Rammohan Naidu: భోగాపురం ఇక ‘భాగ్యరేఖ’.. రామ్మోహన్నాయుడు ప్రత్యేక దృష్టి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్తో పూర్తి చేయిస్తా. పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి కృషి చేస్తా.
ఉత్తరాంధ్ర ప్రజల్లో కొత్త ఆశలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్తో పూర్తి చేయిస్తా. పక్కా ప్రణాళికతో నిర్ణీత గడువులోగా ప్రారంభోత్సవానికి కృషి చేస్తా. రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ శాఖ చేపట్టిన అప్పటి మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, అశోక్గజపతిరాజు వంటి సీనియర్లతో చర్చిస్తా. భోగాపురం సహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల అభివృద్ధిలో నా మార్కు ఉండేలా చిత్తశుద్ధితో పనిచేస్తా.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కింజరాపు రామ్మోహన్నాయుడు
ఈనాడు-విజయనగరం, న్యూస్టుడే, భోగాపురం: భోగాపురం విమానాశ్రయం పనులు ఇక విమానం కన్నా వేగంగా పరుగులు తీయనున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విమానాశ్రయానికి అవసరమైన 2700 ఎకరాల సేకరణకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రగతికి మణిహారంగా ఉండేలా ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు.
మౌలిక వసతులు కరవు
ఏడాది క్రితం విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా మౌలిక వసతులు లేక, పూర్తిగా భూములు అప్పగించక సుమారు ఆరు నెలల పనుల్లో ఎలాంటి కదలిక కనిపించలేదు. ప్రస్తుతం 3.8 కి.మీ. పొడవు గల రన్వే పనులు 10 శాతం అయ్యాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామ్మోహన్నాయుడు విమానాశ్రయ పనులపై దిల్లీలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి జీఎంఆర్ సంస్థకు అన్ని విధాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా సహకరించాలని నిర్ణయించారు.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్
గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన వైకాపా నాలుగేళ్ల పాటు అటువైపు చూడలేదు. ఎన్నికలు ఏడాది ఉండగా గతేడాది మే 3న అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారు. ఇది పూర్తయితే ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు, వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్న ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు.
చంద్రబాబు ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో అందరిలో కొత్త ఆశలు చిగురించాయి. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం, విజన్ గల చంద్రబాబు దృష్టి పెట్టడంతో వేగంగా పూర్తి కానుంది. తెదేపా హయాంలో 2,700 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించగా, వైకాపా ప్రభుత్వం అందులో 500 ఎకరాలను పక్కన పెట్టింది.
సాగుతున్న విమానాశ్రయ పనులు
ఇకపై ముమ్మరం
సుమారు రూ.5 వేల కోట్ల వ్యయంతో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి పనులు చేపట్టింది. ప్రభుత్వం కేటాయించిన 2200 ఎకరాల్లోనే రన్వేతో పాటు, టెర్మినల్, సిగ్నలింగ్ పాయింట్, కార్గో విభాగాల భవనాల పనులు ప్రారంభించింది. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. 2025 డిసెంబరు నాటికి దీన్ని పూర్తి చేయాలని జీఎంఆర్ సంస్థ సంకల్పించింది. దీనికి ఎదురైన అడ్డంకులు తొలగించి, మౌలిక వసతుల పరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే గడువుకు రెండు, మూడు నెలల ముందే పూర్తవుతుందని జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ఏటా 60 లక్షల మంది విమానయానం చేసే సామర్థ్యంతో తొలిదశ పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు కొనసాగిస్తున్నారు.ప్రభుత్వాల చొరవతో మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి.
టెర్మినల్ నిర్మాణం
ముందుకెళ్లని ట్రంపెట్
విశాఖ - శ్రీకాకుళం మార్గంలో జాతీయ రహదారిపై ట్రంపెట్ ఆకారంలో పై వంతెన నిర్మాణానికి తెదేపా హయాంలోనే స్థల సేకరణ చేపట్టారు. ఈ పనులు ఇప్పటికీ
ముందుకెళ్లలేదు. ఇది పూర్తయితే గానీ టెర్మినల్కు వెళ్లే మార్గం ఉండదు. ఇప్పుడు పనులు వేగవంతమయ్యేలా దృష్టి సారించనున్నారు. విమానాశ్రయానికి సంబంధించి ప్రత్యేక విద్యుత్తు సబ్స్టేషన్ నిర్మాణంలో పురోగతి లేదు. దీని కోసం ముక్కాం గ్రామ సమీపంలో సుమారు ఆరు ఎకరాల స్థలం కేటాయించారు. దీనిపై త్వరలో సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. విమానాశ్రయంలో వివిధ హోదాల్లో పనిచేసే ఉద్యోగులకు, సిబ్బందికి ప్రత్యేకంగా నివాస గృహ సముదాయాల నిర్మాణానికి తూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల భూమి కేటాయించారు. ఇందులో సుమారు 20 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. వీటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా పనులకు రూ.198 కోట్లతో శంకుస్థాపన జరిగి ఏడాది గడిచినా ఏ మాత్రం కదలిక లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజా వేదిక శిథిలాలు అక్కడే
-
భారాసకు భారీ షాక్.. కాంగ్రెస్లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
రకుల్ప్రీత్ రెడ్ హాట్ లుక్.. మడోన్నా అలలతో ఆట.. మేకప్తో మాళవిక!
-
పాకిస్థాన్లో లీటరు పాల ధర రూ.370.. ఆ దేశాల కంటే అధికం!