మోముల్లో నవ్వులు
ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర పెంచింది.
పంటలకు మద్దతు ధర పెంపు
సాగు వ్యయం పెరిగిన వేళ రైతుకు వెసులుబాటు
2024-25 ఖరీఫ్లో మద్దతు ధరలు ఇలా (క్వింటాల్కు రూ.)...
ఏటికేడు పెరుగుతున్న పెట్టుబడులు రైతులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంట ఉత్పత్తులకు మద్దతు ధర పెంచింది. దీంతో కర్షకులకు కొంత ఉపశమనం లభించినట్లవుతుంది. జిల్లాలో 4.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది, పొద్దుతిరుగుడు, సజ్జ తదితర పంటలు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు.
న్యూస్టుడే, త్రిపురాంతకం గ్రామీణం
వరికి ఇక సిరి...
జిల్లాలోని సాగర్ ఆయకట్టులో 2,54,992 ఎకరాల మాగాణి ఉండగా 2022లో 35,715 ఎకరాల్లో వరి సాగైంది. గతేడాది సాగర్ జలాలు విడుదల కానందున బోరు బావుల కింద 6.832 ఎకరాల్లో మాత్రమే పండించారు. ఎకరాకు సగటున 1,900 కిలోల దిగుబడి లభిస్తుంది. తాజాగా పెరిగిన క్వింటాకు రూ.117 అదనపు ధర లభించడం వల్ల జిల్లాలో రైతులకు రూ.95 కోట్లు అదనంగా సమకూరనుంది.
మొక్కజొన్నకు మేలు..
జిల్లాలో మొక్కజొన్న 20,806 ఎకరాల్లో సాగు చేశారు. క్వింటాకు రూ.135 పెంచడంతో ఈ ఏడాది సాగైన పంటతో అన్నదాతలకు ఎకరాకు రూ.3,750 అదనంగా ప్రయోజనం చేకూరనుంది. మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తక్షణమే చెల్లింపులు చేస్తే దళారుల బెదడ తప్పి రైతులకు మేలు చేకూరుతుంది.
పత్తికి చేయూత...
జిల్లాలో ఖరీఫ్లో పత్తి 28,956 ఎకరాల్లో సాగవుతోంది. రెండేళ్ల నుంచి తెగుళ్ల దాడితో దిగుబడులు పూర్తిగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కడం లేదు. దీంతో నెమ్మదిగా పత్తి సాగుకు రైతులు దూరం అవుతున్నారు. క్వింటాకు రూ.501 పెంచడంతో పత్తి రైతుకు కొంత ఊరట లభించినట్లయింది. ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున సరాసరి దిగుబడికి గాను రూ.5 వేలకు పైగా దక్కడం ద్వారా రైతులకు ఉపశమనం దక్కుతుంది.
అపరాలకు అదనం...
ఖరీఫ్లో వరి సాగుకు ముందు వరి సాగు తర్వాత పెసర, మినుము సాగు చేస్తుంటారు. జిల్లాలో ఖరీఫ్లో 22 వేల ఎకరాల్లో పెసర సాగు చేపడుతుంటారు. ఎకరాకు సరాసరిన అయిదు క్వింటాళ్ల చొప్పున లభించే దిగుబడికి గాను క్వింటాకు అదనంగా రూ.124 పెరిగింది. దీంతో క్వింటాకు రూ.620 చొప్పున 5 క్వింటాళ్లకు రూ.3,100 అదనంగా రైతుకు సమకూరనుంది. మొత్తంగా పరిశీలిస్తే అపరాల సాగు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎక్కువ మంది రైతులు వరి సాగుకు వినియోగించుకుంటుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేదల పొట్టకొట్టి.. ఉపాధిని చెరబట్టి..
[ 29-06-2024]
అయిదేళ్లలో అన్ని రంగాలనూ పీల్చిపిప్పిచేసిన వైకాపా నాయకులు ఆఖరికి ఉపాధి పథకాన్నీ వదల్లేదు. అందులోనూ దొంగ లెక్కలు చూపి లక్షల రూపాయలు స్వాహా చేసి పేదల పొట్టకొట్టారు -
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
[ 29-06-2024]
భార్య ప్రవర్తనపై అనుమానం పెనుభూతమైంది. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త పిల్లల ఎదుటే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసిన దారుణ ఘటన మండలంలో కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్ గ్రామంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం
[ 29-06-2024]
ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీలో నూతన విద్యా సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 25వ తేదీతో దరఖాస్తులు సమర్పించే గడువు ముగిసింది. -
అయిదేళ్లు.. అభివృద్ధికి మోకాలడ్డు
[ 29-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల ప్రగతి పడకేసింది. పంచాయతీలకు నిధులు కేటాయించలేదు. సరికదా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన వాటినీ విద్యుత్తు బిల్లులకు గత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంది -
సమస్యల పరిష్కారం అందరి బాధ్యత
[ 29-06-2024]
‘ప్రజా సమస్యల పరిష్కారం అధికారులందరి బాధ్యత. అందుకుగాను ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం, నిజాయతీతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది’ అని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులకు సూచించారు -
సురేషూ.. నీతులు వల్లించొద్దు
[ 29-06-2024]
‘విదేశీ విద్య పథకానికి మీ ప్రభుత్వం అంబేడ్కర్ పేరు తొలగించినా నువ్వు మాట్లాడలేదు. -
వేట గురించి దొంగాట
[ 29-06-2024]
చీమకుర్తిని ఒంగోలు గ్రామీణ సర్కిల్ నుంచి వేరు చేసి అర్బన్ పోలీసు స్టేషన్గా ఉన్నతీకరించారు. అనంతరం తొలి సీఐ హోదాలో దుర్గాప్రసాద్ను నియమించారు. -
ఖర్చులయ్యాయి.. చందాలివ్వండి
[ 29-06-2024]
ఎన్నికల విధుల కోసం వచ్చిన ఎస్సై, సీఐలకు ఇప్పుడు బదిలీల గుబులు పట్టుకుంది. ఎలాగూ వెళ్తున్నాం కదా అని కొందరు వసూళ్ల పర్వానికి తెర లేపారు. -
30న రామోజీరావుకు ‘స్వర నివాళి’
[ 29-06-2024]
‘ఈనాడు’ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు స్వర నివాళి అర్పించనున్నట్లు క్రియేటివ్ కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు పి.శివ తెలిపారు. -
నమ్మినోళ్లే నట్టేట ముంచారు
[ 29-06-2024]
పశ్చిమ ప్రకాశంలో వారం రోజలుగా ఎవరి నోట విన్నా.. ‘మై క్వీన్’ యాప్ కథలే వినిపిస్తున్నాయి. ఈ గొలుసుకట్టు దందాలో నష్టపోయిన బాధితులు లబోదిబోమంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.