గ‘లీజు’ జగన్ కోట
అధికారం చేతిలో ఉంది కదా అని వైకాపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. తామేమి చేసినా చెల్లుబాటవుతుందని భావించారు.
అడ్డగోలుగా అనుమతులిచ్చేసిన ఓఎంసీ
పన్ను మినహాయింపులోనూ కక్కుర్తి
ఒంగోలు ఎన్నెస్పీ కాలనీలో ఎకరా రూ. వెయ్యికే పొంది ప్యాలెస్ను తలపించేలా నిర్మించిన వైకాపా కార్యాలయ భవనం
అధికారం చేతిలో ఉంది కదా అని వైకాపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. తామేమి చేసినా చెల్లుబాటవుతుందని భావించారు. ఆ మేరకు నిబంధనలకు నిలువునా పాతరేశారు. అప్పటి అధికారులు కూడా అదేమని అడగలేదు. ఇష్టారీతిన సాగుతున్న వ్యవహారాన్ని ప్రశ్నించిందీ లేదు. అధికారం ఆజ్ఞాపించిందని తొత్తులుగా మారి శిరసావహించారు. గ‘లీజు’ వ్యవహారానికి తమవంతు సహకారం అందించారు. సామాన్యులు ఇల్లు కట్టాలంటే ఒంగోలు నగరపాలక సంస్థ సిబ్బంది చుక్కలు చూపుతుంటారు. సవాలక్ష నిబంధనలు చూపుతూ బేరసారాలు సాగిస్తారు. చివరికి ఎవరితోనైనా సిఫార్సులు చేయిస్తేనో., అడిగిన మేరకు ముట్టజెపితోనే దస్త్రానికి నడక తెప్పిస్తారు. అదే వైకాపా జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి మాత్రం ఏ నిబంధన వర్తించదు. ఆ పార్టీ నేతల మెప్పు కోసం కార్పొరేషన్ ఖజానాకు గండి కొట్టి మరీ అనుమతులు అప్పనంగా కట్టబెటేశారు.
ఈనాడు, ఒంగోలు; ఒంగోలు నగరం, న్యూస్టుడే
తెదేపాకు తప్పు.. వైకాపాకైతే ఒప్పు...: ఒంగోలు మండలం పెల్లూరు సర్వే నంబరు 68/1 నుంచి 9 వరకు మొత్తం 12.2 ఎకరాల భూమి ఉంది. జల వనరుల శాఖ కార్యాలయాలు, ఉద్యోగుల క్వార్టర్స్ కోసం ఈ భూములు కేటాయించారు. 2016లో ఎన్నెస్పీ కాలనీలోని సర్వే నంబరు 68/8లో 1.96 ఎకరాలు ఇరిగేషన్ నుంచి రెవెన్యూకు మార్పు చేసి తెదేపా కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రద్దు చేయడంతో తెదేపా కోర్టును ఆశ్రయించింది. అనంతరం తెదేపాకు కేటాయించిన స్థలం పక్కన సర్వే నంబరు 68/9లో 1.64 సెంట్లను వైకాపా కార్యాలయం కోసం భూమి కేటాయిస్తూ 2022 మే 18న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నంబరు 340 ప్రకారం ఎకరాకు ఏడాదికి రూ.1,000తో 33 ఏళ్లకు స్థలాన్ని లీజుకు కట్టబెట్టారు. ఆ స్థలంలో నిర్మాణాలకు 2023 మార్చి 6న దరఖాస్తు చేసుకోగా.. ఒంగోలు కార్పొరేషన్ నుంచి 2023 జులై 21న అనుమతులు లభించాయి.
ఒక్క వాయిదా చెల్లింపుతోనే సరి...
అప్పనంగా దండుకున్న స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణం చేపట్టారు. ఎన్నికలకు ముందే తొంభై శాతం పనులు పూర్తి చేసి అనధికారికంగా ప్రారంభించేశారు. ఈ స్థలాన్ని మొత్తం ముప్ఫై మూడు సంవత్సరాలు లీజు ప్రాతిపదికన ఎన్నెస్పీ నుంచి తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారు. ఖాళీ స్థలంలో నిర్మాణం చేయాలంటే వేకెంట్ ల్యాండ్ టాక్స్ ప్రతి అయిదు నెలలకు ఒక వాయిదా చొప్పున గడిచిపోయిన నెలలకు ఆరు వాయిదాలు చెల్లించాలి. అధికార పార్టీ వారు కేవలం ఒక్క వాయిదా అంటే రూ.3,49,700 చెల్లించారు. నిర్మాణం తర్వాత నాలుగు వాయిదాలు బకాయిలున్నాయి. అయినా ఒక్క వాయిదాతోనే సరిపెట్టారు. కుళాయి కనెక్షన్ నిర్మాణం పూర్తయ్యాక ఇస్తారు. అలాంటిది అధికారులు అత్యుత్సాహం చూపి నిర్మాణ దశలోనే ఇక్కడ ఇచ్చేశారు. పార్టీ కార్యాలయం వాణిజ్య కేటగిరీలోకి వస్తుంది. రెసిడెన్షియల్ కేటగిరీ కింద రిజస్ట్రేషన్ చేశారు. అదే వాణిజ్య కేటగిరీలో బుక్ చేస్తే నెలకు సుమారు రూ.1,500 నీటి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గృహ అవసరం అయితే నెలకు రూ.60 చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధంగా నాటి అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి అడ్డగోలుగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..
[ 29-06-2024]
అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
[ 29-06-2024]
భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
[ 29-06-2024]
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. -
అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది -
సమస్యల పరిష్కారం అందరి బాధ్యత
[ 29-06-2024]
‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు -
సురేషూ.. నీతులు వల్లించొద్దు
[ 29-06-2024]
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. -
వేట గురించి దొంగాట
[ 29-06-2024]
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. -
ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
[ 29-06-2024]
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. -
30న రామోజీరావుకు ‘స్వర నివాళి’
[ 29-06-2024]
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. -
నమ్మినోళ్లే నట్టేట ముంచారు
[ 29-06-2024]
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.