నదులన్నీ తవ్వేశారు.. ఇసుకంతా బొక్కేశారు
జగన్ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు.
ఏటా ఐదు లక్షల టన్నులకు పైగా దోపిడీ
అంతా వైకాపా అనుచరులే
నదిలో తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో నీరు
జగన్ అధికారంలోకి వచ్చి రావడమే తరువాయి ఇసుక విధానాన్ని సవరించి, స్టాక్ పాయింట్లను ప్రభుత్వమే నిర్వహించి తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తామని నమ్మించారు. తర్వాత అస్మదీయులకు తాయిలం ఇచ్చినట్లు ఇసుక రేవులను ధారదత్తం చేశారు. ఇక అంతే.. నదుల్లో ఎక్కడ ఇసుక దొరికితే అక్కడ కొల్లగొట్టేయడమే పనిగా పెట్టుకుని తమకు నచ్చిన చోటుకు తరలించారు. అడిగే వారు లేరు. అడ్డేవారు ఉండరు అన్న రీతిలో సాగింది. ఇప్పుడు ప్రభుత్వం మారి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఇసుక ముఠాలు ఎక్కడి వారక్కడ కుక్కిన పేనుల్లా ఉండిపోయారు. వీరిని వైకాపా ప్రభుత్వం ఉన్నంత కాలం అధికారులు కానీ, అనధికారులు కానీ ఏమీ అనలేకపోయారు. గనుల శాఖ యంత్రాంగం అసలు ఉందో లేదో తెలియని స్థితికి చేరిపోయింది. ఎపుడైనా అడ్డగించి నిబంధనలు వల్లె వేస్తే, జిల్లాను నడిపించే సారథులే నేరుగా రంగంలోకి దిగే పరిస్థితులు ఉండేవి.
న్యూస్టుడే, పార్వతీపురం: జిల్లాలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక లభిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఏటా జిల్లాలో 3.75 లక్షల టన్నులు నదుల్లో లభిస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో అండదండలు పుష్కలంగా ఉండడంతో జిల్లా నుంచి ఐదు లక్షల టన్నుల వరకు ఏటా తరలించుకొని కొందరు సొమ్ము చేసుకున్నారు. ఈ లెక్కన కొన్ని వందల కోట్ల రూపాయలు జిల్లా నుంచి అస్మదీయుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. జిల్లాకు ఏం ఇచ్చారు? ఇసుక తవ్వకాలతో వచ్చిన లాభమేమిటి? అనే అంశాలు ఇప్పుడు అధికారులు వెతుక్కుంటున్నారు.
అంతా ఖజానాకే..
తెదేపా పాలనలో స్థానిక సంస్థలకు ఇసుక సేకరణ ద్వారా వచ్చిన ఆదాయంలో వాటాను అందించేవారు. ఆ మొత్తాన్ని ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి వినియోగించుకొనే వారు. వైకాపా ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. ఇసుక రేవుల నిర్వహణ అంతా ఒక సంస్థకే అప్పగించారు. ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖజానాకే జమైంది. దాని వల్ల స్థానిక సంస్థలకు ఏమొచ్చింది? ఎంతొచ్చింది అనేది తెలియదు.
రేవులు ఎక్కడ?
- ప్రస్తుతం కొన్ని రేవులను అధికారులు గుర్తించారు.
- భామిని మండలంలో నేరడి, పసుకుడి, నులకజోడు, లివిరి రేవులున్నాయి. వీటిలో నేరడి, పసుకుడిలోనే ఇసుక సేకరణకు అనువైన పరిస్థితులు ఉన్నాయి.
- కొమరాడ మండలం కొరిశిల రేవులో నాగావళి నుంచి ఇసుకను సేకరించేందుకు ప్రతిపాదనలు పరిశీలించారు.
సీనరేజ్ ఎక్కడికెళ్లిందో..
జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద వేలాదిగా భవన నిర్మాణాలు చేపట్టారు. వీటికి ఇసుక అవసరం. గుత్తేదారుల వద్ద ఇసుక వినియోగానికి సంబంధించి సీనరేజ్ ఛార్జీలు వసూలు చేశారు. జిల్లాలో దాదాపు రూ.50 లక్షల వరకు వసూలైంది. ఈ మొత్తం గనుల శాఖ ఖాతాలోకి జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులకు కూడా తెలియదు.
అనుమతులు రాలేదు
రాష్ట్రంలో ఇసుకపై కొత్త విధానాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో నాగావళి, వంశధార నదుల్లో ఇసుక తవ్వకాలకు రేవులను గుర్తించి ప్రతిపాదించారు. కానీ వీటికి అనుమతులు రాలేదు. ఇసుక విధానంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నందున, మారిన నిబంధనల మేరకు మళ్లీ గుర్తింపునకు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
- రేవుల గుర్తింపులో ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. భౌగోళిక అంశాలు అనువుగా ఉండాలి.
- నాగావళి, వంశధార నదులు ఆంధ్ర, ఒడిశా తీరాలను తాకుతూ ప్రవహిస్తాయి. సరిహద్దులకు పరిమిత దూరంలో రేవు ఉంటే అక్కడ తవ్వకానికి అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదు. జిల్లాలో అలాంటివి కొమరాడ మండలం కొరిశిల, భామిని మండలం నేరడి, పసుకుడి ఉన్నాయి.
- అలాగే నది గట్టు కూడా ప్రతిపాదిత దూరం దాటి ఉండాలి. ఈ రెండు అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఆరేడు రేవుల్లో కేవలం మూడు మాత్రమే ప్రమాణాలకు నిలుస్తున్నాయి.
నిబంధనలు కోసం ఎదురుచూస్తున్నాం
జిల్లాలో ఏటా 3.75 లక్షల మెట్రిక్ టన్నులు లభిస్తుందనేది ఒక అంచనా ఉంది. కొత్త ఇసుక విధానం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. గతంలో ప్రతిపాదించిన రేవులకు ఎటువంటి అనుమతులు రాలేదు. అందువల్ల జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదు.
- శ్రీనివాసరావు, ఏడీ, గనుల శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ