ఈఎస్ఐ సేవలు అందేదెప్పుడో?
గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది
రోజూ ఇలా ఖాళీగానే ఈఎస్ఐ కేంద్రం
న్యూస్టుడే, వైద్యవిభాగం: గత ప్రభుత్వం నిస్తేజంగా మార్చిన వ్యవస్థల్లో ఈఎస్ఐ విభాగం ఒకటి. ఈఎస్ఐ కార్డుదారులకు వైద్యం అందించేందుకు ఇది పనిచేస్తోంది. అయితే వైకాపా హయాంలో మూలకు చేరింది. కార్పొరేట్ స్థాయిలో నిపుణులున్నా సేవలు కానరావడం లేదు. దీంతో రోగులు, క్షతగాత్రులంతా ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో డయాగ్నోస్టిక్ కేంద్రం ఉంది. ప్రస్తుతం దీని పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
సమస్యలివీ..
- ఈ కేంద్రంలో ల్యాబ్తో పాటు ఇద్దరు టెక్నీషియన్లు ఉన్నారు. కానీ రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేక.. ఇద్దరూ ఖాళీగానే ఉంటున్నారు. వచ్చే రోగులకు కనీసం రక్తపోటు, యూరిన్ టెస్టులు కూడా చేయలేకపోతున్నారు. థైరాయిడ్ రోగులైతే ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సిందే.
- ఎక్స్రే యూనిట్లో టెక్నీషియన్ లేరు. ఇప్పటికే సంబంధిత యంత్రం మూలకు చేరింది. ఎవరైనా వస్తే బయటే ఎక్స్రే తీయించుకోవాలి
- జనరల్ మెడిసన్, గైనిక్, ఆర్థోపెడిక్, దంత, జనరల్ సర్జికల్, చిన్న పిల్లల వైద్య నిపుణులున్నారు. ఈఎన్టీ, రేడియాలజీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసీజీ, ఆల్ట్రాసౌండ్ స్కాన్ సేవలు అప్పుడప్పుడూ అందుతున్నాయి. ఫార్మాసిస్టు, స్టాఫ్నర్సులు, ఎఫ్ఎన్వో, ఎంఎన్వో, నాల్గో తరగతి ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. కానీ సేవలు దూరమయ్యాయి.
డిస్పెన్షరీలు ఉన్నా తప్పని రిఫరల్స్..
నెల్లిమర్ల, గరివిడి, బొబ్బిలి, కొత్తవలస, పైడిభీమవరంలో డిస్పెన్షరీలు సాగుతున్నాయి. అక్కడ సెలవులు, మందులు.. తదితర సేవలు అందుతాయి. వాటికంటే ఇక్కడ పరిస్థితి అధ్వానం. సాధారణంగా వీటి నిర్వహణకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులివ్వాలి. అయితే గత అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. పోస్టులను భర్తీ చేయలేదు. మందులు, కిట్ల సరఫరా కూడా ఆగిపోయింది. దీంతో వైద్యులు ఓపీకి మాత్రమే పరిమితమయ్యారు. స్కానింగ్లు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు అవసరమైతే బయటే చేయించుకొని రమ్మంటున్నారు. కొన్నిసార్లు విశాఖకు రిఫర్ చేస్తున్నారు.
అధ్వానంగా కేంద్రం
కేంద్రం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. ఆవరణలో పెద్దఎత్తున మొక్కలు పెరిగాయి. కంటోన్మెంట్లోని భవనం శిథిలస్థితికి చేరడంతో ఇప్పటికే పెచ్చులూడుతోంది. దీంతో రోగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సేవలు కూడా మందగించడంతో చాలామంది విశాఖలోని ప్రధాన కేంద్రానికే వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిపై ఇన్ఛార్జి సూపరింటెండెంట్ కృష్ణకిశోర్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. సేవల పరంగా ఇబ్బందులు లేవని, అత్యవసరమైతేనే మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేస్తున్నామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్యులంతా అందుబాటులో ఉంటారని చెప్పారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, దశలవారీగా వాటిని పరిష్కరిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధైర్యంగా వెళ్లొచ్చు.. ఇసుక తెచ్చుకోవచ్చు
[ 05-07-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. -
నాడు గొప్పలు.. నేడు తిప్పలు
[ 05-07-2024]
నాడు- నేడు పథకం ద్వారా బడుల రూపురేఖలు మారుస్తామని గొప్పలు చెప్పిన గత ప్రభుత్వం.. విద్యార్థులకు కష్టాలనే మిగిల్చింది. పాఠశాలల్లో అరకొర పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
జగనన్న.. భూభాగోతం
[ 05-07-2024]
పేదలకు ఇళ్ల స్థలాల పేరిట గత ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. -
సొసైటీలనూ ముంచేశారు
[ 05-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్) నిస్తేజంగా మారాయి. కనీస నిధులు ఇవ్వకపోవడం, బకాయిల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో రైతులకు సేవలు అందలేదు. -
కొట్టుకుపోయిన కాలువ గట్టు
[ 05-07-2024]
తోటపల్లి కుడి ప్రధాన కాలువకు అల్లు పాల్తేరు వద్ద పడిన గండి పరిమాణం రోజురోజుకూ పెరుగుతోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి పోరాట స్ఫూర్తి ఎంతో గొప్పదని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు అన్నారు. -
ప్రసూతి మరణాలు సంభవిస్తే చర్యలు
[ 05-07-2024]
జిల్లాలో ఒక్క ప్రసూతి మరణం సంభవించినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ హెచ్చరించారు. -
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
[ 05-07-2024]
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి నిద్ర లేకుండా చేసి, భరతమాత విముక్తి కోసం పోరాడిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని జేసీ శోభిక అన్నారు. -
‘వైకాపా కార్యాలయ భవనం అక్రమమే’
[ 05-07-2024]
పార్వతీపురంలోని వైకాపా జిల్లా కార్యాలయ భవనం అక్రమ నిర్మాణంగా భావిస్తూ రెండో నోటీసు జారీ చేశామని అధికారులు తెలిపారు. -
కొండలపై రోడ్ల నిర్మాణానికి పెద్దపీట
[ 05-07-2024]
గిరిజన ప్రాంతాల్లోని మారుమూల కొండలపైనున్న గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. -
అతిసారం.. అప్రమత్తత అవసరం
[ 05-07-2024]
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో అతిసారం ఒకటి. దీన్ని డయేరియా అని కూడా అంటారు. పిల్లల్లో మరణాలకు ఇది ప్రధాన కారణం. -
దిగుబడులు తగ్గాయి.. ధరలు పెరిగాయి
[ 05-07-2024]
అకాల వర్షాలు, వాతావరణంలో మార్పులు కూరగాయల దిగుబడులపై ప్రభావం చూపాయి. -
గిరిజన విశ్వవిద్యాలయ భూముల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
[ 05-07-2024]
కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి కేటాయించిన కొండపోరంబోకు భూముల్లో కొందరు కంకర (గ్రావెల్)ను అక్రమంగా తరలించుకుపోతున్నారు. -
తొమ్మిదేళ్లుగా బాలారిష్టాలు
[ 05-07-2024]
కొత్తవలసలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) కల్యాణ మండపానికి బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. -
సేవలు కొనసాగించాలని నిరసన
[ 05-07-2024]
గిరిజన సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్న సవర భాషా వాలంటీర్ల సేవలు కొనసాగించాలని ఐటీడీఏ కార్యాలయం ముందు వాలంటీర్లు నిరసన తెలిపారు. -
‘అందుకే మంత్రి పదవి రాలేదేమో’
[ 05-07-2024]
కోమటిపల్లి జ్యోతిబాఫులే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బేబినాయన గురువారం విద్యా సామగ్రి కిట్లు పంపిణీ చేశారు. -
ఉద్యోగోన్నతులు వచ్చినా పోస్టింగులు లేవు
[ 05-07-2024]
జిల్లాలో తొమ్మిది మంది గ్రేడ్-2 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్-1 కింద ఉద్యోగోన్నతులు లభించి మూడు నెలలైనా ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వకపోవడంపై ఎదురు చూపులు చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు
-
రక్తంలో కొలెస్ట్రాల్పై కొత్త మార్గదర్శకాలు.. తొలిసారి జారీ చేసిన సీఎస్ఐ
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ