మన బడులకు మహర్దశ
విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది.
పీఎంశ్రీలో అభివృద్ధి
నర్సిపురం పాఠశాలలో క్రీడా ప్రాంగణం అభివృద్ధి
పార్వతీపురం గ్రామీణం, న్యూస్టుడే: విద్యా వ్యవస్థలో ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. మండలానికి ఒకటి చొప్పున తొలి విడతలో జిల్లాలోని 19 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో బడిలో సౌకర్యాల కల్పనకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తారు. తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, తాగునీటి సౌకర్యం, ప్రయోగశాల, డిజిటల్ గ్రంథాలయం, సౌర విద్యుత్తు, అంతర్జాల సౌకర్యం, క్రీడా ప్రాంగణం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనులు చేపడుతున్నారు.
పీఎంశ్రీ పథకానికి అర్హత ఉన్న పాఠశాలల వివరాలు యాజమాన్యాలు ఆన్లైన్లో దరఖాస్తు చేశాయి. వీటిని మండల, జిల్లా స్థాయిల్లో వడపోసిన తర్వాత రాష్ట్రస్థాయికి నివేదిస్తారు. అక్కడ నుంచి ఎంపికైన పాఠశాలల పేర్లు కేంద్రానికి పంపిస్తారు. చివరగా జాతీయ స్థాయిలో తుది జాబితాను ప్రకటిస్తారు. పాఠశాలల ఉనికి, అవసరాలు, స్థలం, హాజరు, ఉత్తీర్ణతల మేరకు ప్రాధాన్యమిస్తారు.
జిల్లాలో వీటికి అవకాశం
జిల్లా నుంచి మొత్తం 19 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో భామిని- ఆదర్శ, రేగిడి- జీటీడబ్ల్యూఏ ఉన్నత, కొమరాడ- ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్, కురుపాం- జీటీడబ్ల్యూఏహెచ్ఎస్, మక్కువ (ములక్కాయవలస)- ఏపీఎంఎస్, అన్నవరం- ఎంపీపీఎస్, నర్సిపురం- ఎంపీపీఎస్ (ఆర్), పార్వతీపురం (బెలగాం)- జీహెచ్ఎస్, పురోహితునివలస- ఏపీఎంఎస్, సాలూరు- ఎంపీఎల్ ఉన్నత, హడ్డుబంగి- ఎస్టీడబ్ల్యూఏహెచ్ఎస్, బలిజిపేట, గరుగుబిల్లి, చినమేరంగి మక్కువ, పాంచాలి, పాలకొండ, వీరఘట్టం, గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
వేగంగా పనులు
ఈ పథకంలో మంజూరైన పనులను సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నేతృత్వంలో జిల్లా అధికారులు పర్యవేక్షిస్తారు. పార్వతీపురం మండలంలోని నర్సిపురం ప్రాథమిక (ఆర్) పాఠశాలకు తొలి విడతగా రూ.లక్ష ఇచ్చారు. ఇక్కడ విశాలమైన స్థలం ఉండటంతో క్రీడా ప్రాంగణం పనులు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, షటిల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్ఎం శారద తెలిపారు. పనులను డీఈఈ నారాయణస్వామి, ఏఈ శ్రీకర్ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో ఎంపిక చేసిన అన్ని పాఠశాలల్లో అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు డీఈవో పగడాలమ్మ తెలిపారు. వేగంగా పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
-
క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నా: రిషి సునాక్
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు