logo

Politics: పింఛన్‌ల పంపిణీ

ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. 

Published : 01 Jul 2024 17:18 IST

బలిజిపేట: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీని సీఎం చంద్రబాబునాయుడు మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. బలిజిపేట మండల కేంద్రంలో సామాజిక పింఛనుదారులకు, వికలాంగులకు ఆయన అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇంటికి వెళ్లి నగదును అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి వృద్ధులతో మాట్లాడారు. పెంచిన పింఛను భృతి వల్ల పింఛనుదారులకు ఎంతో భరోసా కలిగిందని, గృహాల్లో తమకు విలువ ఎంతో పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో  తెదేపా మండల అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు బి.రామ్మోహనరావు, కార్యదర్శి అప్పారావు,  జనసేన నాయకులు పోలినాయుడు, కుమారస్వామి, వెంకటరమణ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని