logo

గిరిజనుల జీవితాల్లో వెలుగులు

రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు.

Published : 05 Jul 2024 02:25 IST

అల్లూరి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జేసీ శోభిక, ఇన్‌ఛార్జి డీఆర్వో కేశవనాయుడు

పార్వతీపురం, న్యూస్‌టుడే: రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. గురువారం అల్లూరి జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డీఆర్వో కేశవనాయుడుతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపేందుకు ఎంతో కృషి చేశారన్నారు. పీఆర్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఎస్‌ఈ కృష్ణాజీ ఆధ్వర్యంలో అల్లూరికి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని