my queen: ‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
కష్టపడకుండా కాసులు కళ్లజూడొచ్చంటూ కేటుగాళ్లు విసిరిన వలతో అమాయకులు సర్వం కోల్పోయారు.
న్యూస్టుడే, మార్కాపురం, అర్థవీడు: కష్టపడకుండా కాసులు కళ్లజూడొచ్చంటూ కేటుగాళ్లు విసిరిన వలతో అమాయకులు సర్వం కోల్పోయారు. మై క్వీన్ యాప్ విష కౌగిలిలో చిక్కి కేవలం అర్థవీడు చుట్టుపక్కల వారు రూ.లక్షల్లో నష్టపోయారని అంచనా వేస్తుండగా..ఇప్పుడు మార్కాపురంలో అంతకు పదిరెట్లు దోచుకున్నారన్న విషయం బయటకు పొక్కడం కలకలం రేపుతోంది.
బాధితులు ఉపయోగించిన మై క్వీన్ యాప్
మార్కాపురం ప్రాంతంలో మై క్వీన్ యాప్ లింక్ను పంపి కేవలం పది రోజుల్లోనే దాదాపు రూ.పది కోట్లు దోచేశారు. హైదరాబాద్, చెన్నై కేంద్రంగా నడుస్తున్న ఈ యాప్ లింక్ను ఇక్కడి వారికి వాట్సాప్ ద్వారా పంపారు. అందులోకి చరవాణి నెంబర్ ద్వారా లాగిన్ అయితే వివరాలు కన్పించడంతో తమ వద్ద ఉన్న నగదు మొత్తం డిపాజిట్ చేసి మోసపోయామని బాధితులు వాపోతున్నారు. కేవలం ఒక్క రూపాయి పెట్టుబడి పెడితే ఏడు రెట్లు అందిస్తామంటూ నిర్వాహకులు వారిని రొచ్చులోకి దింపారు. మొదట్లో రూ.750, రూ.860, రూ.1250, రూ.1650, రూ.2500 వంటి చిన్న మొత్తాలను చెల్లించి వారికి నమ్మకం కుదిరేలా చేశారు. డిపాజిట్ చేసిన నగదుకు ఆరేడు రెట్లు చెల్లిస్తుండటంతో స్థానికులు ఎగబడి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టగా..ఆ తర్వాత మై క్వీన్ నిర్వాహకులు పత్తాలేకుండాపోయారు.
ముందుకు రాని పోలీసులు
- మార్కాపురంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు మై క్వీన్ యాప్లో డబ్బులు జమచేసి నష్టపోయినట్లు సమాచారం. ఒకరి నుంచి మరొకరిని చైన్ లింకు ద్వారా ఈ యాప్ పరిచయం చేశారు. దీంతో ఖర్చుల కోసం తెచ్చుకున్న, దాచుకున్న నగదును యాప్లో పెట్టి వారు నిండా మునిగారు. ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు దోచుకున్నారు.
- కంభంలోని ఓ బంగారు దుకాణ వ్యాపారి రూ.లక్షల్లో నగదు జమచేయగా, ఆ తర్వాత నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. ః అర్థవీడు మండలంలోని ఓ గిరిజన తండాలో మైక్వీన్ యాప్ ద్వారా ఒకే రోజు 30 కుటుంబాల వారు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున పెట్టి రోడ్డున పడ్డారు.
మై క్వీన్ ద్వారా నష్టపోయామంటూ బాధితులెవరూ ముందుకు రాలేదని పశ్చిమ ప్రాంతంలోని దాదాపు దాదాపు 15 మండలాల్లోని పోలీసులు చెబుతున్నారు. ఒక్కరైనా నష్టపోయినట్లు తమను సంప్రదిస్తే కేసు నమోదు చేస్తామని వారంటున్నారు తప్ప దీనిపై పూర్తిస్థాయి విచారణ మాత్రం చేపట్టడం లేదు. కనీసం సుమోటోగా అయినా కేసు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. ఇలా నిర్లిప్తంగా ఉండటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ ట్యాంకులో ఒరిగిన వీరుడా.. వందనం
[ 03-07-2024]
దేశ సేవే తన ప్రథమ కర్తవ్యంగా భావించారు. విధి నిర్వహణలో భాగంగా లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధ ట్యాంకులో నది దాటుతూ మృత్యువుకు చిక్కారు. -
రూ.30 కోట్ల భూమిలో వైకాపా గద్దలు
[ 03-07-2024]
వైకాపా నేతల భూదాహానికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనేందుకు ఇదో నిదర్శనం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ నాయకులు కొందరు గద్దల అవతారమెత్తారు. తమకు అడ్డేముందంటూ రెచ్చిపోయారు. -
వదిలింది బొమ్మ్ఠాళీ.. రద్దు రూ.80 వేలు
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వం తెచ్చిన తలనొప్పుల్లో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ఒకటి. ఇందులో భాగంగా జిల్లాలో చేపట్టిన రీసర్వే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. -
న్యాయం.. భారతీయ స్వరూపం
[ 03-07-2024]
రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా, ఏ ప్రాంతం నుంచైనా ఫిర్యాదు చేసే అవకాశం. ఫిర్యాదు అందిన స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేరం జరిగిన ప్రాంతంలోని స్టేషన్కు కేసును బదిలీ చేసే వెసులుబాటు. -
పింఛను అదనపు లబ్ధి రూ.87 కోట్లు
[ 03-07-2024]
నెల రోజుల్లోనే సామాజిక పింఛన్ల పంపిణీలో ఎంతో మార్పు చోటుచేసుకుంది. లబ్ధిదారులకు ఇస్తామన్న నగదును ఇంటి వద్దనే అందించింది తెదేపా కూటమి ప్రభుత్వం. -
ఇన్ని రోజులు గుడ్లు పెడుతున్నారా!
[ 03-07-2024]
‘ప్రజా సమస్యలు, వినతులపై బాధ్యతగా పనిచేయాలి. అలా చేయని అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం’ అని సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ రోణంకి హెచ్చరించారు. -
వెలిగొండ పూర్తి చేస్తాం.. సమస్యలు పరిష్కరిస్తాం
[ 03-07-2024]
పశ్చిమ ప్రకాశం వాసుల ఆశాజ్యోతి అయిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రాధాన్యమిస్తామని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. -
హవ్వ.. దాతృత్వానికీ మస్కా
[ 03-07-2024]
దాతల చేతలనూ గత ప్రభుత్వంలోని వైకాపా నేతలు అపహాస్యం చేశారు. మంచి మనసున్న వారి దాతృత్వంతో చెలగాటమాడారు. ఇందుకు మండలంలోని నర్రమారెళ్లలోని ఉదంతమే నిదర్శనం. -
వీరుడికి కన్నీటి వీడ్కోలు
[ 03-07-2024]
వీరుడికి జన్మనిచ్చిన కాలువపల్లి కన్నీటి సంద్రమైంది..దేశమాత రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బిడ్డను చూసి ఆ పల్లె తల్లడిల్లింది. విషణ్న వదనాలతో కన్నీటి వీడ్కోలు పలికింది. -
ఈలవేసి.. గోలచేసిన ఏఎస్సై వెంకటేశ్వర్లు సస్పెన్షన్
[ 03-07-2024]
విధి నిర్వహణను మరిచి మద్యం మత్తులో ఈలవేసి, గోలచేసిన ముండ్లమూరు ఏఎస్సై ఎ.వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటుపడింది. -
ప్రియుడితో కుట్రపన్ని.. భర్తను హతమార్చి..
[ 03-07-2024]
రామాపురంలో రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కుట్రపన్ని భార్యే ఈ కిరాతకానికి ఒడిగట్టినట్లు వారు తెలిపారు. -
సీజ్ చేసిన అక్రమ నిర్మాణం ధ్వంసం
[ 03-07-2024]
గిద్దలూరు కాశిరెడ్డికుంటలో అక్రమ నిర్మాణాన్ని నగర పంచాయతీ అధికారులు సీజ్ చేయగా..సోమవారం రాత్రి యంత్రంతో దాన్ని ధ్వంసం చేసిన యజమానితో పాటు సహకరించిన వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
యూనిఫామ్ తీసి.. రైలు కిందపడి ఏఎస్సై ఆత్మహత్య
-
అందుకే తడబడ్డాను.. ట్రంప్తో సంవాదంపై బైడెన్
-
టీషర్ట్, చిరిగిన జీన్స్తో కళాశాలకు రావొద్దు
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన