దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి.
న్యూస్టుడే, బొబ్బిలి, రామభద్రపురం: అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. ఉమ్మడి జిల్లాలో జూన్, జులై నెలల్లో ధరలు సాధారణ స్థితిలోనే ఉంటాయి. ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
దళారుల ప్రవేశంతో..
పచ్చిమిర్చి, అల్లం, టమాటా ధరలు భారీగా పెరిగాయి. అల్లం కిలో రూ.150 పైచిలుకు పలుకుతోంది. సామాన్యుడు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి భారీగా పెంచేస్తున్నారు. ఉల్లి, క్యారెట్, బీట్రూట్ సైతం సామాన్యుడికి అందడం లేదు. కొందరు వ్యాపారులు నేరుగా పొలాల్లోకి వెళ్లి గుత్తగా కొనుగోలు చేసి మార్కెట్లో నచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అన్నదాతలు నష్టపోతున్నారు.
నిలిచిన ఎగుమతులు
రామభద్రపురం కూరగాయల మార్కెట్ నుంచి నిత్యం 30 నుంచి 40 టన్నుల వరకు ఎగుమతులు జరుగుతాయి. ఒడిశా, విశాఖ, కాకినాడ, రాజమహేంద్రవరంతో పాటు పలు ప్రధాన పట్టణాలకు ఇక్కడి నుంచి వెళ్తుంటాయి. దిగుబడులు లేక ఎండిపోయాయి. దీంతో విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, పార్వతీపురం వంటి పట్టణాల్లో ఇటీవల అమాంతంగా ధరలు పెరిగాయి. గతంలో ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి ఉంటే ఇప్పుడు మూడు టన్నుల్లోపే ఉంది.
అధిక ఉష్ణోగ్రతలతోనే..
అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల పంటలు పాడయ్యాయి. కొన్ని రకాల పంటలు ఎండిపోయాయి. నీటి సౌకర్యం పుష్కలంగా ఉన్న పరిస్థితి బాగానే ఉంది. మిగిలిన చోట్ల తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. పడాల్సిన సమయంలో వర్షాలు లేవు. దీనివల్ల 50 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఈమేరకు రైతులకు సూచనలు చేస్తున్నాం.
మోహనకృష్ణ, ఉద్యానశాఖాధికారి, రామభద్రపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ప్రభుత్వ విధానాలతో రూ.వేల కోట్ల నష్టం
[ 07-07-2024]
స్వప్రయోజనాల కోసమే వైకాపా ప్రభుత్వం ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖను విడదీసిందని ఆ శాఖ జేఏసీ సభ్యులు ఎస్.శ్రీనివాసరావు, కె.కామేశ్వరరావు, ఎ.రామమూర్తి, కె.సురేష్ ఆరోపించారు. -
తోటపల్లి ప్రధాన కాలువకు కొత్త కళ
[ 07-07-2024]
వైకాపా ప్రభుత్వం అయిదేళ్లపాటు నిర్లక్ష్యంగా వదిలేసిన తోటపల్లి కుడి ప్రధాన కాలువకు ఎట్టకేలకు మంచి రోజులు వచ్చాయి. -
4.1 కిలోల శిశువు జననం
[ 07-07-2024]
పాచిపెంట పీహెచ్సీలో శనివారం ఓ గర్భిణి 4.1 కిలోల బరువున్న బిడ్డకు జన్మనిచ్చినట్లు వైద్యుడు వెంకటరమణ తెలిపారు. -
వైద్య సేవలు బలోపేతం
[ 07-07-2024]
మన్యంలో ఆసుపత్రులు బలోపేతం చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. గర్భిణుల వసతి గృహాలు, అంబులెన్సుల సేవలు అటకెక్కాయి. -
ప్రత్యేక డ్రైవ్లో 306 కేసులు
[ 07-07-2024]
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రధాన కూడళ్లలో ఆర్టీసీ యంత్రాంగంతో కలిసి ముమ్మర తనిఖీలు చేసినట్లు జిల్లా రవాణా అధికారి శశికుమార్ తెలిపారు. -
ఉపాధికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ
[ 07-07-2024]
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నది ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైపుణ్య ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
మీరు భలే ఉంటారు...! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్