కదులుతున్న సి‘ఫార్సుల’ డొంక
డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం కింద గత ఏడాది చేపట్టిన నియామకాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు.
ఒంగోలు నగరం, న్యూస్టుడే: డీఈవో కార్యాలయంలోని మధ్యాహ్న భోజన పథకం కింద గత ఏడాది చేపట్టిన నియామకాలపై ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి, మండల విద్యాశాఖ కార్యాలయాలు, పాఠశాలల నుంచి సమాచారం సేకరించడానికి ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను కాంట్రాక్టు పద్ధతిపై వైకాపా ప్రభుత్వ హయాంలో నియమించారు. ఈ నియామకాల్లో నిబంధనలు పాటించలేదని.. నాటి ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫార్సుల మేరకు వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి పోస్టులు కట్టబెట్టారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అటు వాలంటీర్లుగా వేతనం పొందుతూనే ఈ పోస్టుల్లో కొనసాగుతున్నట్లు అందులో పేర్కొన్నారు.వైకాపా ప్రభుత్వం వీటిపై ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఈ విషయంపై ఉన్నతాధికారులకు మరోసారి ఫిర్యాదు అందింది. దీంతో ఆర్జేడీని విచారణాధికారిగా నియమించారు. ఒంగోలు డీఈవో కార్యాలయానికి మంగళవారం వచ్చిన ఆయన సంబంధిత దస్త్రాలు పరిశీలించారు. ఆయా విభాగాల అధికారుల నుంచి సమాచారం సేకరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కేటాయించిన సైకిళ్లు పంపిణీ చేయలేదనే ఫిర్యాదులపై ఆరా తీశారు. కోర్టు వివాదం కారణంగా కొమరోలు ఎయిడెడ్ పాఠశాల యాజమాన్యం 218 సైకిళ్లు పంపిణీ చేయలేదని తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..
[ 29-06-2024]
అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
[ 29-06-2024]
భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
[ 29-06-2024]
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. -
అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది -
సమస్యల పరిష్కారం అందరి బాధ్యత
[ 29-06-2024]
‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు -
సురేషూ.. నీతులు వల్లించొద్దు
[ 29-06-2024]
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. -
వేట గురించి దొంగాట
[ 29-06-2024]
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. -
ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
[ 29-06-2024]
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. -
30న రామోజీరావుకు ‘స్వర నివాళి’
[ 29-06-2024]
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. -
నమ్మినోళ్లే నట్టేట ముంచారు
[ 29-06-2024]
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ కథలేవీ నిజం కావు.. అందుకే సంతోషంగా ఉంది: కమల్ హాసన్
-
అవును నేను వృద్ధుడినే.. కానీ: డిబేట్లో తడబాటు వేళ బైడెన్ ఏమన్నారంటే..?
-
అతడి స్థానంపై కనీసం ప్రశ్నించలేం.. అత్యంత కీలకం: గావస్కర్
-
అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు
-
జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు
-
రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే?