లాజిస్టిక్స్ ఆదాయంలో ముందంజ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది.
ద్వితీయస్థానంలో విజయనగరం రీజియన్
విజయనగరంలోని సరకు రవాణా కేంద్రం
విజయనగరం కోట, న్యూస్టుడే: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కేవలం ప్రయాణికులను గమ్యస్థానానికి తరలించడమే కాకుండా, లాజిస్టిక్స్ సేవలనూ అందిస్తోంది. ఈమేరకు ఏటా ఆదాయాన్ని పెంచుకుంటూ పురోగతి దిశలో పయణిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో రూ.9.88 కోట్ల ఆదాయంతో విజయనగరం రీజియన్ రాష్ట్రంలో ద్వితీయస్థానంలో నిలిచింది. గడిచిన నాలుగేళ్లుగా ఈ రికార్డును నిలుపుకొంటోంది. ప్రస్తుతం 23 వాహనాలను వినియోగిస్తోంది. విజయనగరం జిల్లాలో 6, శ్రీకాకుళం- 13, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 బస్సులు తిరుగుతున్నాయి.
సేవలు ఇలా..
ఈ విధానంలో భాగంగా సరకులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించవచ్చు. నిత్యం తరలించేవారు నెలవారీ బుకింగ్కు ముందుగానే రవాణా ఛార్జీలు చెల్లిస్తే రాయితీ అందించనున్నారు. సరకు వెళ్లే గమ్యస్థానం ఆధారంగా కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకుని ధర నిర్ణయిస్తారు. 10 టన్నుల వరకు తరలిస్తారు. అంతకుమించి ఉంటే ముందుగానే లాజిస్టిక్స్ కేంద్రాన్ని సంప్రదించాలి. 2021లో 1.78 లక్షలు, 2022లో 2.46 లక్షలు, 2023లో 3 లక్షలు, 2024 మార్చి నాటికి 3.05 లక్షలు పార్శిల్స్ బుకింగ్ అయ్యాయి. ప్రస్తుతం వ్యాపారస్థులు, కార్యాలయాలు, విద్యాసంస్థలు పెద్దఎత్తున వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ సైతం ముందుకొచ్చింది.
ఏజెంట్ల నియామకం..
సేవల పెంపులో భాగంగా ఇప్పటికే మండలాల వారీగా ఏజెంట్లను నియమించారు. విజయనగరం జిల్లాలో 42 మంది ఉన్నారు. అయితే నేరుగా వ్యక్తుల వద్దకు వెళ్లి సరకులు ఇచ్చే అవకాశం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఆ విధానాన్ని సైతం అందుబాటులోకి తెస్తామని లాజిస్టిక్స్ విభాగం అధికారిణి దివ్య తెలిపారు. జిల్లాలో ఏమూల నుంచైనా సరకులు రవాణా చేసే విధంగా ఏజెంట్లను నియమించామన్నారు. ఈ ఏడాది 16 లక్షల పాఠ్యపుస్తకాలు, మండల కేంద్రాలకు పెద్దఎత్తున విత్తనాలను తీసుకెళ్లామని చెప్పారు. సేవలు పెరుగుతుండడంతో ప్రస్తుతం విజయనగరంలో ఉన్న గోదాము సరిపోవడం లేదని, దీంతో లాజిస్టిక్స్ కార్యాలయం పక్కనే విస్తరణ పనులు చేపట్టామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ