కూలిన అహంకారం
అక్రమానికి మాజీ మంత్రి సహకారంఫిర్యాదు చేసిన వారి పైనే నాడు దౌర్జన్యంటంగుటూరు, న్యూస్టుడేఇళ్ల మధ్య అక్రమంగా నిర్మించిన పొగాకు బ్యారన్ను జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యంఅధికారం చేతిలో ఉంటే అనుమతులతో పనేముందని వైకాపా నాయకులు అహంకారం చూపారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల మధ్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాల పైనా కిమ్మనలేదు.
అక్రమానికి మాజీ మంత్రి సహకారం
ఫిర్యాదు చేసిన వారి పైనే నాడు దౌర్జన్యం
టంగుటూరు, న్యూస్టుడే
ఇళ్ల మధ్య అక్రమంగా నిర్మించిన పొగాకు బ్యారన్ను జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం
అధికారం చేతిలో ఉంటే అనుమతులతో పనేముందని వైకాపా నాయకులు అహంకారం చూపారు. అధికారులు కూడా వారికి వంత పాడారు. నిబంధనలకు విరుద్దంగా ఇళ్ల మధ్య ప్రజలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన కట్టడాల పైనా కిమ్మనలేదు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సరికదా బాధితుల పైనే తిరిగి తమ ప్రతాపం చూపారు. మాజీ మంత్రి కొమ్ము అండతో మరింత రెచ్చిపోయారు. అక్రమానికి కొమ్ము కాశారు. ఏకంగా పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి బెదిరింపులకు దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఘోర ఓటమితో పరిస్థితులు మారిపోయాయి. అక్రమ కట్టడంపై పంచాయతీ అధికారులు కొరడా ఝుళిపించారు. వైకాపా నేతల అహంకారాన్ని జేసీబీతో కూల్చి వేశారు.
ఇచ్చిన నోటీసుల చించివేత...
వైకాపా అధికారంలో ఉండగా మార్టూరి వెంకటరావు అనే వ్యక్తి టంగుటూరు మండలం కాకుటూరివారిపాలెంలో నివాసాల మధ్య ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పొగాకు బ్యారన్ల నిర్మాణం చేపట్టారు. ఆవాసాల మధ్య పొగాకు క్యూరింగ్ చేసే బ్యారన్ల నిర్మాణంపై కాలనీ వాసులు ప్రశ్నించారు. గ్రామ సర్పంచి సహకారంతో కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఈవోఆర్డీ సాంబయ్య అక్రమ కట్టడమంటూ నిర్మాణానికి నోటీసులు కూడా అంటించారు. అయినా అక్రమార్కుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని నిర్మాణాలను కొనసాగించారు. అధికారులను లెక్క చేయకుండా వారిచ్చిన నోటీసులను చించి వేసి బ్యారన్లను పూర్తి చేశారు.
సురేష్ అండతో చెలగాటం...
నివాసాల మధ్య నిర్మాణాలపై కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఇక్కడే నాటి మంత్రి ఆదిమూలపు సురేష్ రంగంలోకి దిగి అక్రమానికి అండగా నిలిచారు. దీంతో మండల, జిల్లా అధికారులు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు టంగుటూరు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆ గ్రామ సర్పంచి కుమారులు, ఈవోఆర్డీ సాంబయ్యపై అప్పటి ఎస్సై నాగేశ్వరరావు అనుచితంగా ప్రవర్తించారు. తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారు. అక్రమార్కులపై కేసు నమోదు చేయకపోగా.. సర్పంచి కుమారులపై బెదిరింపులకు దిగారు. వారి పైనే అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నించారు. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. లక్ష నగదు లంచంగా ఇవ్వాలని బేరసారాలకు దిగారు. ఈ విషయంలో ఆయన ఏకంగా ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక కాకుటూరివారిపాలెం కాలనీ వాసుల విన్నపం మేరకు గ్రామసభ నిర్వహించారు. అక్రమ బ్యారన్ల కూల్చివేతకు అందులో అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం మూడుసార్లు అక్రమార్కులకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి సదరు బ్యారన్లను పోలీసుల పహారా మధ్య జేసీబీతో మంగళవారం కూల్చివేయించారు. ఈ సమయంలోనూ గ్రామ కార్యదర్శి బాషాపై సదరు అక్రమ నిర్మాణదారుడు మార్టూరి వెంకటరావు తన అహంకారాన్ని ప్రదర్శించారు. దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. విధులకు ఆటంకం కలిగించడంపై ఆయన టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..
[ 29-06-2024]
అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
[ 29-06-2024]
భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
[ 29-06-2024]
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. -
అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది -
సమస్యల పరిష్కారం అందరి బాధ్యత
[ 29-06-2024]
‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు -
సురేషూ.. నీతులు వల్లించొద్దు
[ 29-06-2024]
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. -
వేట గురించి దొంగాట
[ 29-06-2024]
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. -
ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
[ 29-06-2024]
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. -
30న రామోజీరావుకు ‘స్వర నివాళి’
[ 29-06-2024]
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. -
నమ్మినోళ్లే నట్టేట ముంచారు
[ 29-06-2024]
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు
-
కేయూ హాస్టల్ గదిలో ఊడిపడిన ఫ్యాను.. విద్యార్థినికి తీవ్ర గాయం
-
రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!