జూన్ 8న టెండర్లు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నప్పటికీ వారిద్దరూ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోలేదు. దీంతో వారు చెల్లించిన ఎర్లీ మనీ డిపాజిట్(ఈఎండీ) జప్తు చేసి సదరు టెండర్లు రద్దు చేశాం’ ఇదీ ఆర్టీసీ అధికారులు ఇచ్చిన వివరణ. ఇదిలా ఉంటే ఆ టెండర్లు వేసిన వ్యక్తుల పేర్లు, వివరాలు పేర్కొనకపోవడం గమనార్హం. ముందు నుంచీ ఆర్టీసీకి సంబంధించిన విలువైన స్థలాలపై కన్నేసిన చెవిరెడ్డి వారిపై ఒత్తిడి తెచ్చి ఒప్పందం కుదుర్చుకోకుండా అడ్డుకున్నారనే అభియోగాలున్నాయి.
రూ. లక్షలు అప్పనంగా వదిలేశారట... : గతేడాది జూన్లో టెండర్లు పిలవడం., పోటీదారులు ఒప్పందం చేసుకోకపోవటం వెనుక పెద్ద కథే నడిపినట్లు తెలుస్తోంది. ఇదే స్థలానికి మరోసారి గతేడాది నవంబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 22న టెండర్లు తెరిచారు. హెచ్1 బిడ్డర్గా ఉన్న ఎం.వి.ఎన్.వాసవి అనే మహిళ ఈ ఏడాది జనవరి 11న బిడ్డింగ్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులకు లేఖ రాశారని ఈడీ కార్యాలయం నుంచి వెలువరించిన వివరణలో పేర్కొన్నారు. ఆమె చెల్లించిన ఈఎండీ 5.40 లక్షలను ఆర్టీసీ జప్తు చేసింది. అనంతరం హెచ్2 బిడ్డర్ అయిన సీఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్తో 27వ తేదీన చర్చలు సాగించి నెలకు రూ.2.31 లక్షలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ కంపెనీ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తనయుడు మోహిత్రెడ్డికి సంబంధించినది. ఇక్కడే అనేక అనుమానాలకు తావిస్తోంది. జూన్లో వేసిన టెండర్లలో ఇద్దరు, నవంబర్కి సంబంధించిన వాటిలో ఒకరు ఒప్పందం చేసుకోవడానికి నిరాకరించారు. లక్షల రూపాయల ఈఎండీని ఆర్టీసీకి అప్పనంగా సమర్పించేశారు. దీంతో ఆర్టీసీ అధికారులు సదరు భూమిని చెవిరెడ్డి కుటుంబానికి సంతర్పణ చేశారట.
ఎవరి మెప్పు కోసమో తాపత్రయం...: ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను ఓ.ఎస్-15 స్కీము ద్వారా లీజుకు ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో 122 స్థలాలు లీజుకు ఇచ్చారు. వీటిలో ఒంగోలు సహా పలు ఆర్టీసీ డిపోల్లోని స్థలాలను చెవిరెడ్డి కుటుంబానికి చెందిన సీఎంఆర్ ఆన్ఫ్రా గ్రూపు దక్కించుకుంది. చెవిరెడ్డి అప్పటి వైకాపా ప్రభుత్వంలో అత్యంత కీలక నేత కావడంతో ఆర్టీసీ అధికారులు ఆయన ఆడమన్నట్లు ఆడారనేది సుస్పష్టంగా తెలుస్తూనే ఉంది. పోటీదారులను బెదిరించి పోటీ నుంచి తప్పించి తమకు నచ్చిన ధరలకు అద్దెలు నిర్ణయించుకుని ఆర్టీసీ స్థలాలను స్వాహా చేసినట్లు అర్ధమవుతోంది. తెర వెనుక సాగిన మంత్రాంగం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా.. ఆదాయం కోసం తాము పారదర్శకంగా వ్యవహరించినట్లు ఆర్టీసీ అధికారులు కథలు అల్లేస్తున్నారు. ఇక్కడ ఎవరి ఆదాయం కోసం ఇంతగా తాపత్రయ పడుతున్నారనేది సుస్పష్టం. జనం చెవిలో పువ్వులు ఇలా ఇంకెన్నాళ్లు పెడతారో ఆర్టీసీ అధికారులు అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..
[ 29-06-2024]
అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
[ 29-06-2024]
భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
[ 29-06-2024]
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. -
అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది -
సమస్యల పరిష్కారం అందరి బాధ్యత
[ 29-06-2024]
‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు -
సురేషూ.. నీతులు వల్లించొద్దు
[ 29-06-2024]
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. -
వేట గురించి దొంగాట
[ 29-06-2024]
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. -
ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
[ 29-06-2024]
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. -
30న రామోజీరావుకు ‘స్వర నివాళి’
[ 29-06-2024]
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. -
నమ్మినోళ్లే నట్టేట ముంచారు
[ 29-06-2024]
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?